China: పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య చైనా మధ్యవర్తిత్వం.. టిబెట్లో సమావేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China: ఆఫ్ఘనిస్తాన్లో ప్రజా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత అందరి కన్నా ఎక్కువగా సంతోషించింది పాకిస్తాన్. అయితే ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. భస్మాసుర హస్తంలా పాకిస్తాన్ దేశాన్ని నాశనం చేస్తుంది. ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ మధ్య ఇటీవల కాలంలో సరిహద్దు తగాదాలు తీవ్రమయ్యాయి. దీంతో పాటు పాకిస్తాన్ తాలిబాన్లకు ఆఫ్ఘనిస్తాన్ సేఫ్ జోన్ గా ఉంది. దీంతో బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లో తరుచుగా ఉగ్రవాద ఘటనలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య చైనా మధ్యవర్తిత్వం వహిస్తోంది. పాకిస్తాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి జలీల్ అబ్బాస్ జిలానీ, ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీ మధ్య భారత్ సరిహద్దుల్లో ఉన్న టిబెట్ ప్రాంతంలో చైనా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇరు దేశాల మధ్య పెరుగుతున్న శత్రుత్వం, దిగజారిన దౌత్య సంబంధాలను దారిలో పెట్టాలని చైనా భావిస్తోంది.
Also Read
- Saudi-Europe: యూరప్కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
- Zelenskyy: కొత్త ప్రాంతీయ కూటమి ఏర్పాటు చేసిన జెలెన్స్కీ.. ఏఏ దేశాలున్నాయంటే..!
Read Also: Covid-19: సింగపూర్లో మరో కోవిడ్ వేవ్.. ఆరోగ్య మంత్రి హెచ్చరికలు
ఇటీవల కాలంలో పాకిస్తాన్ లోని పలు పట్టణాలు, నగరాలపై ఆఫ్ఘనిస్తాన్ నుంచి దాడులు జరుగుతున్నాయని పాక్ ఆరోపిస్తోంది. మరోవైపు పాకిస్తాన్లో శరణార్థులుగా ఉన్న ఆఫ్ఘన్లను దేశం వదిలి వెళ్లాలని ఆదేశించింది. తమ దేశంలో ఉగ్రవాద దాడులకు ఆఫ్ఘన్ పౌరులే కారణమని పాక్ ఆరోపిస్తోంది. అయితే పాక్ ఆరోపణల్ని ఆఫ్ఘన్ తోసిపుచ్చింది.
తాజా సమావేశాలు 2018లో పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్, మంగోలియా, చైనా సభ్యులుగా ఏర్పడిన ట్రాన్స్-హిమాలయన్ ఫోరమ్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ లో భాగంగా జరిగాయి. అయితే చైనా మాత్రం ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ఖనిజ సంపదను దోచుకునేందుకు ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్లో గ్వాదర్ పోర్టును ఆధునీకీకరించి సీపెక్ ప్రాజెక్టు ద్వారా పాకిస్తాన్ అంతటా రోడ్లు, రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసి చైనాతో అనుసంధానిస్తుంది.
ఆఫ్ఘనిస్తాన్ లో చమురు అణ్వేషన, లిథియం మైనింగ్ పై చైనా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య శాంతి నెలకొంటేనే తమ దోపిడికి అడ్డు ఉండదని భావిస్తోంది డ్రాగన్ కంట్రీ. ప్రపంచం మొత్తం ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ల పాలననను గుర్తించనప్పటికీ.. చైనా మాత్రం కాబూల్ లో రాయబార కార్యాలయం ఏర్పాటు చేసి రాయబారిని నియమించింది.
- Tags
- Afghanistan
- china
- Pakistan
- Taliban
- tibet
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..