ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ స్కూళ్ల రూపు రేఖలు మార్చేందుకు.. పాఠశాలల్లో ప్రాథమిక మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ‘నాడు-నేడు’ పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీమ్ కింద ఇప్పటికే చాలా పాఠశాలల రూపు రేఖలు మారిపోయాయి.. మరికొన్ని స్కూళ్లలో పనులు జరుగుతున్నాయి.. కానీ, కర్నూలు జిల్లాలో పాఠశాల కంట్రాక్టర్ నిర్లక్ష్యంతో గోడ కూలి టీచర్, విద్యార్థులకు గాయాలయ్యాయి. అయితే, టీచర్ అప్రమత్తతతో విద్యార్థులకు ప్రాణాపాయం తప్పింది. జిల్లాలోని కౌతాళం మండలం హాల్వీ ఎలిమేంటరీ స్కూల్లో ఈ ఘటన…
రేపటి పౌరుల నేటి అవసరం టెక్నాలజీ.. అందుకే ట్యాబ్ల పంపిణీకి శ్రీకారం చుట్టామని తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్… బాపట్ల జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. యడ్లపల్లి హైస్కూల్లో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.. 4.59 లక్షల మంది విద్యార్థులు, 59,176 ఉపాధ్యాయులకు రూ.686 కోట్ల విలువైన 5,18,740 ట్యాబ్లు ఉచితంగా పంపిణీ చేస్తుంది సర్కార్.. ఇక, తన పుట్టిన రోజునాడే ఈ కార్యానికి శ్రీకారం చుట్టిన సీఎం.. ఈ సందర్భంగా…
Viral Video: తరగతి గదిలో విద్యార్థులతో టీచర్ భోజ్ పురి సాంగ్ కు డ్యాన్స్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విద్యార్థులకు చదువు చెప్పాల్సిన టీచర్ క్లాస్ రూంలో డ్యాన్స్ చేయడంతో నెటిజన్లు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం శంకర్ పల్లి లోని కళాశాలలకు వచ్చే ఎన్.ఎస్.యు.ఐ.విద్యార్థులకు ఆర్టీసీ బస్సు, ఆర్టీసీ అధికారుల నిర్వాకం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రంగారెడ్డి జిల్లా సెక్రెటరీ అనిల్ అన్నారు. మెహిదీపట్నం నుంచి శంకర్ పల్లి రూట్ లో హైదరాబాద్ టు డిపో అధికారులు మెదీపట్నం డిపో అధికారులు బస్సులు నడిపిస్తుంటారు.
హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యార్థులు ఒక్కసారిగా ఆందోళన చేపట్టారు. ఓయూ హాస్టల్ కేటాయింపులో వీసి నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు.
మధ్యాహ్న భోజనం వికటిస్తోంది.. భోజనం తిన్న వెంటనే విద్యార్ధులు వాంతులు విరేచనాలతో బాధపడుతూ ఆస్పత్రుల పాలవుతున్నారు.. వరుస ఘటనలతో బడి భోజనం అంటేనే హడలిపోయే పరిస్దితి నెలకొంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బడి భోజనం భయపెట్టిస్తోంది. వారం రోజులుగా 10 స్కూళ్లలో మధ్యాహ్న భోజనం వికటించి.. వందకు పైగా చిన్నారులు ఆసుపత్రుల పాలు కావడం తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా 2వేలకు సర్కారు బడులు ఉండగా.. రెండు లక్షల మందికి పైగా చిన్నారులకు మధ్యాహ్న…