Hyundai Motor: హ్యుందాయ్ లవర్స్కి షాక్.. జనవరి 1 నుంచి రూ. 25000 వేలు పెంపు..
- జనవరి 1 నుంచి కార్ల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించిన హ్యుందాయ్..
- ఉత్పత్తి వ్యయం, లాజిస్టిక్ ఖర్చులు పెరిగిపోవడంతో ధరలు పెంచినట్లు వెల్లడి..
- ఇప్పటికే కార్ల ధరలను పెంచేసిన ఆడి, బీఎండబ్ల్యూ, బెంజ్ కంపెనీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyundai Motor: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ కీలక ప్రకటన చేసింది. జనవరి 1, 2025 నుంచి తమ కంపెనీ కార్ల ధరలను పెంచుతున్నట్లు తెలిపింది. కంపెనీకి చెందిన దాదాపు అన్ని మోడల్ కార్లపై సుమారు రూ.25000 వరకు ఈ పెంపు ఉంటుందని చెప్పుకొచ్చింది. ఉత్పత్తి వ్యయం, లాజిస్టిక్ ఖర్చులు పెరిగిపోవడంతో పాటు రూపాయి మారకం విలువ తగ్గిపోవడంతో కార్ల ధరలు పెంచాల్సి వస్తుందని హ్యుందాయ్ మోటార్స్ ఇండియా ఈరోజు (డిసెంబర్ 5) ఓ ప్రకటనలో పేర్కొనింది.
Read Also: Soyam Bapu Rao : బీజేపీకి భారీ షాక్.. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మాజీ ఎంపీ
Also Read
- BYD Denza India Launch: భారత్లోకి మరో లగ్జరీ కార్ బ్రాండ్.. లగ్జరీ కార్ల మార్కెట్లో కొత్త సంచలనం..
- Volvo XC40, EX40, EC40 Updated: వోల్వో XC40, EX40, EC40 కొత్త వెర్షన్లు.. రేంజ్, ఫీచర్లు, టెక్నాలజీ వివరాలు
- EV Two-Wheeler Sales: భారత్ ఈవీ మార్కెట్లో సంచలనం.. టాప్-5 నుంచి ఓలా ఔట్..!
- BMW i7 Facelift: సింగిల్ ఛార్జ్తో 728KM రేంజ్.. BMW i7 Facelift లాంచ్.. 31.3 ఇంచుల 8K థియేటర్ స్క్రీన్!
కాగా, ఈ క్రిస్మస్, న్యూ ఇయర్ వేళ కొత్త కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేసిన వారు కచ్చితంగా.. జనవరి 1, 2025లోపే కొనుగోలు చేస్తే.. రూ.25 వేల వరకు ఆదా చేసిన వారు అవుతారు. లేదంటే, ఆ తర్వాత అదనపు భారం పడే అవకాశం ఉంది. ఉత్పత్తి వ్యయం పెరిగిన క్రమంలోనే కార్ల ధరల పెంచుతున్నట్లు హ్యుందాయ్ మోటార్స్ ఇండియా చెప్పుకొచ్చింది. కంపెనీ ఖర్చుల్లో కొంత భాగాన్ని మాత్రమే కస్టమర్లపై భారం మోపుతున్నట్లు హ్యుందాయ్ ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ తరుణ్ గార్గ్ పేర్కొన్నారు. కారు మోడల్ బట్టి ధరల పెంపుదల ఉంటుందన్నారు.
Read Also: Technology: ప్రతి ఆరు నిమిషాలకు ఒక కొత్త టెక్నాలజీ.. పేటెంట్ రైట్స్ కోసం భారీగా దరఖాస్తులు
అయితే, 2025లో మార్కెట్లోకి రిలీజ్ అయ్యే అన్ని కార్లపై ఈ ధరల పెంపు ప్రభావం ఉండబోతుందని తరుణ్ గార్గ్ చెప్పుకొచ్చారు. దేశీయ మార్కెట్లో హ్యుందాయ్ కంపెనీ గ్రాండ్ ఐ10 నియోస్ నుంచి ఐయోనిక్ 5 ఈవీ వరకు అమ్మకాలు చేస్తోంది. బెసిక్ ప్రైస్ రూ. 5.92 లక్షల నుంచి రూ. 46.05 లక్షల వరకు వివిధ మోడల్ కార్లను భారత్ లో అందుబాటులోకి తెచ్చింది. కాగా, ఇప్పటికీ ఆడి, బీఎండబ్ల్యూ, బెంజ్ కంపెనీల కార్ల ధరలను సైతం పెంచుతున్నట్లు ఆయా కంపెనీలు ప్రకటించాయి. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగానే మరిన్ని కంపెనీలు సైతం ధరల పెంపు దిశగా అడుగులు వేసే ఛాన్స్ ఉందని సమాచారం.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?