Story Board: సోషల్ మీడియా శృతిమించిపోతోంది. వ్యక్తులు, సంస్థలు.. ఆఖరికి వ్యవస్థల్ని కూడా దాటేసి..ప్రభుత్వాలకూ తలపోటుగా తయారైంది. ఏకంగా ముఖ్యమంత్రులే రంగంలోకి దిగి.. సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని అరాచకాలు చేస్తున్న వారికి వార్నింగులు ఇవ్వాల్సిన దుస్థితి వచ్చేసింది. తెలంగాణలో సోషల్ మీడియా హద్దుదాటిన వారిపై రౌడీషీట్లు తెరవాలనే ఆదేశాలు వచ్చేశాయి. అటు ఏపీలో కూడా సోషల్ మీడియా నియంత్రణకు కఠిన చట్టం తెస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అసలు జాతీయ స్థాయిలోనే ఓ సమగ్ర చట్టం అవసరమనే…
Story board: బంగారం ధర మరోసారి ఆల్టైం హై కి చేరింది. పది గ్రాముల బంగారం ఏకంగా లక్ష రూపాయల 20 వేలకు చేరువైంది. పెరుగుతున్న బంగారం ధరలను దృష్టిలో పెట్టుకొని చాలామంది ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారు. ఎందుకంటే డబ్బులను బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తే దాని ధర రోజు రోజుకి పెరగడం వల్ల బంగారం మీద పెట్టుబడి పెట్టడానికి ఎక్కువమంది మొగ్గు చూపుతున్నారు. బంగారం ధరలు రాకెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నాయి. పెరగడమే…
కొద్దిరోజుల క్రితం మోహన్ భగవత్ 75 ఏళ్లకు రిటైర్మెంట్ పై చేసిన వ్యాఖ్యల గురించి పెద్ద చర్చ జరిగింది. ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై అంతకంటే ఎక్కువ చర్చ జరుగుతోంది. ఎందుకంటే సమీప భవిష్యత్తుపై భరోసా లేని రాజకీయం నడుస్తున్న ఈరోజుల్లో ఏకంగా 2047 దాకా మోడీనే దేశానికి ప్రధానిగా ఉంటారన్న రాజ్నాథ్ వ్యాఖ్యలు ఆసక్తిని రేకేత్తిస్తున్నాయి. ఈ అంశంపై ప్రాక్టికల్ పాజిబులిటీ గురించి ఎలాగో అభిప్రాయాలు వస్తున్నాయి. అప్పటిదాకా ఉండేదెవరు, ఊడేదెవరూ అనే కామెంట్లు…
జీఎస్టీ సంస్కరణలపై కేంద్రం చాలా ఆశలు పెట్టుకుంది. ఇవి కచ్చితంగా సామాన్యులు, మధ్యతరగతికి ఊరట ఇస్తాయనే నమ్మకంతో ఉంది. ఆర్థిక మంత్రి అయితే ఏ మేరకు లబ్ధి చేకూరుతుందో గణాంకాలతో సహా చెబుతున్నారు. ఇప్పటికే జీఎస్టీ అవుట్ రీచ్ ప్రోగ్రాముల్లో మంచి స్పందన వచ్చిందనే భావనతో ఉన్నారు.
రాజకీయంగా బీజేపీ విజయాల్ని చూసి ఆరెస్సెస్ సంతోషించే మాట వాస్తవం. వీలైనంత వరకు పార్టీ సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలనే విధానం కూడా కొంతవరకూ నిజమే. కానీ బీజేపీకి కాస్త స్వేచ్ఛ ఇచ్చినప్పుడల్లా.. మూలాలు మరిచిపోయి.. సంఘ్ సిద్ధాంతాలతో సంబంధం లేని నేతల్ని పార్టీలో చేర్చుకోవడం, వారి ప్రాధాన్యత పెరగటం ఆరెస్సెస్ ను అసంతృప్తికి గురిచేసేది. అందుకే ఎప్పటికప్పుడు బీజేపీలో జరిగే వ్యవహారాలపై ఆరెస్సెస్ నిరంతర పరిశీలన ఉంటుంది. అలాగే అవసరమైనప్పుడు సలహాలు కూడా ఇస్తుంది.
మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటమిపై పోస్ట్ మార్టమ్ చేసిన కాంగ్రెస్ కు.. ఓట్ల చోరీపై కొన్ని ఆధారాలు దొరికాయని రాహుల్ చెబుతున్నారు. ఆయన ఇప్పటికే ఓట్ల చోరీపై ఇండియా కూటమి నేతలకు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈసీకి కొన్ని సవాళ్లు కూడా విసిరారు. త్వరలో ఎన్నికలు జరగబోతున్న బీహార్లో ఓటు అధికార యాత్ర మొదలుపెట్టారు రాహుల్.
స్వతంత్ర భారత్ పురోగమిస్తోందనడంలో సందేహం లేదు. ఇండియా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడం ఖాయమన్న అభిప్రాయం వినిపిస్తోంది. ప్రపంచం AI రంగంలోకి పరుగులు పెడుతున్న వేళ.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్లో భారత్ అద్భుతాలు సృష్టించబోతోందని నిపుణులు అంటున్నారు. మొత్తంగా నవభారతం.. వృద్ధిరేటుకు వెలుగురేఖగా ఇప్పటికే పేరు తెచ్చుకుంది.
తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. న్యాయస్థానమే అనర్హత వేటు వేయాలన్న బీఆర్ఎస్ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్ అన్నట్లుగా ఉండకూడదని పేర్కొంది. ఈ అంశంపై మూడు నెలల్లో తెలంగాణ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
భారతీయ సమాజంలో సంతానానికి చాలా ప్రాధాన్యత ఉంది. తల్లిదండ్రులు కూడా పిల్లల కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధపడతారు. వారి కోసమే ఆస్తులు కూడబెడతారు. సంతానాన్ని కూడా ఆస్తిగానే భావిస్తారు. అలాంటిది సంతానం లేదంటే.. ఆ విషయాన్ని జీర్ణించుకోవడానికి చాలా మంది ఇష్టపడరు. దీంతో సంతాన సాఫల్యం కోసం కృత్రిమ మార్గాలను వెతుకుతారు. గతంలో కృత్రిమ గర్భధారణ పద్ధతులు ప్రాచుర్యంలోకి రానప్పుడు దత్తతలు ఎక్కువగా జరిగేవి.