China: పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య చైనా మధ్యవర్తిత్వం.. టిబెట్లో సమావేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China: ఆఫ్ఘనిస్తాన్లో ప్రజా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత అందరి కన్నా ఎక్కువగా సంతోషించింది పాకిస్తాన్. అయితే ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. భస్మాసుర హస్తంలా పాకిస్తాన్ దేశాన్ని నాశనం చేస్తుంది. ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ మధ్య ఇటీవల కాలంలో సరిహద్దు తగాదాలు తీవ్రమయ్యాయి. దీంతో పాటు పాకిస్తాన్ తాలిబాన్లకు ఆఫ్ఘనిస్తాన్ సేఫ్ జోన్ గా ఉంది. దీంతో బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లో తరుచుగా ఉగ్రవాద ఘటనలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య చైనా మధ్యవర్తిత్వం వహిస్తోంది. పాకిస్తాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి జలీల్ అబ్బాస్ జిలానీ, ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీ మధ్య భారత్ సరిహద్దుల్లో ఉన్న టిబెట్ ప్రాంతంలో చైనా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇరు దేశాల మధ్య పెరుగుతున్న శత్రుత్వం, దిగజారిన దౌత్య సంబంధాలను దారిలో పెట్టాలని చైనా భావిస్తోంది.
Also Read
- Russia-India Rail Route: భారత్కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
- Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
- Iran War: అమెరికాకు ఇరాన్ షాక్.. కూల్చిన F-15E శకలాలను ప్రపంచానికి చూపించింది.!
- Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం? ఇరాన్లో తీవ్ర ఉత్కంఠ!
Read Also: Covid-19: సింగపూర్లో మరో కోవిడ్ వేవ్.. ఆరోగ్య మంత్రి హెచ్చరికలు
ఇటీవల కాలంలో పాకిస్తాన్ లోని పలు పట్టణాలు, నగరాలపై ఆఫ్ఘనిస్తాన్ నుంచి దాడులు జరుగుతున్నాయని పాక్ ఆరోపిస్తోంది. మరోవైపు పాకిస్తాన్లో శరణార్థులుగా ఉన్న ఆఫ్ఘన్లను దేశం వదిలి వెళ్లాలని ఆదేశించింది. తమ దేశంలో ఉగ్రవాద దాడులకు ఆఫ్ఘన్ పౌరులే కారణమని పాక్ ఆరోపిస్తోంది. అయితే పాక్ ఆరోపణల్ని ఆఫ్ఘన్ తోసిపుచ్చింది.
తాజా సమావేశాలు 2018లో పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్, మంగోలియా, చైనా సభ్యులుగా ఏర్పడిన ట్రాన్స్-హిమాలయన్ ఫోరమ్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ లో భాగంగా జరిగాయి. అయితే చైనా మాత్రం ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ఖనిజ సంపదను దోచుకునేందుకు ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్లో గ్వాదర్ పోర్టును ఆధునీకీకరించి సీపెక్ ప్రాజెక్టు ద్వారా పాకిస్తాన్ అంతటా రోడ్లు, రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసి చైనాతో అనుసంధానిస్తుంది.
ఆఫ్ఘనిస్తాన్ లో చమురు అణ్వేషన, లిథియం మైనింగ్ పై చైనా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య శాంతి నెలకొంటేనే తమ దోపిడికి అడ్డు ఉండదని భావిస్తోంది డ్రాగన్ కంట్రీ. ప్రపంచం మొత్తం ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ల పాలననను గుర్తించనప్పటికీ.. చైనా మాత్రం కాబూల్ లో రాయబార కార్యాలయం ఏర్పాటు చేసి రాయబారిని నియమించింది.
- Tags
- Afghanistan
- china
- Pakistan
- Taliban
- tibet
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
-
Russia-India Rail Route: భారత్కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
-
Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!