లఖింపూర్ ఖేరి ఘటనపై సీజేఐ ఆగ్రహం.. యూపీ సర్కార్లో కదలిక..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లఖింపూర్ ఖేరి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది… ఈ వ్యహారంపై సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది… ఈ ఘటనకు సంబంధించి ఇప్పటిదాకా ఎంత మందిని అరెస్ట్ చేశారో చెప్పాలంటూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు సీజేఐ ఎన్వీ రమణ.. అయితే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నల నేపథ్యంలో యూపీ ప్రభుత్వంలో కదలిక మొదలైంది.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాను విచారణకు రావాల్సిందిగా ఆదేశించారు పోలీసులు.. కాగా, గత సోమవారం ఆశిష్ మిశ్రాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.. అప్పటి నుంచి అతడి కోసం పోలీసులు వెతుకుతూనే ఉన్నట్టుగా చెబుతున్నారు. ఈ ఘటనలో మొత్తం 13 మందిపై కేసు నమోదు చేసిన యూపీ పోలీసులు..
అయితే, ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా, లఖింపూర్ ఖేరి ఘటనలో నిందితులపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్, అరెస్టులపై ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి స్టేటస్ నివేదికను కోరింది సుప్రీంకోర్టు ధర్మాసనం.. బాధ్యులుగా గుర్తిస్తూ ఎవరెవరిపై కేసులు నమోదు చేశారో తెలపాలని, వివరాలు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరారు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ.. ఇక, ఎవరినీ కాపాడే ప్రయత్నం చేయడం లేదు.. ఈ రోజు కేసు నమోదైన వారిలో ఇద్దరిని పోలీసులు ప్రశ్నించారని కోర్టుకు తెలిపారు లక్నో జోన్ ఐజీ లక్ష్మి సింగ్.. కాగా, నలుగురు రైతుల మృతి ఘటన అనంతరం జరిగిన హింసలో ఒక జర్నలిస్ట్, ఇద్దరు బీజేపీ కార్యకర్తలు, ఒక డ్రైవర్ మృతి.. మొత్తం నలుగురు మృతిచెందారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది.. అధికార బీజేపీపై ప్రతిపక్షాలు విమర్శల దాడి చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు.. ఈ పరిణామం బీజేపీని ఇబ్బందుల్లోకి నెట్టింది.
Also Read
- Iran: ప్రపంచ దేశాలకు ఇరాన్ కొత్త వార్నింగ్.. భారత్కు ముప్పు తప్పదా?
- Twisha Sharma: పెళ్లైన 5 నెలలకే తెలుగు హీరోయిన్ మృతి!
- CM Vijay: ముఖ్యమంత్రిగా ఢిల్లీ టూర్కు విజయ్.. ప్రధాని మోడీని ఎప్పుడు కలవబోతున్నారంటే..!
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
తాజావార్తలు
-
TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
-
Lakshadweep: ప్రధాని మోడీ “కుర్చీ మడత పెడితే” ఎలా ఉంటుందో తెలుసా.. లక్షదీవులే సాక్ష్యం..
-
Iran: ప్రపంచ దేశాలకు ఇరాన్ కొత్త వార్నింగ్.. భారత్కు ముప్పు తప్పదా?
-
IPL 2026: ఐపీఎల్ అరంగేట్రంలోనే అదరగొట్టిన తెలుగు కుర్రాడు.. మంత్రి ప్రశంసలు..
-
Eating on Banana Leaves: అరిటాకులో భోజనం.. సంప్రదాయం వెనుక దాగి ఉన్న అద్భుత ఆరోగ్య రహస్యాలు..!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!