Tata Motors: మారుతీ సుజుకీ, హ్యుందాయ్ దారిలో టాటా మోటార్స్.. జనవరి నుంచి ధరలు పెంపు..
- మారుతీ సుజుకీ, హ్యుందాయ్ దారిలోనే టాటా మోటార్స్..
- 2025 జనవరి నుంచి కార్ల ధరల్ని పెంచుతున్నట్లు టాటా ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tata Motors: భారత ఆటోమేకర్ దిగ్గజం టాటా మోటార్స్ కూడా హ్యుందాయ్, మారుతీ సుజుకీ దారినే అనుసరిస్తోంది. తన వాహనాల ధరలను పెంచుతున్నట్లు టాటా మోటార్స్ ప్రకటించింది. పెరిగిన ధరలు 2025 జనవరి నుంచి అమలులోకి వస్తాయని చెప్పింది. తాజా ప్రకటన ప్రకారం.. తన మోడల్, వేరియంట్ల ఆధారంగా 3 శాతం వరకు పెంచనున్నారు. పెట్రోల్, డిజిల్ వాహనాల(ఐసీఈ)తో పాటు ఎలక్ట్రిక్ వాహనాలు(ఈవీ) వాహనాలకు ధరల పెరుగుదల వర్తిస్తుంది. పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులు, ద్రవ్యోల్బణం కారణంగా ధరల్ని పెంచుతున్నట్లు చెప్పింది.
Read Also: Supreme Court: “ప్రార్థనా స్థలాల చట్టం”.. మందిర్-మసీదు వివాదాలపై సుప్రీం కీలక ఆదేశాలు..
Also Read
- BMW Vision K18: భవిష్యత్ హై-పర్ఫార్మెన్స్ టూరింగ్ బైక్.. బీఎండబ్ల్యూ విజన్ K18 ఆవిష్కరణ
- Electric Scooters: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఒక రూపాయికే 4 కిలోమీటర్ల ప్రయాణం.. ధరలు కేవలం రూ.50,000 నుండి ప్రారంభం
- Honda Hybrid Sedan: హోండా నెక్స్ట్ జనరేషన్ హైబ్రిడ్ సెడాన్.. 10% ఎక్కువ మైలేజ్, 30% తక్కువ ఖర్చు!
- Green Invicta: గ్రీన్ ఇన్విక్టా ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.45000 డిస్కౌంట్.. చౌక ధరకే సొంతం చేసుకోండి.. 60KM రేంజ్
టాటా మోటార్స్లో ఇప్పుడు హ్యాచ్బ్యాక్ సెగ్మెంట్లో టియాగో, ఆల్ట్రోజ్లతో పాటు కాంపాక్ట్ సెడాన్ విభాగంలో టిగోర్, మైక్రో మైక్రో SUV విభాగంలో పంచ్, కాంపాక్ట్ SUV విభాగంలో టాటా నెక్సాన్, ప్రీమియం SUV విభాగంలో హ్యారియర్ మరియు సఫారీ వంటి మోడల్లు ఉన్నాయి. దీంతో పాటు కూపే స్టైల్ డిజైన్ కలిగిన కర్వ్ని కలిగి ఉంది. ఎలక్ట్రిక్(ఈవీ) వాహన విభాగంలో కర్వ్. ఈవీ, పంచ్. ఈవీ, నెక్సాన్.ఈవీ, టియాగో.టీవీ, టిగోర్.ఈవీలను కలిగి ఉంది. త్వరలోనే హారియర్.ఈవీని, సియోర్రాఈవీని లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే హ్యుందాయ్, మారుతీ సుజుకీ, మహీంద్రా వంటి కార్ మాన్యుఫాక్చర్ కంపెనీలు తన కార్ల ధరల్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ మార్గంలోనే టాటా నడుస్తోంది. మారుతీ సుజకీ తన వాహనాలపై 4 శాతం, హ్యుందాయ్ మోడల్ని బట్టి రూ. 25,000 వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. మహీంద్రా తన ఎస్యూవీలపై 3 శాతం వరకు పెంపుని ప్రకటించింది. ఇదే కాకుండా ఆడి, బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ వంటి లగ్జరీ తయారీ సంస్థలు కూడా తమ వాహనాల ధరల్ని పెంచుతున్నట్లు చెప్పింది.
తాజావార్తలు
-
Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వీడియో
-
Jananayagan : కళ్లు చెదిరే రేటుకు ‘జననాయగన్’ తెలుగు రైట్స్?
-
Oil Companies: పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచినా.. ఇంకా నష్టాల్లోనే చమురు సంస్థలు.. కారణం ఇదే..
-
India Bullet Train: భారత్ బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్ విడుదల.. ఫొటో వైరల్
-
CM Chandrababu: బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో ‘బుల్లెట్ మోటార్ సైకిల్’ ప్రాజెక్టు ఏర్పాటు..!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!