డ్రీమ్ స్పోర్ట్స్ యాజమాన్యంలోని ఫ్యాన్కోడ్ను భాగస్వామ్యం చేసిన తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియో తన మొదటి స్పోర్ట్స్ ఛానెల్ని ప్రారంభించింది. ఇది క్రికెట్, ఫుట్బాల్తో సహా ప్రపంచవ్యాప్తంగా 15కి పైగా క్రీడల ప్రత్యక్ష ప్రసారాన్ని అందిస్తుంది. అమెజాన్ ఇంతకుముందు న్యూజిలాండ్తో జరిగిన భారత క్రికెట్ మ్యాచ్లతో సహా ప్రత్యక్ష ప్రసార మ్యాచ్లను ప్రసారం చేసింది.
ప్రపంచకప్ 2023 ట్రోఫీని అందుకోవడానికి టీమ్ ఇండియా కేవలం ఒక్క అడుగు దూరంలోనే ఉంది. సెమీఫైనల్లో టీమిండియా 70 పరుగుల తేడాతో న్యూజిలాండ్ను ఓడించి ఫైనల్లోకి ప్రవేశించింది. నవంబర్ 19న నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్కు రోహిత్ సేన సిద్ధంగా ఉంది.
టీమిండియా స్టార్ బ్యాటర్లు చెలరేగి ఆడడంతో భారత్ భారీ స్కోరును సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 397 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(117), శ్రేయస్ అయ్యర్(105) శతకాలతో అదరగొట్టారు.
ఈనెల 23న విశాఖలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య టీ-20 మ్యాచ్ జరగనుంది. టీ-20 మ్యాచ్కు సంబంధించి టికెట్ల అమ్మకాలు 15, 16 తేదీల్లో పేటీఎం (ఇన్సైడర్.ఇన్) ద్వారా ఉ. 11.00 గం. నుంచి జరుగుతాయని ఏసీఏ కార్యదర్శి ఎస్.ఆర్.గోపీనాథరెడ్డి తెలిపారు.
ఈ ప్రపంచకప్లో ఎట్టకేలకు ఇంగ్లండ్ మరో గేమ్ను గెలుచుకుంది. టోర్నమెంట్లో ఇది వారికి రెండో విజయం మాత్రమే కావడం గమనార్హం. ఇంగ్లాండ్ జట్టు నెదర్లాండ్స్ను 37.2 ఓవర్లలోనే 179 పరుగులకే ఆలౌట్ చేసి 160 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి నేరుగా అర్హత సాధించేందుకు ఈ రెండు పాయింట్లు కూడా ఎంతో ముఖ్యం.
ప్రపంచకప్లో భాగంగా పుణెలోని మహారాష్ట్ర క్రికెట్అసోసియేషన్ స్టేడియంలో ఇంగ్లాండ్, నెదర్లాండ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 339 పరుగులు చేసింది.
వన్డే వరల్డ్ కప్ 2023లో దూసుకెళ్తున్న టీమిండియా ఐసీసీ ర్యాంకింగ్స్లోనూ తన సత్తాను చాటుకుంది. వన్డేల్లో నెం.1 జట్టుగా టీమిండియా నిలిచింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలోనూ భారత ఆటగాళ్లు తమ సత్తాను చాటారు.
తెలంగాణలో గోల్ఫ్పై శ్రీనిధి యూనివర్సిటీ తమ నిబద్ధతను చాటుకుంది. హైదరాబాద్ లో తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ మూడో ఎడిషన్ విజయవంతంగా ముగిసింది. ఈ పోటీలో 16 జట్లు పాల్గొన్నాయి. ఫైనల్స్ సీజన్ 3లో K మోటార్స్ - ఆర్య వారియర్స్ విజయం సాధించింది.