Surya Kumar Yadav: సూరీడు నువ్వేం మారలేదు.. మరోసారి అభిషేక్ జేబులు చెక్ చేసిన స్కై!
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- మరోసారి అభిషేక్ జేబులు చెక్ చేసిన స్కై!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Surya Kumar Yadav: ఐపీఎల్ 2025 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ (SRH), ముంబై ఇండియన్స్ (MI) మధ్య బుధవారం జరిగిన మ్యాచ్లో ఒక ఆసక్తికర సంఘటన అభిమానులను నవ్వించింది. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు అభిషేక్ శర్మ మధ్య జరిగిన ఓ సరదా సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఇది వరకు పంజాబ్ మ్యాచ్ లో వీరబాదుడు బాదిన అభిషేక్ శర్మ తన సెంచరీ పూర్తి అవ్వగానే తన జేబులో నుంచి ఒక లెటర్ తీసి చూపించిన విషయం అందరికి గుర్తు ఉండే ఉంటుంది. ఇక ముంబయి వేదికగా జరిగిన మ్యాచ్ లో అభిషేక్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో సూర్యకుమార్ యాదవ్ వచ్చి అతని జేబులను చెక్ చేసాడు. అందుకు సంబంధించిన విషయం కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. అయితే బుధవారం మ్యాచ్ మొదలు కాకముందు ఇరుజట్ల ఆటగాళ్లు గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేస్తుండగా.. ఆ సమయంలో సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ ఒకరినొకరు కౌగిలించుకున్న సందర్భంలో మామరోమారు ఈ ఘటన జరిగింది. సూర్యకుమార్ యాదవ్ అభిషేక్ జేబుల్లో ఏదో వెతుకుతున్నట్లు కనిపించాడు. ఈ ఘటనను అక్కడే ఉన్న ఒక అభిమాని తన కెమెరాలో బంధించి, సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. ఈ వీడియో షేర్ చేస్తూ, “సూర్య భాయ్ అభిషేక్ జేబుల్లో స్లిప్ల కోసం వెతుకుతున్నాడు” అని హాస్యాస్పద లైన్ రాసుకొచ్చాడు. దానితో ఈ పోస్ట్ కొద్దీ సేపట్లోనే తెగ వైరల్ అయ్యింది.
Also Read
- Rahul Gandhi: పెల్లెట్ గన్ ఘటనపై రాహుల్ గాంధీ ధర్నా.. ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదు
- India Forex Reserves: విదేశీ మారకద్రవ్య నిల్వల్లో భారత్కు బిగ్ బూస్ట్.. బంగారం నిల్వలు కూడా భారీ పెరుగుదల..
- Maharashtra: కొడుకును కాపాడే ప్రయత్నం విషాదాంతం.. తల్లిదండ్రులు సహా ముగ్గురూ మృతి
- Iran: ‘యుద్ధం ముగిస్తేనే మంచిది’.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సంచలన వ్యాఖ్యలు
Surya bhai searching for slips in Abhishek’s pockets #srh #mumbai #mumbaiindians #sunrisers #surya #suryabhai #srh #SunrisersHyderabad #abhisheksharma #SRHvsMI pic.twitter.com/7nikPcYc0p
— Srikanth avasarala (@SrikanthAvasar2) April 23, 2025
ఈ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు సొంత మైదానంలో ఆడినప్పటికీ, ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడుతో విజయం సాధించింది. గతంలో వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్లో కూడా ముంబై ఇండియన్స్ 4 వికెట్ల తేడుతో సన్రైజర్స్ను ఓడించిన సంగతి తెలిసిందే. అయితే, ఈసారి హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో ఈ సరదా సంఘటన అభిమానులకు మరపురాని క్షణంగా మిగిలిపోయింది.
తాజావార్తలు
-
Rahul Gandhi: పెల్లెట్ గన్ ఘటనపై రాహుల్ గాంధీ ధర్నా.. ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదు
-
Bandi Sanjay : యోగితో బండి సంజయ్ భేటీ.. తెలంగాణపై కీలక చర్చ.!
-
India Forex Reserves: విదేశీ మారకద్రవ్య నిల్వల్లో భారత్కు బిగ్ బూస్ట్.. బంగారం నిల్వలు కూడా భారీ పెరుగుదల..
-
Maharashtra: కొడుకును కాపాడే ప్రయత్నం విషాదాంతం.. తల్లిదండ్రులు సహా ముగ్గురూ మృతి
-
Iran: ‘యుద్ధం ముగిస్తేనే మంచిది’.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!