Pakistan: పాకిస్తాన్ తాత్కాలిక ప్రభుత్వం అల్టిమేటంతో ఆ దేశంలో ఉంటున్న లక్షలాది మంది ఆఫ్ఘన్ ప్రజలు సొంతదేశానికి ప్రయాణమయ్యారు. ఇప్పటికే 1,40,000 మందికి పైగా వలసదారులు స్వచ్ఛందంగా ఆఫ్ఘనిస్తాన్ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. సరైన పత్రాలు లేని వలసదారులు పాకిస్తాన్ వదిలి వెళ్లాలని, ఇందుకు నవంబర్ 1ని డెడ్లైన్గా పెట్టింది. దీంతో ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో ఆఫ్ఘాన్లు సొంత ప్రాంతాలకు తిరిగి వెళ్తున్నారు.
Yogi Adityanath: రాజస్థాన్లో ఎన్నికల ప్రచారంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. అల్వార్ లో బీజేపీ తరుపున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ఇజ్రాయిల్-గాజా యుద్ధాన్ని బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా పోలుస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. గాజాలో తాలిబాన్ ఆలోచనలను ఎలా అణిచివేయబడుతుందో మీరు చూస్తున్నారా..? ఖచ్చితత్వంతో లక్ష్యాలను చేధిస్తున్నారని ఇజ్రాయిల్ ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. తాలిబాన్లకు బజరంగ్బలి విధానమే పరిష్కారమని ఆయన అన్నారు.
Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా వైదొలగడంతో అక్కడి ప్రజా ప్రభుత్వాన్ని కూల్చేసి ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అయితే రష్యా, చైనా, ఖతార్ లాంటి కొన్ని దేశాలు మినహా అక్కడి ప్రభుత్వానిన ప్రపంచం గుర్తించలేదు. మహిళల హక్కులు, విద్యపై తాలిబాన్ల ఆంక్షలు ఎక్కువ కావడంతో ఆ దేశానికి విదేశాల నుంచి వచ్చే సాయం కూడా తగ్గింది.
Afghanistan: తాలిబాన్ పాలనలో ఉన్న ఆఫ్ఘానిస్తాన్ మరోసారి నెత్తురోడింది. శుక్రవారం ప్రార్థనల సమయంలో మసీదులో ఆత్మాహుతి దాడి జరిగింది. బగ్లాన్ ప్రావిన్సు రాజధాని పోల్-ఏ-ఖోమ్రీలోని ఓ మసీదులో ఈ ఘటన జరిగింది. దేశంలో మైనారిటీ వర్గమైన షియా మసీదులో ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మరణించగా.. 40 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
China: ఆఫ్ఘనిస్తాన్ లో ప్రజా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత అందరి కన్నా ఎక్కువగా సంతోషించింది పాకిస్తాన్. అయితే ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. భస్మాసుర హస్తంలా పాకిస్తాన్ దేశాన్ని నాశనం చేస్తుంది. ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ మధ్య ఇటీవల కాలంలో సరిహద్దు తగాదాలు తీవ్రమయ్యాయి. దీంతో పాటు పాకిస్తాన్ తాలిబాన్లకు ఆఫ్ఘనిస్తాన్ సేఫ్ జోన్ గా ఉంది. దీంతో బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లో తరుచుగా ఉగ్రవాద ఘటనలు జరుగుతున్నాయి.
ఆఫ్ఘనిస్థాన్ను పాలిస్తున్న తాలిబన్పై పాకిస్థాన్ ఇప్పుడు ఎదురుదాడికి తెరతీసింది. తమ దేశంలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులు నవంబర్ 1లోగా అక్కడి నుంచి వెళ్లిపోవాలని పాకిస్థాన్ తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది. ఈ గడువు దాటిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
Afghanistan: భారతదేశంలో ఆఫ్ఘానిస్తాన్ తన రాయబార కార్యాలయాన్ని మూసేసింది. న్యూఢిల్లీలో ఆఫ్గాన్ ఎంబసీ మూసివేసింది. గత కొన్ని నెలలుగా భారత్ లో ఆఫ్ఘాన్ రాయబారి లేరు. ఢిల్లీలోని ఆఫ్ఘాన్ దౌత్యవేత్తలు కూడా యూకే, అమెరికా వెళ్లి ఆశ్రయం పొందుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే భారత్ లో ఆఫ్ఘాన్ రాయబార కార్యాలయం అన్ని కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ముగ్గురు రాయబార కార్యాలయ అధికారులు శుక్రవారం తెలిపారు.
Afghanistan: తాలిబాన్ చట్టాలు, మహిళ హక్కుల ఉల్లంఘన, నిరుద్యోగం, ఉగ్రవాదం ఇలా పలు రకాల సమస్యల్లో చిక్కుకుంది ఆఫ్ఘనిస్తాన్. అయితే ఒక్క విషయంలో మాత్రం ప్రపంచంలో టాప్ స్థానంలో నిలిచింది. బ్లూమ్బర్గ్ డేటా ప్రకారం.. ఈ త్రైమాసికంలోనే ఆఫ్ఘనిస్తాన్ కరెన్సీ ప్రపంచంలోనే అత్యుత్తమ కరెన్సీగా అవతరించింది. ‘బెస్ట్ ఫెర్ఫామింగ్ కరెన్సీ’గా నిలిచింది. ఈ కాలంలో ఆఫ్ఘనిస్తాన్ కరెన్సీ ఆఫ్ఘని విలువ 9 శాతం పెరుగుదల కనిపించింది. మానవతా సాయంగా ఇతర దేశాలు బిలియన్ డాలర్లు సాయం చేయడం,…
Beauty Salons: దేశవ్యాప్తంగా బ్యూటీ పార్లర్లను మూసివేయాలని తాలిబాన్ ఆదేశించడంతో డజన్ల కొద్దీ ఆఫ్ఘన్ మహిళలు బుధవారం నిరసన తెలిపారు. భద్రతా బలగాలు వాటర్ గన్నులను ఉపయోగించాయి.
Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ చేతికి వచ్చినప్పటి నుంచి అక్కడి తాలిబాన్ ప్రభుత్వం ప్రజలు చుక్కలు చూపిస్తున్నారు. ముఖ్యంగా మహిళల స్వేచ్ఛకు అక్కడ విలువ లేకుండా పోయింది.