లఖింపుర్ ఖేరి ఘటన.. సుప్రీంకోర్టు సీరియస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లోని లఖింపుర్ ఖేరి ఘటనపై మరోసారి విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. యూపీ సర్కార్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది… యూపీ సర్కార్ చేపట్టిన చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం.. నిందితులను ఇప్పటి వరకు ఎందుకు అరెస్టు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.. ఈ ఘటనపై దసరా తర్వాత తదుపరి విచారణ చేపట్టనున్నట్టు వెల్లడించిన సుప్రీంకోర్టు.. అయితే, అప్పటి వరకు అన్ని సాక్ష్యాలను పరిరక్షించాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇంత వరకు యూపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు సంతృప్తికరంగా లేవని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
ఈ కేసులో యూపీ ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వకేట్ హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు.. సీబీఐతో విచారణ జరిపించేందుకు అంత సుముఖతను వ్యక్తం చేయలేదు ధర్మాసంనం.. సీబీఐ విచారణ సమస్యకు పరిష్కారం కాదనేందుకు గల కారణాలు ఏమిటో మీకు బాగా తెలుసంటూ సీనియర్ అడ్వకేట్ హరీశ్ సాల్వేను ఉద్దేశించి వ్యాఖ్యానించారు సీజేఐ ఎన్వీ రమణ. లఖింపుర్ ఘటన అత్యంత సున్నితమైన అంశం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే సరైన రీతిలో చర్యలు తీసుకుంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, లఖింపుర్ ఖేరి ఘటనలో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.. దీనిపై ఉన్నతస్థాయి న్యాయ విచారణ జరపాలంటూ ఉత్తర్ప్రదేశ్కు చెందిన శివకుమార్ త్రిపాఠి, సీఎస్ పాండా అనే న్యాయవాదులు సీజేఐకి లేఖలు రాయడంతో.. గురువారం రోజు విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం.. లఖింపుర్ ఘటనపై తీసుకున్న చర్యలను వివరిస్తూ స్థాయీ నివేదిక సమర్పించాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు యూపీ సర్కారు ఇవాళ ఆ నివేదికను సమర్పించింది. కానీ, ప్రభుత్వం చేపట్టిన చర్యలపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదు? ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేతృత్వంలో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమ కోహ్లి త్రిసభ్య ధర్మాసనం ముందు వాదనలు జరిగాయి. ఇక, దసరా తర్వాత ఈ కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది ఆసక్తికరంగా మారింది.
Also Read
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- IMD Rain Alert: దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- Trump-Iran: త్వరగా స్పందించండి.. ఇరాన్కు మరోసారి ట్రంప్ వార్నింగ్
- Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!