ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది… ఎల్లుండి కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవికి నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.. ఇక, ఈ నెల 24వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరించనుండగా… అక్టోబర్ 17వ తేదీన ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక జరగనుంది.. అయితే.. తాజా పరిణామాలు మాత్రం ఉత్కంఠ రేపుతున్నాయి.. ఓవైపు రాహుల్ గాంధీయే పార్టీ అధ్యక్షుడిగా ఉండాలని తీర్మానం చేస్తూ వస్తున్నాయి పలు రాష్ట్రాల పీసీసీలు.. కానీ, గాంధీయేతర కుటుంబానికి అధ్యక్ష పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది జీ…
Rahul Gandhi-Congress Party Presidential Election: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీనే పదవిని చేపట్టాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. పార్టీ సీనియర్ లీడర్ల నుంచి.. సామాన్య కార్యకర్త వరకు రాహుల్ గాంధీనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయితే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పలు రాష్ట్రాల కాంగ్రెస్ యూనిట్లు రాహుల్ గాంధీ అధ్యక్షుడు కావాలని ఏకగ్రీవం తీర్మానాలు చేస్తున్నారు. ఇప్పటికే రాజస్థాన్, చత్తీస్ ఘడ్ రాష్ట్రాలు తీర్మానాలు చేశాయి.
కాంగ్రెస్ నాయకత్వాన్ని కుదిపేసిన జీ-23లో ఒకరైన తిరువనంతపురం ఎంపీ శశి థరూర్... పార్టీలో సంస్కరణల గురించి ఇటీవల ప్రస్తావించారు. వచ్చే నెల జరగనున్న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనేందుకు శశి థరూర్ సుముఖంగా ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
AICC President Election: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు షెడ్యూల్ ఖరారు అయింది. 2019 లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో తిరిగి సోనియా గాంధీనే అధ్యక్ష బాధ్యతలను చేపట్టారు. అయితే.. ఆరోగ్య కారణాల రీత్యా సోనియా గాంధీ ఈ పదవిని సమర్థవంతంగా చేపట్టలేకపోతున్నారు. మరో వైపు రాహుల్ గాంధీ కూడా ఈ సారి అధ్యక్ష పదవిని చేపట్టేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఈ నేపథ్యంలో ఈ…
V. Hanumantha Rao Comments on congress party, gulam nabi azad: ఏఐసీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిందని.. భారతదేశంలో ఈ ఎన్నికల గురించి ఆలోచన మొదలైందని అన్నారు కాంగ్రెస్ సీనియర నేత వీ హన్మంతరావు. కొందరు గాంధీ కుటుంబం కాకుండా బయటి వారిని పెట్టాలని అంటున్నారని..మిగతా వారిని పెడితే కాంగ్రెస్ నాయకత్వం గ్రామగ్రామానికి వెళ్లడం కష్టం అని అన్నారు. రాహుల్ గాంధీ ఉంటే ఎవరికీ అభ్యంతరం లేదని..ప్రియాం
Jammu and Kashmir Congress leaders resign: కాంగ్రెస్ పార్టీకి వరసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పటికే కపిల్ సిబల్, జ్యోతిరాథిత్యా సింథియా వంటి నేతలు కాంగ్రెస్ పార్టీకి రాంరాం చెప్పి వేరే పార్టీల్లో చేరారు. ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ రాజీనామా కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాకే అని చెప్పవచ్చు. ఆజాద్…
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆ పార్టీ అధ్యక్ష పదవి రేసులో నిలవనున్నట్లు తెలుస్తోంది. ఆ పోటీలో బరిలో దిగాలని శశిథరూర్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మళయాళ దిన పత్రిక "మాతృభూమి"లో ఆయన ఇటీవలే ఓ ఆర్టికల్ రాశారు. ఇందులో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక గురించి ప్రస్తావించారు. పూర్తి పారదర్శకంగా కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నికల జరగాలని ఆయన చెప్పారు.