Tata Motors: మారుతీ సుజుకీ, హ్యుందాయ్ దారిలో టాటా మోటార్స్.. జనవరి నుంచి ధరలు పెంపు..
- మారుతీ సుజుకీ, హ్యుందాయ్ దారిలోనే టాటా మోటార్స్..
- 2025 జనవరి నుంచి కార్ల ధరల్ని పెంచుతున్నట్లు టాటా ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tata Motors: భారత ఆటోమేకర్ దిగ్గజం టాటా మోటార్స్ కూడా హ్యుందాయ్, మారుతీ సుజుకీ దారినే అనుసరిస్తోంది. తన వాహనాల ధరలను పెంచుతున్నట్లు టాటా మోటార్స్ ప్రకటించింది. పెరిగిన ధరలు 2025 జనవరి నుంచి అమలులోకి వస్తాయని చెప్పింది. తాజా ప్రకటన ప్రకారం.. తన మోడల్, వేరియంట్ల ఆధారంగా 3 శాతం వరకు పెంచనున్నారు. పెట్రోల్, డిజిల్ వాహనాల(ఐసీఈ)తో పాటు ఎలక్ట్రిక్ వాహనాలు(ఈవీ) వాహనాలకు ధరల పెరుగుదల వర్తిస్తుంది. పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులు, ద్రవ్యోల్బణం కారణంగా ధరల్ని పెంచుతున్నట్లు చెప్పింది.
Read Also: Supreme Court: “ప్రార్థనా స్థలాల చట్టం”.. మందిర్-మసీదు వివాదాలపై సుప్రీం కీలక ఆదేశాలు..
Also Read
- BYD Denza India Launch: భారత్లోకి మరో లగ్జరీ కార్ బ్రాండ్.. లగ్జరీ కార్ల మార్కెట్లో కొత్త సంచలనం..
- Volvo XC40, EX40, EC40 Updated: వోల్వో XC40, EX40, EC40 కొత్త వెర్షన్లు.. రేంజ్, ఫీచర్లు, టెక్నాలజీ వివరాలు
- EV Two-Wheeler Sales: భారత్ ఈవీ మార్కెట్లో సంచలనం.. టాప్-5 నుంచి ఓలా ఔట్..!
- BMW i7 Facelift: సింగిల్ ఛార్జ్తో 728KM రేంజ్.. BMW i7 Facelift లాంచ్.. 31.3 ఇంచుల 8K థియేటర్ స్క్రీన్!
టాటా మోటార్స్లో ఇప్పుడు హ్యాచ్బ్యాక్ సెగ్మెంట్లో టియాగో, ఆల్ట్రోజ్లతో పాటు కాంపాక్ట్ సెడాన్ విభాగంలో టిగోర్, మైక్రో మైక్రో SUV విభాగంలో పంచ్, కాంపాక్ట్ SUV విభాగంలో టాటా నెక్సాన్, ప్రీమియం SUV విభాగంలో హ్యారియర్ మరియు సఫారీ వంటి మోడల్లు ఉన్నాయి. దీంతో పాటు కూపే స్టైల్ డిజైన్ కలిగిన కర్వ్ని కలిగి ఉంది. ఎలక్ట్రిక్(ఈవీ) వాహన విభాగంలో కర్వ్. ఈవీ, పంచ్. ఈవీ, నెక్సాన్.ఈవీ, టియాగో.టీవీ, టిగోర్.ఈవీలను కలిగి ఉంది. త్వరలోనే హారియర్.ఈవీని, సియోర్రాఈవీని లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే హ్యుందాయ్, మారుతీ సుజుకీ, మహీంద్రా వంటి కార్ మాన్యుఫాక్చర్ కంపెనీలు తన కార్ల ధరల్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ మార్గంలోనే టాటా నడుస్తోంది. మారుతీ సుజకీ తన వాహనాలపై 4 శాతం, హ్యుందాయ్ మోడల్ని బట్టి రూ. 25,000 వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. మహీంద్రా తన ఎస్యూవీలపై 3 శాతం వరకు పెంపుని ప్రకటించింది. ఇదే కాకుండా ఆడి, బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ వంటి లగ్జరీ తయారీ సంస్థలు కూడా తమ వాహనాల ధరల్ని పెంచుతున్నట్లు చెప్పింది.
తాజావార్తలు
-
Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
-
Saudi Arabia: ఒక్క నదీ బారదు.. అయినా పైసలే పైసలు! ఎడారిల 1000 కోట్ల మొక్కలతో మాయ చేసిన దేశం ఇదే..
-
Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
-
Kabir Duhan Singh: ‘హనుమాన్ అంశ్’ బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
-
South Africa: సౌతాఫ్రికాలో రెండు మినీ బస్సులు ఢీ.. 21 మంది మృతి
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!