National Herald case: నేషనల్ హెరాల్డ్ కేసులో ముగిసిన ఈడీ విచారణ.. నెక్ట్స్ ఏంటీ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేషనల్ హెరాల్డ్ కేసులో ఇక విచారణ ముగిసినట్టే అని చెబుతున్నారు అధికారులు.. ఈ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న రాహుల్, సోనియా గాంధీలను ప్రశ్నించింది ఈడీ.. మొదట్లో రాహుల్ గాంధీని సుదీర్ఘంగా విచారించి ప్రశ్నల వర్షం కురిపించింది.. ఆ తర్వాత సోనియా గాంధీని విచారణకు పిలిచింది.. అయితే, ఆ ఇద్దరి నుంచి ఒకే రకమైన సమాధాలు వచ్చినట్టుగా తెలుస్తోంది.. మనీ లాండరింగ్ కేసులో మూడో రౌండ్ విచారణ నిమిత్తం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరయ్యారు. మంగళవారం, ఈడీ అధికారులు ఆరు గంటల పాటు సోనియాను ప్రశ్నించగా, కేంద్ర సంస్థల దుర్వినియోగంపై కాంగ్రెస్ ఢిల్లీ మరియు ఇతర చోట్ల నిరసన కార్యక్రమాలు చేపట్టింది.. నిరసన తెలిపినందుకు రాహుల్ గాంధీ సహా వందలాది మంది పార్టీ కార్యకర్తలు మరియు అగ్రనేతలను అదుపులోకి అరెస్ట్ చేశారు పోలీసులు.. కానీ తర్వాత అందరినీ విడుదల చేశారు.
Read Also: Husband takes over as collector from wife: భార్య నుంచి కలెక్టర్ బాధ్యతలు స్వీకరించిన భర్త..
Also Read
- Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
- Hydrogen Train: భారత తొలి హైడ్రోజన్ రైలుకు గ్రీన్ సిగ్నల్.. ప్రత్యేకతలేంటంటే!
- Rules Changes: సామాన్యుడికి జూలై షాక్.. 1వ తేదీ నుంచే ఈ 5 కీలక మార్పులు
- Britain Heatwave: భారత్లో 45°C ఉన్నా ఏం కాదు.. బ్రిటన్లో 35°Cకే ప్రజలు ఎందుకు అల్లాడుతున్నారు?
ఇక, 3వ రోజు సోనియా గాంధీని మూడు గంటల పాటు ప్రశ్నించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. అయితే, ఈ కేసులో తనయుడు రాహుల్ గాంధీ, తల్లి సోనియా నుంచి ఒకే రకమైన సమాధానాలు వచ్చినట్టుగా తెలుస్తోంది.. “అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్” ( ఏజేఎల్) “యంగ్ ఇండియన్ ప్రయువేట్ లిమిటెడ్” కు మధ్య జరిగిన లావాదేవీల వ్యవహారాలన్నీ కాంగ్రెస్ పార్టీ అప్పటి కోశాధికారి మోతీలాల్ ఓరా చూశారని సోనియా, రాహుల్ చెప్పినట్టుగా సమాచారం.. అయితే, 2020లో మోతీలాల్ ఓరా మృతిచెందిన విషయం తెలిసిందే..సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీ కోశాధికారిగా పనిచేశారు మోతీలాల్ ఓరా… కాగా, ప్రస్తుతానికి నరేషనల్ హెరాల్డ్ కేసులో విచారణ పూర్తి అయినట్టుగానే సమాచారం. సోనియా గాంధీని తదుపరి విచారణకు పిలవలేదు ఈడీ.. ఇప్పటి వరకు సోనియా గాంధీకి ఎలాంటి తాజా సమన్లు జారీ చేయలేదు.. మళ్లీ సమన్లు జారీ చేసేవరకు విచారణకు పిలవరు.. దీంతో.. ఈ కేసులో ప్రస్తుతానికి విచారణ ముగిసినట్టేనని సమాచారం.. ఇక, విచారణ ముగించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తదుపరి స్టెప్ ఎలా ఉంటుంది..? ఎలాంటి చర్లు తీసుకుంటుంది? అనేది ఆసక్తికరంగా మారింది..
ఉద్దేశ్యపూర్వకంగానే భారతీయ జనతా పార్టీ.. గాంధీ కుటుంబాన్ని టార్గెట్ చేసిందనే విమర్శలు ఉన్నాయి.. అందులో భాగంగానే ఈడీ విచారణ అని ఆరోపిస్తున్నారు.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కర్.. కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తూ.. ఇలా కక్ష్య సాధింపు చర్యలకు పూనుకుంటుందని మండిపడుతున్నారు.. ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా.. ప్రధాని మోడీ విధానాలను తప్పుబట్టినా.. కేంద్రం వారిని టార్గెట్ చేస్తుందని విపక్షాలు దుయ్యబడుతున్నాయి.. ఈ తరుణంలో నేషనల్ హెరాల్డ్ కేసు ఎలాంటి మలుపు తీసుకుంటుంది? అనేది చర్ఛగా మారింది.
తాజావార్తలు
-
SIR Survey : మాది ఏ రాష్ట్రమో తేల్చండి.. తెలంగాణలోని ఆ గ్రామాల్లో ‘సర్’ ప్రక్రియకు బ్రేక్..
-
Chanakya Niti: జీవితంలో గెలవాలంటే ‘చాణక్యుడి’ ఈ ఒక్క సూత్రం చాలు.. శత్రువులను కూడా ఈజీగా బురిడీ కొట్టించవచ్చు!
-
China-Pakistan: పాకిస్తాన్తో సంబంధాలకే చైనా ప్రాధాన్యం: జిన్పింగ్.
-
Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
-
Kishan Reddy vs Asaduddin Owaisi: అసదుద్దీన్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్.. ప్రజలను తప్పుదారి పట్టించొద్దు..!
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!