What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు కృష్ణా జిల్లాలో బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి పర్యటించనున్నారు. పామర్రు బెల్ పరిశ్రమ పరిశీలన, జిల్లా కార్యవర్గ సమావేశంలో పురంధరేశ్వరి పాల్గొననున్నారు.
నేడు అనకాపల్లి మండలం కూండ్రం గ్రామంలో వంగవీటి రంగా విగ్రహాంను విశాఖ ఉత్తర ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆవిష్కరించనున్నారు. అనంతరం గ్రామంలో బహిరంగ సభ ఏర్పాటు చేసి మాట్లాడనున్నారు.
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
తూర్పుగోదావరి జిల్లాలో హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత పర్యటించనున్నారు. ఉదయం 11:00 గంటలకు కొవ్వూరు టౌన్లో నిర్వహించే ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12:30 గంటలకు తాళ్లపూడి మండలం పశివేదల గ్రామంలో నిర్వహించే కొవ్వూరు నియోజకవర్గ పాస్టర్ల క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు. రాత్రి 9 గంటల వరకు ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమం, క్రిస్మస్ వేడుకల్లో తానేటి వనిత పాల్గొంటారు.
నేడు శ్రీశైలంలో వార్షిక అరుద్రోత్సవం సందర్భంగా రాత్రి మల్లికార్జునస్వామికి మహాన్యాస పారాయణ లింగోద్భవకాల ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం జరగనుంది. సాయంత్రం మార్గశిర శుద్ధ పౌర్ణమి సందర్భంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారికి శ్రీశైల గిరి ప్రదక్షిణ ఉంటుంది. పౌర్ణమి సందర్భంగా సాయంత్రం శ్రీభ్రమరాంబికాదేవి అమ్మవారికి లక్ష కుంకుమార్చన జరగనుంది.
Also Read: Praja Bhavan: ప్రజాభవన్ ముందు కారు బీభత్సం.. అసలు నిందితుడిని తప్పించిన పోలీసులు?
సీఎం రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని మోదీతో వారు సాయంత్రం 4 గంటలకు భేటీ కానున్నారు. ప్రధానితో భేటీ సందర్భంగా రాష్ట్ర అవసరాల గురించి విన్నవించడంతో పాటు అభివృద్ధి ప్రాజెక్టులు, నిధులు మంజూరు చేయాలని సీఎం రేవంత్ కోరనున్నట్లు సమాచారం.
నేడు వరంగల్ జిల్లాలో వరంగల్ ఇంఛార్జి మంత్రి పోగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్లో తలపడేందుకు భారత్ సై అంటోంది. సఫారీ గడ్డపై టెస్టుల్లో తొలిసారి సిరీస్ సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో భారత్ బరిలోకి దిగుతోంది. రెండు టెస్టుల సిరీసే కాబట్టి.. తొలి మ్యాచ్ గెలిచిన జట్టుకు ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే తర్వాతి మ్యాచ్ డ్రా చేసుకున్నా.. సిరీస్ సొంతమవుతుంది. దక్షిణాఫ్రికా పర్యటనలో టీ20 సిరీస్ను 1-1తో పంచుకున్న భారత్.. వన్డే సిరీస్ను 2-1తో కైవసం చేసుకున్న విషయం విదితమే.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!