Ys Viveka Case: వివేకా కేసులో సీబీఐ దూకుడు.. పులివెందులలో తనిఖీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ మంత్రి వైఎస్ వివేకా కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కడపలో సీబీఐ అధికారులు ఆకస్మికంగా పర్యటించారు. పులివెందులకు వెళ్ళిన సీబీఐ అధికారులు వైఎస్ వివేకా ఇంటిని పరిశీలించారు. కడప నుంచి నేరుగా పులివెందుల లోని వైఎస్ వివేక నంద రెడ్డి ఇంటికి చేరుకుని హత్య జరిగిన స్థలాన్ని పరిశీలించారు సీబీఐ అధికారి..తరువాత ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటికి.వెళ్లి పరిశీలించారు సీబీఐ అధికారి. కొద్ది సేపటికే మళ్లీ వివేకా ఇంటికి వచ్చేశారు సీబీఐ అధికారి. వివేకా వద్ద టైపిస్టుగా పనిచేసిన ఇనాయతుల్లాను విచారిస్తున్నారు సీబీఐ అధికారి..వివేకా ఇంట్లో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ ఇనయ్ తుల్లా నుంచి సమాచారం సేకరిస్తున్నారు.
Read Also: Wrestlers Protest: మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులు.. జంతర్మంతర్ వద్ద మరోసారి ఆందోళన
Also Read
- Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
- AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
- OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
హత్య జరిగిన రోజు ఇంట్లో ఎవరెవరు ఉన్నారు అనేదానిపై ఆరా తీస్తుంది సీబీఐ. హత్య జరిగిన రోజు వివేక మృతదేహాన్ని ముందుగా ఫోటోలు, వీడియోలు తీసి కుటుంబ సభ్యులకు పంపించారు ఇనయ్ తుల్లా. ఇదిలా ఉంటే వైయస్ వివేకా హత్య కేసులో కీలక పురోగతిని సాధించింది సిబిఐ..హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరిన రెండు బృందాలు పులివెందుల లో తనిఖీలు చేయడం హాట్ టాపిక్ అవుతోంది. ఇదిలా ఉంటే.. రేపు సుప్రీంకోర్టులో జరిగే విచారణకు హాజరుకానుంది మరొక బృందం.సీన్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా వైఎస్ వివేకా హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలిస్తుంది సిబిఐ. దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన కొత్త కోణాలను రేపు సుప్రీంకోర్టు ముందు ఉంచనుంది సిబిఐ అధికారుల బృందం. ఐదు రోజులుగా వైఎస్ వివేకా కేసులో ఉదయ్ కుమార్, భాస్కర్ రెడ్డి లను కస్టడీ లోకి తీసుకొని విచారించింది సీబీఐ. మూడు రోజులు పాటు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని విచారించింది సీబీఐ.
రేపు వై ఎస్ వివేకా కూతురు సునీతా రెడ్డి పిటిషన్ పై సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. గత శుక్రవారం సునీత పిటిషన్ విచారించింది సీజేఐ ధర్మాసనం. అవినాష్ రెడ్డి కి హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల పై కీలక ఆదేశాలిచ్చింది ధర్మాసనం. తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై స్టే ఇచ్చింది సుప్రీం కోర్టు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది ధర్మాసనం… హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధిస్తే అవినాశ్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేస్తుందని చెప్పారు అవినాశ్ తరఫు న్యాయవాది. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధిస్తూనే, సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టే వరకు అవినాష్ రెడ్డిని అరెస్టు చేయవద్దని సీబీఐ ని ఆదేశించింది ధర్మాసనం. సోమవారం ఏం జరుగుతుందనేది తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోంది.
Read Also: Pawan Kalyan Vs Prabhas: పవన్ ను ఫ్యాన్ ను హత్య చేసిన ప్రభాస్ ఫ్యాన్.. అది మార్చలేదని
తాజావార్తలు
-
Volvo XC40, EX40, EC40 Updated: వోల్వో XC40, EX40, EC40 కొత్త వెర్షన్లు.. రేంజ్, ఫీచర్లు, టెక్నాలజీ వివరాలు
-
Lakshmi Narayana Yoga: తులారాశిలో లక్ష్మీనారాయణ యోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
-
Bigg Boss Telugu 10: ‘బిగ్ బాస్ తెలుగు 10’లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
-
US Open 2026: సబాలెంకాను ఓడించి ఎలెనా రిబాకినా చరిత్ర.. తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!