ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వెహికల్స్కి డిమాండ్ పెరుగుతోంది. టాటా మోటార్స్ ఇప్పుడు భారతీయ ఆటో పరిశ్రమలో తన ప్రసిద్ధ కారు టాటా నానోను మళ్లీ ప్రారంభించాలని యోచిస్తోంది! అయితే ఈసారి ఈ కారు పూర్తిగా ఎలక్ట్రిక్తో ఉంటుందని సమాచారం. టాటా నానో ఈ కొత్త వెర్షన్ 2025 నాటికి ప్రారంభించబడవచ్చని తెలుస్తోంది. ఈ క్రమంలో కేవలం రూ.2.5 లక్షల నుంచి రూ.8 లక్షల మధ్య బేసిక్ ధరతోనే టాటా నానో ఎలక్ట్రిక్ వెహికిల్ మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ అవుతున్నట్లు…
నవంబర్ 2024 నెలలో, భారతదేశంలో హోల్సేల్ మార్కెట్లో 3,50,000 కార్లు అమ్ముడయ్యాయి. గతేడాదితో పోలిస్తే %. 4 శాతం పెరిగింది. మారుతీ సుజుకీ అత్యధిక కార్లను విక్రయించింది. హ్యుందాయ్ , టాటా మోటార్స్ 40,000 కంటే ఎక్కువ కార్లను విక్రయించాయి. టయోటా కిర్లోస్కర్ Sh. ఈ నెలలో 40కి పైగా కార్లు అమ్ముడయ్యాయి.
Ratan Tata: రతన్ టాటా.. భారత పారిశ్రామిక రంగంపై చెరగని ముద్ర వేశారు. గుండు సూది నుంచి విమానాల వరకు అనేక కంపెనీలతో దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటారు. ప్రపంచవ్యాప్తంగా 100కి పైగా దేశాల్లో టాటా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. అయితే ఆటోమోటివ్ ఇండస్ట్రీలో రతన్ టాటా తన సత్తాని చాటారు. ఇండికా నుంచి మొదలైన టాటా మోటార్స్ ప్రస్థానం ఇప్పుడు టాటా నెక్సాన్.ఈవీ దాకా కొనసాగింది. ప్రస్తుతం ఇండియాలో ఈవీ కార్లలో టాటా…
Tata Punch New Edition 2024: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ ‘టాటా మోటార్స్’ తన పంచ్ మోడల్లో స్పెషల్ ఎడిషన్ను లాంచ్ చేసింది. ప్రత్యేక, పరిమిత కాల కామో ఎడిషన్ను విడుదల చేసింది. సీవీడ్ గ్రీన్ కలర్లో వచ్చిన ఈ కారు ప్రారంభ ధర రూ.8,44,900 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)గా కంపెనీ నిర్ణయించింది. ప్రత్యేకమైన కామో థీమ్తో తీసుకువచ్చిన ఈ పంచ్లో పలు ప్రీమియం ఫీచర్స్ను పొందుపరిచినట్లు టాటా మోటార్స్ వెల్లడించింది. పంచ్ రెగ్యులర్ వేరియంట్ల ధరలు…
టాటా గ్రూప్ కంపెనీ టాటా మోటార్స్.. తన కస్టమర్లకు భారీ షాక్ ఇవ్వనుంది. తన వాణిజ్య వాహనాల ధరలను జూలై 1 నుంచి 2 శాతం పెంచనున్నట్లు ప్రకటించింది. ముడి సరుకుల ధరలు పెరగడంతోనే ఈ మేరకు అన్ని మోడళ్లు, వేరియంట్ల ధరలను పెంచాల్సి వస్తోందని కంపెనీ తెలిపింది. ఇది మొత్తం వాణిజ్య వాహనాల శ్రేణికి వర్తిస్తుందని.. మోడల్, వేరియంట్ను బట్టి మారుతాయని కంపెనీ పేర్కొంది.
మహారాష్ట్రలోని అమరావతిలో ఎయిర్ ఇండియా ఫ్లయింగ్ స్కూల్ను ప్రారంభించబోతున్నట్లు సమాచారం. ఈ ఫ్లయింగ్ స్కూల్లో ప్రతి సంవత్సరం 180 మంది పైలట్లకు శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నారు. పైలట్ల కొరతను ముందే ఊహించి, ఎయిర్ ఇండియా మహారాష్ట్రలోని అమరావతిలో ఏడాదికి 180 మంది పైలట్లకు శిక్షణ ఇచ్చేందుకు ఒక ఫ్లయింగ్ స్కూల్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Tesla: ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం టెస్లా భారత్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. వచ్చే వారం ఎలాన్ మస్క్ ఇండియాను సందర్శించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీతో ఆయన భేటీ కానున్నారు.
Tata Motors: టాటా మోటార్స్ కార్లు కొనుగోలు చేయాలనుకునే వారు ఇకపై మరింత ధనాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. టాటా మోటార్స్ ఫిబ్రవరి 1 నుంచి అన్ని మోడళ్లపై ధరల్ని పెంచుతున్నట్లు ప్రకటించింది. టియాగో, టిగోర్, ఆల్ట్రోజ్, పంచ్, నెక్సాన్, హారియర్, సఫారీ, టియాగో ఈవీ, టిగోర్ ఈవీ, నెక్సాన్ ఈవీ, పంచ్ ఈవీలపై ధరలు పెరగనున్నాయి.