జాతీయ వైద్య విద్యా ప్రవేశాల పరీక్ష (నీట్)ను వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్లను తిరస్కరించింది సుప్రీంకోర్టు.. దీంతో.. నీట్ యథాతథంగా నిర్వహించనున్నారు.. కాగా, సెప్టెంబరు 12న నీట్ నిర్వహణకు ఇప్పటికే ప్రకటన విడుదల కాగా.. అదేరోజు మరికొన్ని పోటీ పరీక్షలు ఉన్నాయని, సీబీఎస్ఈ పరీక్షలు కూడా ఉన్నాయని సుప్రీంకోర్టును ఆశ్రయించారు కొందరు.. నీట్ వాయిదా వేయాలని, మరో తేదీ ప్రకటించేలా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టుకు విన్నవించారు.. అయితే, నీట్ యథాతథంగా సెప్టెంబరు 12నే జరుగుతుందని స్పష్టం…
కేంద్ర ప్రభుత్వంపై సుప్రీం కోర్టు సీరియస్ అయింది. ట్రైబ్యునళ్ళలో ఖాళీల భర్తీ విషయం లో కేంద్ర ప్రభుత్వ తీరు పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు తీర్పులంటే గౌరవం లేదు… కోర్టు సహనాన్ని పరీక్షిస్తున్నారా…! అని సుప్రీం కోర్టు సీజేఐ ఎన్వీ రమణ ఫైర్ అయ్యారు. కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై అసహనం వ్యక్తం చేశారు సీజేఐ ఎన్వీ రమణ. ట్రిబ్యునళ్ళలో ఖాళీల భర్తీపై కేంద్రం వ్యవహరిస్తున్న విధానంపై మండిపడ్డారు సీజేఐ ఎన్వీ రమణ. ట్రిబ్యునల్స్ను మూసి…
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. న్యాయ వ్యవస్థను పటిష్టం చేసేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి.. ఇప్పటికే ఒకేసారి సుప్రీంకోర్టు జడ్జీలుగా 9 మందిని నియమించి కొత్త రికార్డు సృష్టించారు. ఇప్పుడు దేశంలోని 12 హైకోర్టుల్లో ఏకంగా 68 నియమించేందుకు సిద్ధమయ్యారు.. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం.. ఒకేసారి 68 మంది పేర్లను సిఫారసు చేసింది. ఇది భారత న్యాయ చరిత్రలో తొలిసారి కావడం విశేషం.. చీఫ్…
సోషల్ మీడియా వచ్చిన తర్వాత అసలు వార్త ఏదో.. వైరల్ ఏదో తెలియని పరిస్థితి… అయితే, సోషల్మీడియాలో నకిలీ వార్తల ప్రచారంపై అసహనం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు.. సోషల్మీడియా, వెబ్ పోర్టళ్లలో నకిలీ, తప్పుడు వార్తల ప్రచారంపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం.. కొన్ని మాధ్యమాల్లో ప్రతి విషయాన్ని మత కోణంలోనే చూపుతున్నారని, దీని వల్ల దేశానికి చెడ్డ పేరు వస్తోందని విచారం వ్యక్తం చేసింది. సామాజిక మాధ్యమ సంస్థలు కేవలం బలవంతులకే స్పందిస్తున్నాయని, సామాన్యుల పట్ల బాధ్యతారహితంగా…
ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 40 అంతస్తులు కట్టేశారు. వందల కోట్లు ధార పోశారు. చివరకు అది అక్రమమని తేలడంతో.. భవనాన్ని కూల్చివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుప్రీం ఆదేశాలతో దాన్ని నేలమట్టం చేసేందుకు రెడీ అవుతున్నారు అధికారులు. నోయిడాలోని 40 అంతస్తుల ట్విన్ టవర్స్ కూల్చివేయాలని ఆదేశించింది సుప్రీం కోర్టు. అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించిన దేశ అత్యున్నత న్యాయ స్థానం.. ప్లాట్ ఓనర్లకు 12శాతం ఇంట్రెస్ట్తో డబ్బులు వెనక్కి ఇచ్చేయాలని ఆదేశించింది. ఎమరాల్డ్…
సుప్రీం కోర్టులో తొలిసారి ఓ అరుదైన ఘటన జరిగింది.. కొత్తగా నియమితులైన తొమ్మిది మంది న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ… సుప్రీంకోర్టు కొత్త జడ్జీలతో ప్రమాణం చేయించారు. కాగా, సుప్రీంకోర్టు చరిత్రలో ఒకేసారి తొమ్మిది మంది న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం చేయడం ఇదే తొలిసారి. మరోవైపు.. కోవిడ్ నేపథ్యంలో ప్రమాణస్వీకార వేదికను ఒకటో కోర్టు ప్రాంగణం నుంచి అదనపు భవనం ఆడిటోరియంలోకి మార్చారు.. ఇక, జడ్జిల ప్రమాణస్వీకారం కార్యక్రమాన్ని ప్రత్యక్ష…
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా 9 మంది నేడు 10.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సుప్రీం కోర్టు చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో 9 మంది ఒకేసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటివరకు, సంప్రదాయంగా కోర్టు హాల్ 1 లో కొత్తగా నియామకమైన న్యాయమూర్తుల తో ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయుస్తారు. అయుతే, ఇప్పుడు కోర్టు హాల్ 1 లో కాకుండా, సుప్రీం కోర్టు అనుబంధ భవన సముదాయంలో ఉన్న ఆడిటోరియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించాలని…
సెప్టెంబర్ 1 నుంచి సుప్రీం కోర్టు “ప్రత్యక్ష విచారణ” పునరుద్దరణకు ఆదేశాలు జారీ చేసింది ప్రధాన న్యాయమూర్తి. ప్రాణాంతక “కోవిడ్” పరిస్థితికి అనుగుణంగా ఈ నిర్ణయం అమలులో ఉంటుంది. అయితే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు వినిపించేందుకు కూడా అవకాశం ఉంది. సంబంధిత న్యాయమూర్తుల కమిటీ సిఫార్సులను ఆధారం చేసుకుని, బార్ అసోసియేన్స్ విజ్ఞప్తులను దృష్టి లో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు ప్రధాన న్యాయమూర్తి. ఈ మేరకు అధికార ప్రకటనను జారీ చేసింది సుప్రీం కోర్టు.…
ఆంధ్రప్రదేశ్లో పెండింగ్ కేసుల భారీగా పెరిగిపోయాయి.. ప్రస్తుతం హైకోర్టు, సుప్రీంకోర్టులో కలిపి వివిధ కోర్టుల్లో 1.94 లక్షల మేర పెండింగ్ కేసులు ఉన్నట్టు గుర్తించింది ప్రభుత్వం.. ఇక, దీనికి తోడు ప్రస్తుతం రోజూ సగటున 450 కొత్త దావాలు దాఖలవుతున్నాయని చెబుతున్నారు.. దీంతో.. అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్న పెండింగ్ కేసులు సత్వర పరిష్కారం కోసం చర్యలు ప్రారంభించింది ఏపీ సర్కార్.. దీనికోసం ఆన్లైన్ లీగల్ కేస్ మానీటరింగ్ సిస్టమ్ అనే కొత్త వ్యవస్థ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది..…
ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పెండింగ్ కేసులు దాదాపు 2 లక్షలుగా ఉన్నాయి… ప్రస్తుతం హైకోర్టు, సుప్రీంకోర్టులో కలిపి వివిధ కోర్టుల్లో 1.94 లక్షల మేర పెండింగ్ కేసులు ఉన్నట్టు గుర్తించింది ప్రభుత్వం.. ఇక, దీనికి తోడు ప్రస్తుతం రోజూ సగటున 450 కొత్త దావాలు దాఖలవుతున్నాయని చెబుతున్నారు.. ఈ కొత్త పిటిషన్లకు సమాధానమివ్వడానికే ప్రతి రోజూ కనీసం 40 వేల పేజీల పేపర్వర్క్ చేయాల్సి వస్తోంది. మాపై లిటిగేషన్ల భారం ఎంత ఉందో చెప్పడానికి ఇదే నిదర్శనం అంటున్నాడు…