Surya Kumar Yadav: ఐపీఎల్ 2025 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ (SRH), ముంబై ఇండియన్స్ (MI) మధ్య బుధవారం జరిగిన మ్యాచ్లో ఒక ఆసక్తికర సంఘటన అభిమానులను నవ్వించింది. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు అభిషేక్ శర్మ మధ్య జరిగిన ఓ సరదా సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది వరకు పంజాబ్ మ్యాచ్ లో వీరబాదుడు బాదిన…
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా చాలా ప్రశాంతంగా ఉంటాడు. మైదానంలో ఎంత ఒత్తిడి ఉన్నా, పరిస్థితులు ఎలా ఉన్నా సరే.. మొహం మీద చిరునవ్వు ఉంటుంది. ప్రత్యర్థి బ్యాటర్ తన బౌలింగ్లో బౌండరీలు, సిక్సులు బాదినా.. నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. మైదానంలో ఏ ఆటగాడికైనా గాయం అయితే పలకరిస్తాడు. అయితే తాజాగా బుమ్రా ప్రవర్థించిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అంతేకాదు బుమ్రా వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో విమర్శలకు దారితీస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే?. ఐపీఎల్…
తాను ముంబై ఇండియన్స్లో చేరినప్పటి నుంచి ఇప్పటివరకు విన్నింగ్ ఫీల్ను పొందలేదని హైదరాబాదీ ప్లేయర్ తిలక్ వర్మ తెలిపాడు. తాను 2022లో ముంబై జట్టులో చేరా అని, అప్పటి నుంచి తాము ట్రోఫీని గెలవలేదన్నాడు. వ్యక్తిగతంగా గత మూడు సీజన్లు బాగానే సాగాయని, జట్టు పరంగా కోరుకున్న ఫలితాలు మాత్రం రాలేదన్నాడు. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ప్లేయర్లకు మద్దతుగా ఉంటాడని, ఏదైనా తప్పు చేస్తే ముఖం మీదే చెప్పేస్తాడని తిలక్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2025లో తిలక్…
టీమిండియా స్టార్, ముంబై ఇండియన్స్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు నెలకొల్పాడు. టీ20 క్రికెట్లో బుమ్రా 300 వికెట్ల మైలు రాయిని అందుకున్నాడు. ఐపీఎల్ 2025లో భాగంగా బుధవారం రాత్రి ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ను అవుట్ చేయడంతో బుమ్రా ఈ ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. దాంతో అత్యంత వేగంగా 300 వికెట్స్ పడగొట్టిన మొదటి భారత బౌలర్గా నిలిచాడు. 237…
ఐపీఎల్ 2025లో సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. ఈ సీజన్లో ఓ సెంచరీ తప్పితే.. మరో మంచి ఇన్నింగ్స్ ఆడింది లేదు. ఎస్ఆర్హెచ్కు కీలకమైన మ్యాచ్ ముంబై ఇండియన్స్పై కూడా ఇషాన్ పూర్తిగా నిరాశపరిచాడు. బుధవారం రాత్రి ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో నాలుగు బంతులు ఆడి.. ఒకే ఒక్క పరుగు చేసి పెవిలియన్ చేరాడు. అయితే ఈ మ్యాచ్లో ఇషాన్ అవుట్ అవ్వడం ఇప్పుడు సోషల్…
టీ20 క్రికెట్లో హిట్మ్యాన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టీ20ల్లో 12 వేల పరుగులు పూర్తి చేసిన రెండో భారతీయుడిగా రోహిత్ రికార్డుల్లోకెక్కాడు. ఐపీఎల్ 2025లో భాగంగా బుధవారం ఉప్పల్ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్పై (70; 46 బంతుల్లో 8×4, 3×6) హాఫ్ సెంచరీ బాదడంతో ఈ మైలురాయిని సాధించాడు. జాబితాలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (13,208) హిట్మ్యాన్ కంటే ముందున్నాడు. మొత్తంగా టీ20 క్రికెట్లో 12 వేల పరుగులు చేసిన ఎనిమిదవ…
SRH vs MI: హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) బ్యాటింగ్ లైనప్ ఆరంభంలో తడబడినప్పటికీ హెన్రిచ్ క్లాసెన్, అభినవ్ మనోహర్ల బ్యాటింగ్ తో చెప్పుకోతగ్గ స్కోర్ చేయగలిగింది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ (MI) ఫీల్డింగ్ ఎంచుకోగా, మొదట బ్యాటింగ్ చేసిన SRH నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. ఇక బ్యాటింగ్కు దిగిన ఎస్ఆర్హెచ్ జట్టుకు ఆరంభం నుంచి…
SRH vs MI: హైదరాబాదులోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో నేడు ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ప్లే ఆఫ్ రేసులో నిలబడాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాటర్లు పూర్తిగా తేలిపోయారు. వరుసపెట్టి ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు పెవిలియన్ చేరారు. కేవల 35 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది ఎస్ఆర్హెచ్ జట్టు. ఉప్పల్ స్టేడియంలో భారీగా పరుగుల వరద పారుతుందని…
SRH vs MI: ఉప్పల్ వేదికగా ఐపీఎల్ 2025 సీజన్లో మరో హై వోల్టేజ్ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. ముంబై ఇండియన్స్ (MI), సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్ల మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా పెట్టుకోవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన కీలక పోరులో ఇరు జట్లు ఢీకొట్టనున్నాయి. ఇప్పటివరకు SRH ఆడిన 7 మ్యాచ్ల్లో కేవలం 2 విజయాలే నమోదు చేయగలిగింది. దీనితో ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో 9వ స్థానంలో ఉంది. ఈ…
పహల్గాం సమీప బైసరన్ లోయలో ఉగ్రవాదులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు.. పర్యాటకులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఉగ్రదాడికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యులు తప్పకుండా భారీ మూల్యం చెల్లించుకుంటారని సోషల్ మీడియాలో భారతీయలు పోస్టులు పెడుతున్నారు. ఉగ్రదాడికి వ్యతిరేకంగా నేడు ఐపీఎల్ ప్లేయర్స్ నల్ల రిబ్బన్లతో…