Srilanka Crisis: మరోసారి పెరిగిన పెట్రోల్ ధరలు.. రోడెక్కిన లంక వాసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంక ఆర్థిక కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓ వైపు ఆహార కొరత, నిత్యావసరాల ధరలు పెరుగుతూ పోతుంటే.. మరో వైపు ఇంధన కష్టాలు శ్రీలంకను పట్టిపీడిస్తున్నాయి. దేశంలో చమురు నిల్వలు అడుగంటిపోయాయి. పెట్రోల్, డిజిల్ కోసం జనాలు పెట్రోల్ బంకుల ముందు బారులు తీరుతున్నారు. పెట్రోల్ కోసం ప్రజల మధ్య ఘర్షణ తలెత్తుతోంది. బ్రిటిష్ నుంచి స్వాతంత్య్రం పొందిన 1948 తరువాత శ్రీలంకలో ఎప్పుడూ చూడని విధంగా ఆర్థిక సంక్షోభం నెలకొంది.
ఇదిలా ఉంటే శ్రీలంకలో మరోసారి పెట్రోల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ ధర రూ. 450 కాగా.. డిజిల్ ధర రూ. 445కు పెంచారు. దేశంలో ఇప్పటికీ కూడా పెట్రోల్, డిజిల్ ప్రజలకు లభించడం లేదు. పెట్రోల్ రాకుండానే ధరలు పెంచడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడెక్కి నిరసన తెలుపుతున్నారు లంక వాసులు.
Also Read
- Donald Trump: మన దగ్గర భారీ ఆయుధ నిల్వ ఉంది.. ఇరాన్ పేద దేశం.. యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన
- Pakistan: పిల్లలపై అత్యాచారం, ట్రాఫికింగ్ నిందితుడు.. PoK ఎన్నికల్లో గెలుపు..
- Forbes Best Under a Billion 2026: చైనాకు ఒక్క అడుగు దూరంలో భారత్.. ఫోర్బ్స్ జాబితాలో టాప్-200లో 27 సంస్థలు
- Modi-Netanyahu: మోడీకి నెతన్యాహు ఫోన్.. ఉద్రిక్తతల వేళ కీలక సంభాషణ
ఇదిలా ఉంటే శ్రీలంకకు మరోసారి భారత్ ఆపన్న హస్తం అందించింది. ఇప్పటికే ఒకసారి 40,000 మెట్రిక్ టన్నుల డిజిల్ ను ఇండియా, శ్రీలంకకు సరఫరా చేసింది. మరోసారి 40,000 మెట్రిక్ టన్నుల పెట్రోల్ ను శ్రీలంకకు పంపించింది. ఈ విషయాన్ని సోమవారం ఇండియా వెల్లడించింది. అప్పులు ఊబిలో కూరుకుపోయిన శ్రీలంకకు 500 మిలియన్ డాలర్ల క్రెడిట్ లైన్ ను ఇండియా పొడగించింది. సోమవారం ఇండియా పంపిన పెట్రోల్ శ్రీలంకు చేరుకున్నట్లు భారత హైకమిషనర్ ట్విట్టర్ లో వెల్లడించారు.
విదేశీ నిల్వలు పూర్తిగా ఖాళీ అవ్వడంతో పెట్రోల్ కొనుక్కునేందుకు కూడా శ్రీలంక వద్ద డబ్బులు లేవు. ఇదిలా ఉంటే పెట్రోల్ కోసం ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. పెట్రోల్ లేకపోవడంతో ఆగ్రహించిన ప్రజలు ఉత్తర మధ్య ప్రావిన్స్ లోని బంకు యజమాని ఇళ్లును తగలబెట్టారు. దీంతో ఇలా చేస్తే పెట్రోల్ రవాణాను నిలపివేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది.
తాజావార్తలు
-
Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
Friday Horoscope: ఆ రాశి వారు జాగ్రత్త.. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు!
-
Ishan Kishan: బ్యాంక్ ఉద్యోగం, క్రికెట్ సరిపోలేదా?.. పార్ట్ టైమ్ టీ కొట్టు ఎప్పుడు పెట్టావ్ ఇషాన్ కిషాన్ భాయ్?
-
E3 Tryon: E3 ట్రయాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల.. 165KM రేంజ్, AI ఫీచర్లు.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!