Srilanka Crisis: దయచేసి అప్పు ఇవ్వండి.. ఇండియాను కోరిన శ్రీలంక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంక పరిస్థితి ఇప్పట్లో కుదుటపడే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికీ ఆ దేశం అప్పుల్లో కూరుకుపోయింది. నిత్యావసరాల కోసం కొనేందుకు జనాల దగ్గర డబ్బులు కూడా లేని పరిస్థితి ఏర్పడింది. దేశ ఖజానా మొత్తం పూర్తిగా దివాళా తీసింది. ప్రస్తుతం శ్రీలంక విదేశాల ఇచ్చే సాయంపైనే ఆధారపడింది. ప్రజల ఆగ్రహావేశాల మధ్య గతంలో ప్రధానిగా ఉన్న మహిందా రాజపక్సే రాజీనామా చేశారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన రణిల్ విక్రమసింఘే శ్రీలంకలో ఆహార సంక్షోభాన్ని హెచ్చరిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉంటే ఇటీవల శ్రీలంక వ్యవసాయ మంత్రి ఆ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ వరిని పండించాలని కోరారు. ఈ నేపథ్యంలో వ్యవసాయానికి అవసరమైన ఎరువులు కొనేందుకు కూడా శ్రీలంక వద్ద డబ్బులు లేవు. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు ఎరువుల కోసం ఇండియా నుంచి శ్రీలంక 55 మిలియన్ డాలర్ల రుణాన్ని కోరింది. ఇంపోర్ట్-ఎక్స్ పోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా యూరియాను కొనుగోలు చేసేందుకు శ్రీలంకకు 55 మిలియన్ డాలర్ల రుణాన్ని ఇండియా ఇవ్వడానికి అంగీకరించిందని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను తీర్చేందుకు సత్వర చర్యలు చేపడితే..ఐదారు నెలల్లో ప్రస్తుత వ్యవసాయ కొరతను తీర్చగలమని శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే తెలిపారు.
Also Read
- Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
- Trump: మోజ్తబా ఖమేనీ చనిపోయడని అనుకోవట్లేదు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- Nepal-Tibet Flood: వరదల్లో చిక్కుకున్న ఇషా ఫౌండేషన్కు చెందిన 77 మంది భక్తులు, రంగంలోకి సద్గురు
రసాయన ఎరువులను దిగుమతులను నిషేధిస్తూ శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే తీసుకున్న నిర్ణయం శ్రీలంక ఆహార సంక్షోభానికి కారణం అయింది. దీంతో దేశంలో ఆహార పంటల ఉత్పత్తి గణనీయంగా 50 శాతానికి తగ్గింది. దీంతో దేశ వ్యాప్తంగా తీవ్ర ఆహార సంక్షోభం ఏర్పడింది. 1945 లో బ్రిటన్ నుంచి స్వాతంత్య్రం పొందిన తర్వాత శ్రీలంక ఇటువంటి ఆర్థిక, ఆహార సంక్షోభాన్ని ఎదుర్కోలేదు. ఆహారం, ఔషధాల, వంటగ్యాస్, టాయిలెట్ పేపర్, అగ్గిపెట్టె వంటి నిత్యావసరాలకు కూడా తీవ్ర కొరత ఏర్పడింది. ప్రజల పెట్రోల్, డిజిల్ కోసం గంటల తరబడి క్యూల్లో ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..