Srilanka: ఇంటి నుంచే పని చేయండంటున్న ప్రభుత్వం… ఎందుకో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉక్కిరిబిక్కిరి అవుతోంది ద్వీప దేశం శ్రీలంక. కనీసం పెట్రోల్, డిజిల్ కొనేందుకు కూడా విదేశీ మారక నిల్వలు లేని పరిస్థితి. ఇదిలా ఉంటే ప్రస్తుతం శ్రీలంక వద్ద పెట్రోల్ నిల్వలు పూర్తిగా అడుగంటుకుపోయాయి. అయితే గమ్మత్తు ఏంటంటే.. లేని పెట్రోల్ పై కూడా అక్కడి ప్రభుత్వం మళ్లీ ధరలు పెంచింది. మంగళవారం పెట్రోల్ ధర ను 20-24 శాతం, డిజిల్ పై 35-38 శాతం పెంచింది. ఈ విషయాన్ని విద్యుత్, ఇంధన శాఖ మంత్రి కాంచన విజేశేఖర తెలిపారు. దీనికి అనుగుణంగా రవాణా చార్జీలు కూడా పెరుగుతాయని తెలిపారు.
ఇదిలా ఉంటే శ్రీలంక ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు ఇంటి నుంచే పని చేయాలని సూచించింది. ఈ నిర్ణయం వల్లైనా ఇంధన కష్టాలు ఎంతో కొంత తీరుతాయని శ్రీలంక ప్రభుత్వం భావిస్తోంది. శ్రీలంక ప్రభుత్వ నివేదిక ప్రకారం అక్కడ మార్చిలో 21.5 శాతం ద్రవ్యోల్భనం ఉంటే ఏప్రిల్ లో రికార్డ్ స్థాయిలో 33.8 శాతానికి చేరింది. దీంతో మరింతగా నిత్యావసరాలు, ఇతర ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇటు వంటి పరిస్థితుల మధ్య శ్రీలంకలో ప్రధాని రణిల్ విక్రమసింఘే ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. కొత్తగా ఎనిమిది మంత్రులను కూడా నియమించారు. అయితే ఇప్పటి వరకు ఆర్థిక మంత్రి నియామకం జరగలేదు.
Also Read
మరోవైైపు జౌషధాల కొరత శ్రీలంకు పెద్ద సమస్యగా మారింది. సంక్షోభం కారణంగా శ్రీలంకు వైద్య పరికరాలు, మందుల సరఫరా నిలిచిపోయింది. ఇంధన సమస్యల వల్ల కరెంట్ కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. 1948 తరువాత స్వాతంత్య్రం పొందిన శ్రీలంక ఇటువంటి పరిస్థితిని ఎప్పుడూ ఎదుర్కొలేదు. శ్రీలంక ఎకానమీకి వెన్నెముకలా ఉండే పర్యటకం కోవిడ్ వల్ల పడిపోవడంతో సంక్షోభం మరింతగా ముదిరింది. దీనికి తోడు రాజపక్స కుటుంబీకుల అవినీతి కూడా శ్రీలంక పరిస్థితికి కారణం అని ప్రజలు ఆరోపిస్తున్నారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?