ఇండియా- పాకిస్తాన్ మధ్య 2003 నుంచి మొదలుపెడితే 2019 వరకు జరిగిన వరల్డ్ కప్ లో ఇండియాదే పై చేయి అయింది. అయితే ఇప్పుడు జరిగే మ్యాచ్ కోసం ఇరుజట్లు గెలవాలనే ఆశతో ఉన్నాయి. చూడాలి మరీ 2023 వరల్డ్ కప్ లో ఈ ఇరుజట్ల మధ్య మ్యాచ్ ఎవరు గెలుస్తారో.
ప్రపంచ కప్ 2023లో బుధవారం రాత్రి ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లపై భారత బ్యాట్స్మెన్ పూర్తిగా ఆధిపత్యం చెలాయించారు, క్రికెట్ అభిమానులు కూడా హృదయాన్ని హత్తుకునే దృశ్యాన్ని చూశారు. ఫిరోజ్ షా కోట్లా స్టేడియం (ప్రస్తుతం అరుణ్ జైట్లీ స్టేడియం)లో జరిగిన మ్యాచ్లో భారత స్టార్ విరాట్ కోహ్లీ ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ నవీన్-ఉల్-హక్ను ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు.
వరల్డ్ కప్ 2023 టోర్నీలో భారత్ విజయాల బాటలో పయనిస్తోంది. ఆస్ట్రేలియాతో మొదటి మ్యాచ్లో చెమటోడ్చి గెలిచిన భారత్.. పసికూన అఫ్గానిస్థాన్ జట్టుపై అలవోకగా విజయం సాధించింది. హిట్ మ్యాన్ రోహిత్ భారీ శతకాన్ని నమోదు చేయడంతో 15 ఓవర్లు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని భారత్ తన ఖాతాలో వేసుకుంది.
భారత కెప్టెన్ రోహిత్ శర్మ అఫ్గానిస్థాన్పై తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో మొదటి మ్యాచ్లో విఫలమైన హిట్ మ్యాన్.. పసికూన అఫ్గాన్పై శతకంతో చెలరేగిపోయాడు.
వన్డే ప్రపంచకప్లో నజ్ముల్ హుస్సేన్ శాంటో అద్భుత డైవింగ్ క్యాచ్ పట్టాడు. ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచ్లో బంగ్లాదేశ్ ఆటగాడు లాంగ్ ఆఫ్లో ఈ క్యాచ్ తీసుకున్నాడు.
టీమిండియా ఆడిన తొలి మ్యాచ్లో ఓపెనర్ శుభ్మన్ గిల్ ఆడలేదు. కారణం అతను డెంగ్యూ బారిన పడ్డాడు. ఇక రేపు టీమిండియా ఆఫ్ఘనిస్థాన్తో రెండో మ్యాచ్ ఆడనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లో కూడా శుభ్మన్ గిల్ ఆడటంలేదని బీసీసీఐ తెలిపింది.
ఇద్దరు క్రికెటర్లపై హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) నిషేధం వేటు వేసింది. అండర్-19 క్రికెటర్ మహ్మద్ బాబిల్లేల్, రిజిస్టర్డ్ ఆటగాడు శశాంక్ మెహ్రోత్రాలను ఐదేళ్ల పాటు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టీమ్ సెలక్షన్ లో తప్పుడు పత్రాలు(నకిలీ వయస్సు సర్టిఫికెట్స్) ఇచ్చినట్లు హెచ్సీఏ నిర్ధారించింది.
మొన్నటికి మొన్న వన్డే వరల్డ్ కప్ మ్యాచ్లో సౌతాఫ్రికా ఆటగాడు మార్క్రామ్ చెలరేగి ఆడాడు. కేవలం 49 బంతుల్లోనే సెంచరీ చేసి రికార్డులకెక్కాడు. తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన యువ క్రికెటర్ ఫ్రేజర్ మెక్ గుర్క్ కూడా అరుదైన ఘనత సాధించాడు. 29 బంతుల్లో సెంచరీ చేశాడు. లిస్ట్ ఏ క్రికెట్ లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన క్రికెటర్గా రికార్డులకెక్కాడు.
2023 వన్డే వరల్డ్ కప్కు భారత్ ఆతిథ్యమిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అందులో భాగంగా ఈనెల 5 నుంచి వరల్డ్ కప్ మ్యాచ్ లు ప్రారంభమయ్యాయి. మొదటి మ్యాచ్ న్యూజిలాండ్-ఇంగ్లండ్ మధ్య అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగింది. ఇంత పెద్ద ఈవెంట్ లో మొదటి మ్యాచ్ చూడటానికి క్రికెట్ అభిమానులు ఎక్కువగా హాజరుకాలేదు.
వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ బోణీ కొట్టింది. చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో టీమిండియా 6 వికెట్ల తేడా ఘన విజయం సాధించింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. 199 పరుగులకే ఆలౌటైంది.