Srilanka: ఇంటి నుంచే పని చేయండంటున్న ప్రభుత్వం… ఎందుకో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉక్కిరిబిక్కిరి అవుతోంది ద్వీప దేశం శ్రీలంక. కనీసం పెట్రోల్, డిజిల్ కొనేందుకు కూడా విదేశీ మారక నిల్వలు లేని పరిస్థితి. ఇదిలా ఉంటే ప్రస్తుతం శ్రీలంక వద్ద పెట్రోల్ నిల్వలు పూర్తిగా అడుగంటుకుపోయాయి. అయితే గమ్మత్తు ఏంటంటే.. లేని పెట్రోల్ పై కూడా అక్కడి ప్రభుత్వం మళ్లీ ధరలు పెంచింది. మంగళవారం పెట్రోల్ ధర ను 20-24 శాతం, డిజిల్ పై 35-38 శాతం పెంచింది. ఈ విషయాన్ని విద్యుత్, ఇంధన శాఖ మంత్రి కాంచన విజేశేఖర తెలిపారు. దీనికి అనుగుణంగా రవాణా చార్జీలు కూడా పెరుగుతాయని తెలిపారు.
ఇదిలా ఉంటే శ్రీలంక ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు ఇంటి నుంచే పని చేయాలని సూచించింది. ఈ నిర్ణయం వల్లైనా ఇంధన కష్టాలు ఎంతో కొంత తీరుతాయని శ్రీలంక ప్రభుత్వం భావిస్తోంది. శ్రీలంక ప్రభుత్వ నివేదిక ప్రకారం అక్కడ మార్చిలో 21.5 శాతం ద్రవ్యోల్భనం ఉంటే ఏప్రిల్ లో రికార్డ్ స్థాయిలో 33.8 శాతానికి చేరింది. దీంతో మరింతగా నిత్యావసరాలు, ఇతర ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇటు వంటి పరిస్థితుల మధ్య శ్రీలంకలో ప్రధాని రణిల్ విక్రమసింఘే ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. కొత్తగా ఎనిమిది మంత్రులను కూడా నియమించారు. అయితే ఇప్పటి వరకు ఆర్థిక మంత్రి నియామకం జరగలేదు.
Also Read
- Trump: నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం.. డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
- Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్టాక్ సృష్టికర్త..
- Mojtaba Khamenei: శత్రువుల కుట్రలపై అప్రమత్తంగా ఉండాలి.. ఇరానీయులకు మొజ్తబా ఖమేనీ సందేశం
- Pakistan: పాకిస్తాన్ను మెచ్చుకున్న ఎలాన్ మస్క్.. గ్యాంగ్రేప్ దోషులకు ఉరిశిక్షపై ప్రశంసలు
మరోవైైపు జౌషధాల కొరత శ్రీలంకు పెద్ద సమస్యగా మారింది. సంక్షోభం కారణంగా శ్రీలంకు వైద్య పరికరాలు, మందుల సరఫరా నిలిచిపోయింది. ఇంధన సమస్యల వల్ల కరెంట్ కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. 1948 తరువాత స్వాతంత్య్రం పొందిన శ్రీలంక ఇటువంటి పరిస్థితిని ఎప్పుడూ ఎదుర్కొలేదు. శ్రీలంక ఎకానమీకి వెన్నెముకలా ఉండే పర్యటకం కోవిడ్ వల్ల పడిపోవడంతో సంక్షోభం మరింతగా ముదిరింది. దీనికి తోడు రాజపక్స కుటుంబీకుల అవినీతి కూడా శ్రీలంక పరిస్థితికి కారణం అని ప్రజలు ఆరోపిస్తున్నారు.
తాజావార్తలు
-
Twisha Sharma: భోపాల్ జైల్లో ట్విషా శర్మ నిందితులకు రాజభోగం.. భర్త, అత్తకు వీఐపీ ట్రీట్మెంట్
-
Women Living Alone in India: వితంతువులు, విడాకులు, ఒంటరి మహిళల సంఖ్యపై షాకింగ్ రిపోర్ట్.. దక్షిణాదిలో ఎందుకు ఎక్కువ?
-
Hyderabad Metro : మెట్రో వ్యవస్థకు ఎలాంటి నష్టం లేదు.. స్పష్టం చేసిన HMRL
-
Summer Holidays Extended: భారీ శుభవార్త.. జూన్ 14 వరకు వేసవి సెలవులు పొడిగింపు.. ఉత్తర్వులు జారీ..
-
RCB Player: అభిమానులకు బిగ్షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన కీలక ప్లేయర్..
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!