Story Board : భావ ప్రకటన, వ్యక్తీకరణ స్వేచ్ఛ విలువను పౌరులు తెలుసుకోవాలని, మాట్లాడేటప్పుడు స్వీయ నియంత్రణను పాటించాలని సుప్రీంకోర్టు సూచించింది. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులను నిరోధించేందుకు వీలుగా మార్గదర్శకాలు తెచ్చే యోచన చేస్తున్నామని తెలిపింది. ఈ పరిస్థితిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టడి చేయాల్సిందేనని స్పష్టం చేసింది. సోషల్ మీడియా అనేది ఇప్పుడు మహమ్మారిగా మారింది. రాజకీయ పార్టీలే కాదు ..కొన్ని వ్యాపార సంస్థలు, వ్యక్తులు కూడా సోషల్ మీడియా టీముల్ని ఏర్పాటు చేసుకుంటున్నాయి.…
ఇటు బీజేపీలో, అటు ఆరెస్సెస్ లో మోహన్ భగవత్ 75 ఏళ్లకు విరమణ వ్యాఖ్యలపైనే చర్చ జరుగుతోంది. నాగ్ పూర్ లో పుస్తకావిష్కరణలో భగవత్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే లేపాయి. మోడీ పేరు చెప్పకపోయినా.. ఆయన్ను ఉద్దేశించే పరోక్ష వ్యాఖ్యలు చేశారని ప్రతిపక్షాలు అభిప్రాయపడుతున్నాయి.
మూడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లుకు మోక్షం వచ్చింది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా మహిళా రిజర్వేషన్ల అమలుపై ఏకాభిప్రాయం వ్యక్తమౌతోంది. ఎలా అమలుచేయాలనే విషయంలో భిన్నాభిప్రాయాలున్నా.. అమలు చేయాల్సిందే అనే క్లారిటీ అయితే పూర్తిగా కనిపిస్తోంది.
గతంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో సరఫరా, డిమాండ్ సమతుల్యంగా ఉండేది. ఇటీవల కాలంలో ప్రీలాంచ్లు, బిల్డర్ల మధ్య పోటీతో డిమాండ్ కంటే సరఫరా పెరిగిందనే అభిప్రాయం మార్కెట్లో ఉంది. దీంతో నిర్మాణం పూర్తై అమ్ముడు పోకుండా ఉన్న ఇళ్ల సంఖ్య గతంలో ఎప్పుడూ లేనంత ఎక్కువగా ప్రస్తుతం ఉంది. హైదరాబాద్ లో టాప్ టెన్ రియల్ ఎస్టేట్ కంపెనీల పరిస్థితి పర్లేదన్నట్టుగా ఉంది.
పదకొండేళ్ల క్రింత ఏర్పాటైన కొత్త రాష్ట్రం తెలంగాణ. అభివృద్ధి, జీడీపీ విషయంలో దేశానికి తలమానికంగా ఉన్న రాష్ట్రం. కానీ ట్యాపింగ్ కేసు.. తెలంగాణ పరువు తీసింది. మావోయిస్టుల పేరు చెప్పి వందల మంది ఫోన్లు ట్యాప్ చేయడం.. దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ జరుగుతోంది. కానీ మరింత లోతైన విచారణ కోసం.. ట్యాపింగ్ వ్యవహారం దర్యాప్తును సీబీఐకి అప్పగించాలనే డిమాండ్లు వస్తున్నాయి. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ రోజుకో…
అహ్మదాబాద్ విమాన ప్రమాద దృశ్యాలు.. ఇంకా కళ్లముందు కనిపిస్తూనే ఉన్నాయి. ఇంకా మృతదేహాల అప్పగింత కూడా పూర్తికాలేదు. ఈలోపే మళ్లీ మళ్లీ విమానాల్లో లోపాలు బయటపడుతున్నాయి. ప్రయాణికుల ప్రాణాలు.. గాల్లో దీపాలుగా మారుతున్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అన్న భయం.. విమానం ఎక్కే వారిలో కనిపిస్తోంది. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది ? లోపాలు ఎక్కడ ఉన్నాయి ? విమానాల్లో సాంకేతిక సమస్యాలా లేక నిర్వహణలో రూల్స్ పాటించకపోవడమా ?
రియల్ ఎస్టేట్ మరో మూడేళ్ల దాకా లేవదని అంచనా. కేవలం హైదరాబాద్ లోనే కాకుండా దేశం, ప్రపంచం ఎక్కడ చూసినా రియల్ ఎస్టేట్ కు సానుకూల సంకేతాలు కనిపించడం లేదు. హైదరాబాద్ లో కొత్త నిర్మాణాలు కూడా చాలావరకు నిలిచిపోయాయి. కేవలం టాప్ కంపెనీలు మాత్రమే అప్పులకు వడ్డీలు కట్టుకుంటూ మేనేజ్ చేస్తున్నాయి.
భాగ్యనగరంలో మిస్ వరల్డ్ పీజెంట్ ఘనంగా జరిగింది. నెల రోజుల పాటు అందాల సంబరం అంబరాన్నంటింది. హైదరాబాద్ బ్రాండ్ పెంచేలా.. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా వేడుకలు నిర్వహించారు. తెలంగాణ ఘనమైన వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసేలా కార్యక్రమాల రూపకల్పన జరిగింది. చేనేత దగ్గర్నుంచీ వైద్యసేవల వరకూ అన్ని రంగాలనూ అందగత్తెలకు పరిచయం చేశారు. తెలంగాణ జరూర్ ఆనా నినాదం అడుగడుగునా ప్రతిఫలించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
ఇదిగో..అదిగో అంటూ రోజులు..వారాలు.. నెలలు గడిచిపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేతల ఎదురుచూపులు మాత్రం ఫలించడం లేదు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పదవుల పంచాయతీ...ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయిందన్న మాటే కానీ...పార్టీలో కింది స్థాయి నుంచి ఎమ్మెల్యేల దాకా ఎవరు సంతృప్తిగా లేరు. మంత్రి పదవుల భర్తీ చేయలేదు. నామినేటెడ్ పోస్టుల్లేవు...కనీసం పీసీసీ కార్యవర్గాన్ని కూడా నియమించలేకపోతున్నారు.