ఆఫ్ఘనిస్తాన్ లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. మైనారిటీలే లక్ష్యంగా రాజధాని కాబూల్ నగరంలోని కార్తే పర్వాన్ ప్రాంతంలోని గురుద్వారాను టార్గెట్ చేశారు. శనివారం ఉదయం కార్తే పర్వాన్ లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో హిందువులు, సిక్కులు చిక్కుపోయినట్లు తెలుస్తోంది. భారత కాలమాన ప్రకారం ఉదయం 8.30 గంటలకు దాడి జరిగింది. గురుద్వారాకు గార్డుగా ఉన్న వ్యక్తిని చంపేశారు ఉగ్రవాదులు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ముందుగా కార్తే పర్వాన్ గురుద్వారా సమీపంలో పేలుడు సంభవించింది. గురుద్వారా ద్వారం…
ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లు అధికారం చేపట్టిన తర్వాత అక్కడ చాలా మంది జీవితాలు తలకిందులయ్యాయి. ఆఫ్ఘన్ లో ప్రజా ప్రభుత్వ ఉన్న సమయంలో స్త్రీలు ఉద్యోగాలు, వ్యాపారాలు నిర్వహించే వారు. అయితే తాలిబన్ల పాలన వచ్చిన తర్వాత కేవలం వంటిళ్లకే పరిమితం అయ్యారు. బయటకు వెళ్లాలన్నా.. భర్త లేదా బంధువులు తోడుంటేనే అనుమతి.. కాదని రూల్స్ ఉల్లంఘిస్తే కొరడా దెబ్బలతో శిక్షించడం ఇది తాలిబన్ల రాక్షస పాలన. తాజాగా తాలిబన్ పాలనలో ఓ ఆఫ్ఘన్ జర్నలిస్టు పరిస్థితి…
తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ లో అధికారం చేజిక్కించుకున్న తరువాత ఆ దేశం నుంచి ఇండియాకు విమాన సర్వీసులు నిలిచిపోయాయి. అయితే మరికొన్ని రోజుల్లో ఇండియాకు ఆఫ్ఘన్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభించాలని అరియానా ఆఫ్ఘన్ ఎయిర్ లైన్స్ భావిస్తోంది. భారత్ తో తాలిబన్లు దౌత్య సంబంధాలను పున: ప్రారంభించేందుకు ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఆఫ్ఘన్ తో దౌత్య సంబంధాలను మెరుగు పరుచుకోవడానికి భారత్ నుంచి అత్యున్నత ప్రతినిధి బృందం కాబూల్ వెళ్లింది. అక్కడ ప్రభుత్వ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్…
ఆఫ్ఘనిస్తాన్ లో ఇప్పుడు తాలిబన్ రాజ్యం నడుస్తోంది. వాళ్లు చెప్పిందే వేదం, చేసిందే చట్టం అక్కడ. మహిళలకు పెద్దగా హక్కులేం ఉండవు తాలిబన్ పాలనలో. ఈ విషయాన్ని మరోసారి నిరూపించారు తాలిబన్ పాలకులు. ఇప్పటికే మహిళలపై పలు రకాలుగా ఆంక్షలు విధిస్తున్నారు. మహిళలను కేవలం వంటిళ్లకే పరిమితం చేశారు. బయటకు వస్తే ఖచ్చితంగా బుర్ఖా ధరించాలని హుకుం జారీ చేశారు. దీంతో పాటు భర్త, అన్న ఎవరైనా తోడు ఉంటేనే బయటకు రావాలనే ఆంక్షలను విధించారు. ఇదిలా…
ఆఫ్ఘనిస్తాన్ దుర్భర పరిస్థితులను అనుభవిస్తోంది. తాలిబాన్ పాలనలో అక్కడి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. గతేడాది ఆగస్టు 15న ప్రధాని ఆష్రఫ్ ఘనీ పౌరప్రభుత్వాన్ని కూల్చి తాలిబన్లు వారి పాలనను తీసుకువచ్చారు. అమెరికా సైన్యం ఆఫ్ఘన్ ను వదిలిన తర్వాత అక్కడ ప్రజలకు తాలిబన్లు చుక్కలు చూపిస్తున్నారు. తలతిక్క నిర్ణయాలతో ఆడవారిని ఇంటికే పరిమితం చేయడం, స్త్రీలను విద్యకు, ఉద్యోగానికి దూరం చేశారు. కఠినంగా షరియా చట్టాన్ని అమలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా యునైటెడ్ నేషన్స్ వరల్డ్…
రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం భయాందోళనలు కలిగిస్తున్నది. ఉక్రెయిన్లోకి ప్రవేశించిన రష్యా దళాలు వేగంగా కీవ్ను ఆక్రమించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఉక్రెయిన్ సైన్యం ప్రతిఘటిస్తున్నా అది ఎంతసేపు అన్నది ఎవరూ చెప్పలేరు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో తాలిబన్లు చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు హైలెట్ అవుతున్నాయి. యుద్ధం విషయంలో రెండు దేశాలు సంయమనం పాటించాలని, హింసాత్మక ఘటనలకు పాల్పడటం ద్వారా ఎలాంటి ఉపయోగం ఉండబోదని తాలిబన్లు హెచ్చరించారు. సమస్యలను రెండు దేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని…
ఆఫ్ఘన్లో తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తరువాత అనేక మీడియా సంస్థలు మూతపడ్డాయి. ఆఫ్ఘనిస్తాన్ లో మొత్తం 34 ప్రావిన్సులుంటే ఇప్పటి వరకు సుమారు 33ప్రావిన్సుల్లోని 318 మీడియా సంస్థలు మూతపడినట్లు ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ జర్నలిస్ట్ స్పష్టం చేసింది. మొత్తం 33 ప్రావిన్స్లలోని 51 టీవీ ఛానళ్లు, 132 రేడియో స్టేషన్లు, 49 ఆన్లైన్ మీడియా సంస్థలు మూసివేసినట్లు స్పష్టం చేసింది. తాలిబన్ల ఆక్రమణ ముందు వరకు దేశంలో 114 పేపర్స్ ఉంటే, తాలిబన్ల ఆక్రమణల తరువాత…
2021 ఆగస్ట్ 21నుంచి తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్లో అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తరువాత అక్కడి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గతంలో మాదిరిగా కాకుండా ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలిగించబోమని, మహిళల హక్కులు కాపాడతామని స్పష్టం చేశారు. కానీ చెప్పింది ఒకటి చేస్తున్నది మరొకటిగా మారింది. మహిళలకు ఎలాంటి హానీ తలపెట్టబోమని చెబుతూనే వారిని హింసిస్తున్నారు. మహిళలను ఉద్యోగాల నుంచి తొలగించి ఇంటికే పరిమితం చేశారు. అంతేకాదు, గతంలో మాజీ ప్రభుత్వ సభ్యులు, మాజీ భద్రతాదళ…
ఆఫ్ఘనిస్తాన్లో తీవ్ర సంక్షోభం నెలకొన్నది. ఆఫ్ఘన్లో తాలిబన్లు అధికారంలోకి వచ్చి ఏడు నెలలు కావోస్తున్నది. ఇప్పటి వరకు ఏ దేశం కూడా ఆ ప్రభుత్వాన్ని గుర్తించలేదు. తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తరువాత అక్కడి పరిస్థితులు మరింతగా దిగజారిపోయాయి. విదేశాల్లో ఆఫ్ఘన్ నిధులు ఫ్రీజ్ కావడంతో ఆర్థికంగా ఆ దేశం కుదేలయింది. ప్రజలు ఆకలితో అల్లాడిపోతున్నారు. పిల్లలకు సరైన పోషకాహారం అందక జబ్బుల బారిన పడుతున్నారు. గతంలో చాలా మంది పిల్లల ఆకలి తీర్చేందుకు కిడ్నీలను అమ్ముకున్నారు. కాగా,…
ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రపంచ దేశాలు ఆ దేశంపై నిషేధం విధించాయి. ఏ దేశం కూడా ఇప్పటి వరకు తాలిబన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించలేదు. దీంతో ఆ దేశానికి చెందిన విదేశీ నిధులు స్తంభించిపోయాయి. దీంతో దేశంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. ఉద్యోగాలు కోల్పోయాలు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దేశంలో శాంతి భద్రతలను పునరుద్దరించామని, ఇప్పటికైనా దేశాలు తమ ప్రభుత్వాన్ని గుర్తించాలని…