Sri Lanka Crisis: పెట్రోల్ కొనడానికి కూడా డబ్బులు లేవు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక తమ ప్రజలకు నిత్యావసరాలు అందించలేని పరిస్థితుల్లో ఉంది. మరోవైపు శ్రీలంకలో ఇంధన సంక్షోభం ముదురుతోంది. దేశ వ్యాప్తంగా బంకుల్లో నోస్టాక్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. తాజాగా శ్రీలంక ఇంధన శాఖ, విద్యుత్ మంత్రి కాంచన విజేశేఖర కీలక ప్రకటన చేశారు. పెట్రోల్ కు విదేశీ మారక నిల్వలు చెల్లించే పరిస్థితి కూడా లేదని విజేశేఖర వెల్లడించారు. తమ జలాల్లో రెండు నెలల పాటు లంగర్ వేసి ఉన్న పెట్రోల్ ఓడలకు డబ్బు చెల్లించలేని దయనీయ స్థితిలో ఉంది. ఇదిలా ఉంటే దేశంలో తగినంత డిజిల్ నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది.
ఇటీవల రెండు రోజుల క్రితం దేశంలో ఒక రోజుకు సరిపడే పెట్రోల్ నిల్వలు ఉన్నాయని ప్రధాని రణిల్ విక్రమసింఘే ప్రజలకు తెలిపారు. దీంతో ప్రజలు పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరారు. అప్పటికే దేశవ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకుల్లో నిల్వలు అయిపోయాయి. ప్రస్తుతం ప్రజలు ఎవ్వరూ పెట్రోల్ బంకులు ముందు నిలబడవద్దని ప్రభుత్వం సూచించింది.
Also Read
- WMO Warning: ప్రమాదకర ఎల్నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
- Marco Rubio: ఇరాన్ అణు చర్చలపై మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు.. పశ్చిమాసియా శాంతించేనా?
- US: అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్గా విలియం జె.పుల్టే నియామకం.. ట్రంప్ అభినందనలు
- Trump: ‘ఐ లవ్ ఇండియా.. ఐ లవ్ మోడీ’’ సోషల్ మీడియాలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. ఆసక్తి రేపుతోన్న కామెంట్స్
పరిమితమైన పెట్రోల్ నిల్వలు మాత్రమే ఉన్నాయని.. ముఖ్యంగా అంబులెన్స్, అత్యవసర సేవలకు మాత్రమే పెట్రోల్ పంపిణీ చేసేలా ప్రయత్నిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. జూన్ 2022 నాటికి ఇంధన దిగుమతుల కోసం శ్రీలంకకు 530 మిలియన్ల యూఎస్ డాలర్లు అవసరం అని ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం భారత్ క్రెడిట్ లైన్ ద్వారా పొందుతున్నప్పటికీ అవి దేశ అవసరాలకు చాలడం లేదు.
ఇదిలా ఉంటే కొత్త ప్రధాని కొలువు తీరినా… ఇప్పటికిప్పుడు శ్రీలంక ఆర్థిక పరిస్థితుల్లో మార్పు రాని పరిస్థితి ఉంది. ప్రస్తుతం వరల్డ్ బ్యాంకు నుంచి 160 మిలియన్ డాలర్లు శ్రీలంకకు అందాయి. ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు నుంచి గ్రాంట్ వస్తుందని శ్రీలంక భావిస్తోంది. మరోవైపు శ్రీలంకలో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. అధ్యక్షుడు గోటబయ కూడా తన పదవి నుంచి దిగిపోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల నిరసనలతో ప్రధానిగా ఉన్న మహిందా రాజపక్స ఇప్పటికే తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల శ్రీలంక పార్లమెంట్ లో అధ్యక్షుడు గోటబయపై పెట్టిన అవిశ్వాస తీర్మాణం వీగిపోయింది.
తాజావార్తలు
-
YS Jagan: డీఎస్సీ బాధితులకు జగన్ భరోసా.. అండగా ఉంటాం.. న్యాయపోరాట ఖర్చులన్నీ భరిస్తాం..
-
Karnataka: కర్ణాటక సీఎంగా డీకే.శివకుమార్ ప్రమాణస్వీకారం
-
Mahalakshmi Rajyoga: జూన్ 11 నుంచి మహాలక్ష్మీ రాజయోగం.. ఈ రాశుల వారికి డబ్బే డబ్బు..
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Central Cabinet: భారీ శుభవార్త చెప్పిన కేంద్ర కేబినెట్.. తెలంగాణలో ఆ రహదారులు ఇక 4 లైన్లుగా..
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!