Hyundai Motor: హ్యుందాయ్ లవర్స్కి షాక్.. జనవరి 1 నుంచి రూ. 25000 వేలు పెంపు..
- జనవరి 1 నుంచి కార్ల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించిన హ్యుందాయ్..
- ఉత్పత్తి వ్యయం, లాజిస్టిక్ ఖర్చులు పెరిగిపోవడంతో ధరలు పెంచినట్లు వెల్లడి..
- ఇప్పటికే కార్ల ధరలను పెంచేసిన ఆడి, బీఎండబ్ల్యూ, బెంజ్ కంపెనీలు..
Hyundai Motor: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ కీలక ప్రకటన చేసింది. జనవరి 1, 2025 నుంచి తమ కంపెనీ కార్ల ధరలను పెంచుతున్నట్లు తెలిపింది. కంపెనీకి చెందిన దాదాపు అన్ని మోడల్ కార్లపై సుమారు రూ.25000 వరకు ఈ పెంపు ఉంటుందని చెప్పుకొచ్చింది. ఉత్పత్తి వ్యయం, లాజిస్టిక్ ఖర్చులు పెరిగిపోవడంతో పాటు రూపాయి మారకం విలువ తగ్గిపోవడంతో కార్ల ధరలు పెంచాల్సి వస్తుందని హ్యుందాయ్ మోటార్స్ ఇండియా ఈరోజు (డిసెంబర్ 5) ఓ ప్రకటనలో పేర్కొనింది.
Read Also: Soyam Bapu Rao : బీజేపీకి భారీ షాక్.. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మాజీ ఎంపీ
Also Read
- TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
- Ampere Magnus Neo: ఫ్యామిలీ బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఆంపియర్ మాగ్నస్ నియో రిలీజ్.. 10 సంవత్సరాల బ్యాటరీ లైఫ్
- IPL Slapgate: చెంపదెబ్బతో కోటి సంపాదన.. శ్రీశాంత్ హర్భజన్పై సంచలన ఆరోపణలు.. స్లాప్గేట్ మళ్లీ వార్తల్లో
- Mercedes CLA EV: భారత్ లో విడుదలైన మెర్సిడెస్ బెంజ్ CLA EV.. 792 km రేంజ్, 800V ఫాస్ట్ ఛార్జింగ్ - పూర్తి వివరాలు
కాగా, ఈ క్రిస్మస్, న్యూ ఇయర్ వేళ కొత్త కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేసిన వారు కచ్చితంగా.. జనవరి 1, 2025లోపే కొనుగోలు చేస్తే.. రూ.25 వేల వరకు ఆదా చేసిన వారు అవుతారు. లేదంటే, ఆ తర్వాత అదనపు భారం పడే అవకాశం ఉంది. ఉత్పత్తి వ్యయం పెరిగిన క్రమంలోనే కార్ల ధరల పెంచుతున్నట్లు హ్యుందాయ్ మోటార్స్ ఇండియా చెప్పుకొచ్చింది. కంపెనీ ఖర్చుల్లో కొంత భాగాన్ని మాత్రమే కస్టమర్లపై భారం మోపుతున్నట్లు హ్యుందాయ్ ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ తరుణ్ గార్గ్ పేర్కొన్నారు. కారు మోడల్ బట్టి ధరల పెంపుదల ఉంటుందన్నారు.
Read Also: Technology: ప్రతి ఆరు నిమిషాలకు ఒక కొత్త టెక్నాలజీ.. పేటెంట్ రైట్స్ కోసం భారీగా దరఖాస్తులు
అయితే, 2025లో మార్కెట్లోకి రిలీజ్ అయ్యే అన్ని కార్లపై ఈ ధరల పెంపు ప్రభావం ఉండబోతుందని తరుణ్ గార్గ్ చెప్పుకొచ్చారు. దేశీయ మార్కెట్లో హ్యుందాయ్ కంపెనీ గ్రాండ్ ఐ10 నియోస్ నుంచి ఐయోనిక్ 5 ఈవీ వరకు అమ్మకాలు చేస్తోంది. బెసిక్ ప్రైస్ రూ. 5.92 లక్షల నుంచి రూ. 46.05 లక్షల వరకు వివిధ మోడల్ కార్లను భారత్ లో అందుబాటులోకి తెచ్చింది. కాగా, ఇప్పటికీ ఆడి, బీఎండబ్ల్యూ, బెంజ్ కంపెనీల కార్ల ధరలను సైతం పెంచుతున్నట్లు ఆయా కంపెనీలు ప్రకటించాయి. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగానే మరిన్ని కంపెనీలు సైతం ధరల పెంపు దిశగా అడుగులు వేసే ఛాన్స్ ఉందని సమాచారం.
తాజావార్తలు
-
Land Rates: ORR-RRR మధ్య చైనా తరహా పార్కులు.. మే 1 నుంచే తెలంగాణలో భూమి ధరలు పెంపు..
-
PM Modi: మే 4 తర్వాత బెంగాల్లో మాఫియా, గుండాల అంతం ఖాయం..
-
Vizag ROB Collapse: విశాఖలో ప్రమాదం.. కూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి
-
Payal Rajput Lover హీరోగా సినిమా.. ఆరోజే రిలీజ్
-
NoiseFit Diva Araya: నాయిస్ ఫిట్ దివా అరయా.. మహిళలకు స్టైలిష్ స్మార్ట్వాచ్.. లైవ్ లొకేషన్ ట్రాకింగ్ కూడా
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!