Food Poison: వికటించిన మధ్యాహ్న భోజనం.. వందకు పైగా విద్యార్థులకు అస్వస్థత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యాహ్న భోజనం వికటిస్తోంది.. భోజనం తిన్న వెంటనే విద్యార్ధులు వాంతులు విరేచనాలతో బాధపడుతూ ఆస్పత్రుల పాలవుతున్నారు.. వరుస ఘటనలతో బడి భోజనం అంటేనే హడలిపోయే పరిస్దితి నెలకొంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బడి భోజనం భయపెట్టిస్తోంది. వారం రోజులుగా 10 స్కూళ్లలో మధ్యాహ్న భోజనం వికటించి.. వందకు పైగా చిన్నారులు ఆసుపత్రుల పాలు కావడం తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా 2వేలకు సర్కారు బడులు ఉండగా.. రెండు లక్షల మందికి పైగా చిన్నారులకు మధ్యాహ్న భోజనం వండుతున్నారు. ఐతే చాలా పాఠశాలల్లో భోజనం సరిగా వండటం లేదంటూ విద్యార్ధులు తినడం లేదు. తింటున్న కొద్ది మంది విద్యార్దులు.. వాంతులు, విరేచనాలతో అస్వస్ధతకు గురవుతున్నారు.
Read Also: Buggana Rajendranath: ఆర్థికమంత్రి అప్పులు చేయకుండా.. హోంమంత్రి చేస్తారా?
Also Read
మాచారెడ్డి మండలం భవానీపేట, గాంధారి, నాగిరెడ్డి పేట మండలం చీనూరు, నవీపేట, బిర్కూరు మండలంలో పలు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వికటించింది. ఒక్కో స్కూల్లో 50 మందికి పైగా విద్యార్ధులు వాంతులు , విరేచనాలతో ఆసుపత్రుల పాలయ్యారు. రోజుకో స్కూల్లో మధ్యాహ్న భోజనం వికటిస్తూ.. స్డూడెంట్స్ ఆసుపత్రుల పాలు కావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ భోజనానికి సన్న బియ్యం సరఫరా చేయాలని సర్కారు ఆదేశించింది. ఐతే సన్న బియ్యం పేరుతో.. నాణ్యత లేని బియ్యం సరఫరా చేస్తుండటంతో సమస్య ఉత్పన్నం అవుతోంది. ఇటు మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వహకులకు పెరిగిన ధరల ప్రకారం డబ్బులు చెల్లించకపోడంతో.. తక్కువ ధరల్లో లభించే కూరగాయలు , ఇతర నిత్యావసర వస్తువులు సరఫరా చేసి మమ అనిపిస్తున్నారు. ఫలితంగా నాణ్యత లేని బియ్యం, ఇతర సామాగ్రితో… భోజనం వికటిస్తోంది. చాలా చోట్ల బియ్యంలో పురుగులు వస్తుండటం పుడ్ పాయిజన్ కు కారణం అవుతోందని విద్యార్ధులు వాపోతున్నారు. ఉడికి ఉడకని అన్నం, నీళ్ల చారుతో తినలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారు.
తాజావార్తలు
-
Satya Dev: రావు బహదూర్’లో నగ్నంగా నటించాలన్నారు
-
Shreyas Iyer: మ్యాచ్ ఫలితాలతో సంబంధం లేదు.. కెప్టెన్గా ఆ రికార్డ్ సాధించిన శ్రేయాస్ అయ్యర్..
-
IND Vs ENG: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. జట్టులోకి యువ ప్లేయర్..
-
Hormuz Tank Attacks: హోర్ముజ్ జలసంధిలో యుద్ధ వాతావరణం.. 24 గంటల్లో 3 ఆయిల్ ట్యాంకర్లపై దాడులు!
-
CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ ఓపెన్ ఛాలెంజ్.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్తో మల్లెపూవులా వస్తుంది!
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!