AIMIM MLA from Nampally, Jaffar Hussain Meraj: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆదేశాల మేరకు కరీంనగర్ నియోజకవర్గంలో ఇటీవలే పేద ముస్లింల ఇండ్లను కూల్చిన సంఘటన లో రేకుర్తి జరీనా నగర్, మొహసీన్ నగర్ లో క్షేత్ర స్థాయిలో పర్యటించి కూల్చిన ఇండ్లను పరిశీలించారు,
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దళిత బంధు పథకం అమలులో కొంతమంది ఎమ్మెల్యేలు మూడు లక్షల రూపాయలు తీసుకుంటున్నారని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్లపైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో సమాధానం చెప్పాలి అని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రభుత్వంపై కాసుల వర్షం కురిపిస్తోంది రిజిస్ట్రేషన్ల శాఖ.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ.10 వేల కోట్లకు పైగా ఆదాయాన్ని రాబట్టింది… గతంలో ఎప్పుడూ రూ.10వేల కోట్ల మార్క్ చేరుకోలేదు రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం.. గత ఆర్థిక సంవత్సరంలో 10 వేల కోట్ల ఆదాయం టార్గెట్ పెట్టుకున్నా.. కేవలం రూ.5,243 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది.. అయితే, ఈ ఆర్థిక సంవత్సరంలో టార్గెట్ రూ.12,500 కోట్లు పెట్టుకుంటే.. ఇప్పటికే రూ.10 వేల కోట్ల మార్క్ను దాటేసింది.. Read…
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసం గవర్నర్ కి చెప్పాం అని మాజీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పండించిన ప్రతి గింజకు మద్దతు ధర ఇచ్చే బాధ్యత కేంద్రంది అని చెప్పిన ఆయన పంటను కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంది అని అన్నారు.. మెడ మీద కత్తి పెడితే రాష్ట్రాన్ని మోడీకి రసిస్తడా.. కేసీఆర్ అని ప్రశ్నించిన శ్రీధర్ బాబు అదానీ..అంబానీకి రాష్ట్రాన్ని అమ్మేస్తడా అని అడిగారు. రైతును అయోమయంలోకి నెట్టి… తక్కువ ధరకు అమ్మే పరిస్థితి…
మద్యంపై పన్ను రేట్లను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. విలువ ఆధారిత పన్నులో మార్పులు చేస్తూ జీవో జారీ చేసింది ఏపీ అబ్కారీ శాఖ.. మద్యం మూల ధరపై మొదటి విక్రయం జరిగే చోట పన్ను ధరల సవరణ చేశారు.. దేశీయ, విదేశీ మద్యం బ్రాండ్లపై ధర ఆధారంగా పన్నుల్లో మార్పులు జరిగాయి.. రూ .400 ధర లోపు ఉన్న బ్రాండ్లకు 50 శాతం మేర వ్యాట్ వర్తింపజేయగా.. రూ. 400 నుంచి రూ.…
కొడితే.. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలి.. లైఫ్ సెటిల్ ఐపోతుందని ప్రతీ నిరుద్యోగి కల. భాష కారణంగా కలను నిజం చేసుకోలేకపోతున్నారు నిరుద్యోగులు. పోటీ పరీక్షలన్నీ హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఉంటున్నాయి. తెలుగు, తమిల్, మళయాలం, కన్నడ వంటి ప్రాంతీయ భాషల్లోనే విద్యాభ్యాసం చేసిన అభ్యర్థులకు పరీక్షలను ఎదుర్కోలేకపోతున్నారు. ఇంగ్లీష్, హిందీ మాదిరిగానే… ప్రాంతీయ భాషల్లో కూడా పరీక్షలను నిర్వహించాలని మంత్రి కేటీఆర్.. కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ను కోరారు. ఆంగ్లేతర మాధ్యమంలో చదివిన వారు, హిందీయేతర రాష్ట్రాల…
మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ పదవి నుంచి అశోక్ గజపతిరాజును తొలగించి… ఆ బాధ్యతల్ని సంచయిత గజపతిరాజుకు అప్పగించింది ఏపీ సర్కార్. అయితే, దీనిపై అశోక్ గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించారు. కేసు విచారించిన సంచయిత నియామకానికి సంబంధించిన జీవోను కొట్టి వేసింది. దీంతో మాన్సాస్ ట్రస్ట్తో పాటు సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్త బాధ్యతల్ని తిరిగి చేపట్టారు అశోక్ గజపతిరాజు. అయితే, ఈ వివాదానికి అక్కడితో తెరపడలేదు. విశాఖలో రాష్ట్ర…
అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోడీ.. సోమవారం జాతినుద్దేశించి ప్రసంగించిన ఆయన.. వ్యాక్సిన్లను కేంద్రమే కొనుగోలు చేసి రాష్ట్రాలకు సరఫరా చేస్తోందని.. 75 శాతం వ్యాక్సిన్లు అన్ని రాష్ట్రాలకు సరఫరా చేస్తామని.. మిగతా 25 శాతం వ్యాక్సిన్లు ప్రైవేట్ ఆస్పత్రులకు ఇవ్వనున్నట్టు వెల్లడించారు.. ప్రైవేటు ఆసుపత్రులకు రూ. 150 కంటే ఎక్కువ సేవా ఛార్జీగా వసూలు చేయడానికి అనుమతించవద్దని కేంద్రం.. రాష్ట్రాలను కోరింది. ప్రైవేటు ఆస్పత్రులను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాలను…