నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మంగళవారం 6 గంటల పాటు విచారించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికే ఓ దఫా విచారణకు హాజనైన సోనియా గాంధీ తాజాగా మంగళవారం మరోసారి విచారణకు హాజరయ్యారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ మంగళవారం మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. ఈ నెల 21న సోనియాను దాదాపు 2 గంటలపాటు ప్రశ్నించిన అధికారులు రేపు మరోసారి ప్రశ్నించనున్నారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని రెండో విడత విచారించనున్న తేదీని ఈ నెల 25 కాకుండా 26కు మార్చినట్లు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వెల్లడింటారు. ఈ మేరకు సోనియాకు ఈడీ తాజా సమన్లు జారీ చేసింది.
ఈడీ పేరిట ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీని కేంద్ర ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు. హస్తం పార్టీపై కక్షపూరితంగానే కేంద్ర సర్కార్ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అప్రజాస్వామిక పద్దతిలో ఈడీ సోనియాగాంధీని విచారిస్తోందని వివమర్శించారు. ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేసారు. అయితే.. సోనియాపై ఈడీ కేసు నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలోనూ నేతలు ధర్నాకు దిగారు. నగరంలోని నెక్లెస్రోడ్లోని ఇందిరా…