సామాన్యుడు కొనలేని విధంగా పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కులనంటుతున్నాయి. ఈ నేపథ్యంలో బయటకు బండి తీయాలంటేనే వణికిపోతున్న ప్రజలు.. వాహనాలకు బదులు సైకిళ్లను కొనేందుకు ఇష్టపడుతున్నారు.
17 ఓవర్లు ముగిసిపోయాయి.. శ్రీలంక స్కోరు 118/6.. మ్యాచ్ గెలవాలంటే 3 ఓవర్లలో 59 పరుగులు చేయాలి.. ఇది దాదాపు అసాధ్యమైన ఫీట్.. కాబట్టి శ్రీలంక ఈ మ్యాచ్ ఓడిపోవడం ఖాయమని అంతా అనుకున్నారు. శ్రీలంక అభిమానులు సైతం మెల్లగా మైదానాన్ని వదిలి వెళ్తున్నారు. అప్పుడు శ్రీలంక కెప్టెన్ దసున్ షనక (25 బంతుల్లో 54) తాండవం చేశాడు. ఆసీస్ బౌలర్లపై మెరుపు దాడికి దిగాడు. వచ్చిన ప్రతి బంతిని బౌండరీ దిశగా బాదాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ…
ఆస్ట్రేలియా, శ్రీలంక జట్ల మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభం అవ్వగా.. మంగళవారం తొలి టీ20 మ్యాచ్ జరిగింది. ఇందులో శ్రీలంక ఆటగాళ్ళు దారుణమైన ఆటతీరుని ప్రదర్శించడం పట్ల.. ఆ దేశ క్రికెట్ ప్రియులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక.. 11.5 ఓవర్లలో కేవలం ఒక వికెట్ నష్టానికి 100 పరుగులు చేసింది. అది చూసి.. లంక కచ్ఛితంగా 200 పరుగుల మార్క్ని దాటేస్తుందని అంతా భావించారు. కానీ,…
శ్రీలంక పరిస్థితి ఇప్పట్లో కుదుటపడే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికీ ఆ దేశం అప్పుల్లో కూరుకుపోయింది. నిత్యావసరాల కోసం కొనేందుకు జనాల దగ్గర డబ్బులు కూడా లేని పరిస్థితి ఏర్పడింది. దేశ ఖజానా మొత్తం పూర్తిగా దివాళా తీసింది. ప్రస్తుతం శ్రీలంక విదేశాల ఇచ్చే సాయంపైనే ఆధారపడింది. ప్రజల ఆగ్రహావేశాల మధ్య గతంలో ప్రధానిగా ఉన్న మహిందా రాజపక్సే రాజీనామా చేశారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన రణిల్ విక్రమసింఘే శ్రీలంకలో ఆహార సంక్షోభాన్ని హెచ్చరిస్తూ కీలక…
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ద్వీపదేశం శ్రీలంక ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఓ వైపు నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతుంటే…మరోవైపు పెట్రోల్,డిజిల్ ధరలు పెరగడంతో పాటు తీవ్ర కొరత కూడా అక్కడి ప్రజలను వేధిస్తోంది. పెట్రోల్ కొనేందుకు కూడా శ్రీలంక ఖజానాలో విదేశీమారక నిల్వలు లేవు. దీంతో ప్రజలు పెట్రోల్ బంకుల వద్ద క్యూ కడుతున్నారు. మరోవైపు లేని పెట్రోల్ కు కూడా అక్కడి ప్రభుత్వం ధరలను పెంచుతోంది. తాజాగా శ్రీలంకలో పెట్రోల్ ధర రూ. 400 దాటింది. ఇదిలా…
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉక్కిరిబిక్కిరి అవుతోంది ద్వీప దేశం శ్రీలంక. కనీసం పెట్రోల్, డిజిల్ కొనేందుకు కూడా విదేశీ మారక నిల్వలు లేని పరిస్థితి. ఇదిలా ఉంటే ప్రస్తుతం శ్రీలంక వద్ద పెట్రోల్ నిల్వలు పూర్తిగా అడుగంటుకుపోయాయి. అయితే గమ్మత్తు ఏంటంటే.. లేని పెట్రోల్ పై కూడా అక్కడి ప్రభుత్వం మళ్లీ ధరలు పెంచింది. మంగళవారం పెట్రోల్ ధర ను 20-24 శాతం, డిజిల్ పై 35-38 శాతం పెంచింది. ఈ విషయాన్ని విద్యుత్, ఇంధన శాఖ…
శ్రీలంక ఆర్థిక కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓ వైపు ఆహార కొరత, నిత్యావసరాల ధరలు పెరుగుతూ పోతుంటే.. మరో వైపు ఇంధన కష్టాలు శ్రీలంకను పట్టిపీడిస్తున్నాయి. దేశంలో చమురు నిల్వలు అడుగంటిపోయాయి. పెట్రోల్, డిజిల్ కోసం జనాలు పెట్రోల్ బంకుల ముందు బారులు తీరుతున్నారు. పెట్రోల్ కోసం ప్రజల మధ్య ఘర్షణ తలెత్తుతోంది. బ్రిటిష్ నుంచి స్వాతంత్య్రం పొందిన 1948 తరువాత శ్రీలంకలో ఎప్పుడూ చూడని విధంగా ఆర్థిక సంక్షోభం నెలకొంది. ఇదిలా ఉంటే శ్రీలంకలో మరోసారి…
శ్రీలంక ఆర్థిక సంక్షోభంతో రెండు నెల క్రితం రోడ్లెక్కిన జనం.. ఆందోళనలు ఉధృతం చేశారు. నిరసనలు కాస్త హింసాత్మకంగా మారాయి. దీంతో ఎమర్జెన్సీ విధించిన శ్రీలంక ప్రభుత్వం.. తరువాత సడలించింది. మళ్లీ మే 6 నుంచి చేపట్టిన నిరనసలు విధ్వంసానికి దారి తీయడంతో.. రెండోసారి అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఆ తరువాత మహింద రాజపక్స రాజీనామా చేయడం, కొత్త ప్రధానిగా రణిల్ విక్రమ సింఘే బాధ్యతలు చేపట్టడం జరిగిపోయాయి. ఇదే సమయంలో హింసాత్మక ఘటనలు తగ్గుముఖం పట్టడంతో……
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యావసరాల ధరలు పెరగడంతో పాటు పెట్రోల్ దొరక్క.. దొరికినా ధరలు పెరగడంతో ప్రజల్లో ఆసహనం పెరుగుతోంది. ఇప్పటికే దేశ అధ్యక్షుడు గోటబయ రాజపక్స రాజీనామా చేయాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజలు పెద్ద ఎత్తున నిరసన, ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ప్రజల ఆందోళన నేపథ్యంగాలో ప్రధానిగా ఉన్న మహిందా రాజపక్స తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం కొత్త ప్రధానిగా రణిల్ విక్రమసింఘేను నియమించాడు…