2002 గుజరాత్ అల్లర్ల సమయంలో సామూహిక అత్యాచారానికి గురైన బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషుల శిక్షను తగ్గించడాన్ని వ్యతిరేకిస్తూ బిల్కిస్ బానో వేసిన పిటిషన్ను విచారించేందుకు ప్రత్యేక బెంచ్ను ఏర్పాటు చేసేందుకు సుప్రీంకోర్టు బుధవారం అంగీకరించింది.
Supreme Court: 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో సామూహిక అత్యాచారానికి గురైన బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషులకు శిక్షను తగ్గించడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించేందుకు ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసేందుకు సుప్రీంకోర్టు బుధవారం అంగీకరించింది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు పిఎస్ నరసింహ, జెబి పార్దివాలాలతో కూడిన ధర్మాసనం కొత్త బెంచ్ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు బిల్సిస్ బానో న్యాయవాది శోభా గుప్తా వెల్లడించారు.
Supreme Court: వివేకా హత్య కేసు దర్యాప్తు ఆలస్యంపై సుప్రీకోర్టు సీరియస్ అయింది. వివేకా హత్య కేసు విచారణ ఎంతవరకు వచ్చిందో చెప్పాలని సుప్రీంకోర్టు అడిగింది. విచారణపై తాజా పరిస్థితిని సీల్డ్ కవర్ లో కోర్టుకు సమర్పించాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. వివేకా హత్య కేసును ఎందుకు దర్యాప్తు చేయడం లేదని సీబీఐని ప్రశ్నించింది. దర్యాప్తు అధికార ఎందుకు విచారణను జాప్యం చేస్తున్నారని అడిగింది. విచారణ త్వరగా ముగించకపోతే వేరే దర్యాపు అధికారిని ఎందుకు నియమించకూడదని వ్యాఖ్యానించింది.
CJI D.Y. Chandrachud: లివ్ ఇన్ రిలేషన్ షిప్ పై దాఖలు చేసిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్(పిల్)పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సహజీవనంలో ఉండే జంట రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే నిబంధనలు తేవాలని కోరతూ.. ఓ లాయర్ పిల్ దాఖలు చేశారు. సహజీవనం చేసే జంటలకు సామాజిక భద్రత కల్పించాలని కోరారు. దీని వల్ల లివ్ రిలేషన్ లో జరిగే నేరాలు తగ్గిపోతాయని పిటిషన్లో కోరారు.
ప్రస్తుతం ఉద్వాసనకు గురైన బీజేపీ నాయకుడి కుమారుడికి చెందిన రిషికేశ్లోని రిసార్ట్లో రిసెప్షనిస్ట్గా పనిచేసిన 19 ఏళ్ల యువతి అంకితా భండారీ హత్యకేసులో జరిపిన దర్యాప్తుపై స్టేటస్ రిపోర్ట్ను దాఖలు చేయాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది.
MLA Purchase Case: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. తదుపరవి ఇచారణను జులైకి వాయిదా వేసింది.. ఇక, విచారణ సందర్భంగా దర్యాప్తుపై స్టేటస్ కో కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు.. కేసు న్యాయస్థానం పరిధిలో ఉన్నందున దర్యాప్తు కొనసాగించవద్దని నిబంధన ఉందని స్పష్టం చేశారు న్యాయమూర్తి.. అప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు రికార్డులు సీబీఐకి అందించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో…
స్వలింగ వివాహాలకు చట్టబద్ధమైన గుర్తింపునివ్వడం సాధ్యం కాదని కేంద్రం తేల్చి చెప్పింది. భారతీయ వివాహ వ్యవస్థలో స్వలింగ వ్యక్తులతో కలిసి జీవించడం, లైంగిక సంబంధం కలిగి ఉండడం భారతీయ కుటుంబ యూనిట్ భావనతో పోల్చదగినది కాదని వెల్లడించింది.
దర్యాప్తు సంస్థలు మహిళలను విచారించే పద్ధతిపై అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్తామన్నారు. ఈడీ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఢిల్లీలో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు.