Hyundai Motor: హ్యుందాయ్ లవర్స్కి షాక్.. జనవరి 1 నుంచి రూ. 25000 వేలు పెంపు..
- జనవరి 1 నుంచి కార్ల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించిన హ్యుందాయ్..
- ఉత్పత్తి వ్యయం, లాజిస్టిక్ ఖర్చులు పెరిగిపోవడంతో ధరలు పెంచినట్లు వెల్లడి..
- ఇప్పటికే కార్ల ధరలను పెంచేసిన ఆడి, బీఎండబ్ల్యూ, బెంజ్ కంపెనీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyundai Motor: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ కీలక ప్రకటన చేసింది. జనవరి 1, 2025 నుంచి తమ కంపెనీ కార్ల ధరలను పెంచుతున్నట్లు తెలిపింది. కంపెనీకి చెందిన దాదాపు అన్ని మోడల్ కార్లపై సుమారు రూ.25000 వరకు ఈ పెంపు ఉంటుందని చెప్పుకొచ్చింది. ఉత్పత్తి వ్యయం, లాజిస్టిక్ ఖర్చులు పెరిగిపోవడంతో పాటు రూపాయి మారకం విలువ తగ్గిపోవడంతో కార్ల ధరలు పెంచాల్సి వస్తుందని హ్యుందాయ్ మోటార్స్ ఇండియా ఈరోజు (డిసెంబర్ 5) ఓ ప్రకటనలో పేర్కొనింది.
Read Also: Soyam Bapu Rao : బీజేపీకి భారీ షాక్.. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మాజీ ఎంపీ
Also Read
- EV Sales India 2026: ఈవీ అమ్మకాల జోరు.. మే నెలలో రికార్డు స్థాయిలో 150,000 ఎలక్ట్రిక్ స్కూటర్లు సేల్..!
- Electric Scooters: ఓలా, టీవీఎస్ ఐక్యూబ్, హీరో విడా.. వీటిలో ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ బెస్ట్? పూర్తి వివరాలు
- Tata Tiago EV vs MG Comet EV: టాటా టియాగో EV వర్సెస్ ఎంజీ కామెట్ EV.. రూ.7 లక్షల బడ్జెట్లో ఏ ఎలక్ట్రిక్ కారు బెస్ట్?
- Ducati Collezione 100: డుకాటి ‘Collezione 100’ స్పెషల్ ఎడిషన్ బైక్స్.. ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 యూనిట్లే!
కాగా, ఈ క్రిస్మస్, న్యూ ఇయర్ వేళ కొత్త కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేసిన వారు కచ్చితంగా.. జనవరి 1, 2025లోపే కొనుగోలు చేస్తే.. రూ.25 వేల వరకు ఆదా చేసిన వారు అవుతారు. లేదంటే, ఆ తర్వాత అదనపు భారం పడే అవకాశం ఉంది. ఉత్పత్తి వ్యయం పెరిగిన క్రమంలోనే కార్ల ధరల పెంచుతున్నట్లు హ్యుందాయ్ మోటార్స్ ఇండియా చెప్పుకొచ్చింది. కంపెనీ ఖర్చుల్లో కొంత భాగాన్ని మాత్రమే కస్టమర్లపై భారం మోపుతున్నట్లు హ్యుందాయ్ ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ తరుణ్ గార్గ్ పేర్కొన్నారు. కారు మోడల్ బట్టి ధరల పెంపుదల ఉంటుందన్నారు.
Read Also: Technology: ప్రతి ఆరు నిమిషాలకు ఒక కొత్త టెక్నాలజీ.. పేటెంట్ రైట్స్ కోసం భారీగా దరఖాస్తులు
అయితే, 2025లో మార్కెట్లోకి రిలీజ్ అయ్యే అన్ని కార్లపై ఈ ధరల పెంపు ప్రభావం ఉండబోతుందని తరుణ్ గార్గ్ చెప్పుకొచ్చారు. దేశీయ మార్కెట్లో హ్యుందాయ్ కంపెనీ గ్రాండ్ ఐ10 నియోస్ నుంచి ఐయోనిక్ 5 ఈవీ వరకు అమ్మకాలు చేస్తోంది. బెసిక్ ప్రైస్ రూ. 5.92 లక్షల నుంచి రూ. 46.05 లక్షల వరకు వివిధ మోడల్ కార్లను భారత్ లో అందుబాటులోకి తెచ్చింది. కాగా, ఇప్పటికీ ఆడి, బీఎండబ్ల్యూ, బెంజ్ కంపెనీల కార్ల ధరలను సైతం పెంచుతున్నట్లు ఆయా కంపెనీలు ప్రకటించాయి. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగానే మరిన్ని కంపెనీలు సైతం ధరల పెంపు దిశగా అడుగులు వేసే ఛాన్స్ ఉందని సమాచారం.
తాజావార్తలు
-
Buchi Babu: “నేను పెద్ది 100 సార్లు చూసి.. ఏడ్చేశా”.. పెద్ది మూవీపై బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
-
Ram Charan : మీకోసం రక్తం చిందించడానికైనా సిద్ధమే.. చనిపోయే వరకు ఎంటర్టైన్ చేస్తా!
-
Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
-
Ram Charan : ఇలాంటి అద్భుతమైన కథ దొరికినప్పుడు కష్టపడకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం?
-
Janhvi Kapoor: ముద్దుముద్దు తెలుగుతో మురిపించిన జాన్వీ కపూర్.. ఫిదా అయిన చరణ్!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!