CM Nitish Kumar: సోనియాగాంధీతో భేటీ కానున్న నితీష్ కుమార్, లాలూ.. మహాకూటమి లక్ష్యంగా అడుగుల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nitish Kumar, Lalu Yadav To Meet Sonia Gandhi: 2024 లోకసభ ఎన్నికల కోసం పార్టీలు ఇప్పటి నుంచే రెడీ అవుతున్నాయి. బీజేపీకి గట్టిపోటీ ఇచ్చేందుకు ఈ సారి ప్రతిపక్షాల సిద్ధం అవుతున్నాయి. జాతీయ స్థాయిలో మహాకూటమి ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. బీహార్ రాష్ట్రంలో ఏర్పడిన విధంగానే జాతీయ స్థాయిలో కూడా మహాకూటమి ఏర్పాటు చేసే ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. బీహార్ రాష్ట్రంలో జేడీయూ-ఆర్జేడీ కలిసి మహకూటమిని ఏర్పాటు చేసి మరోసారి సీఎం అయ్యారు నితీష్ కుమార్. కాంగ్రెస్ తో పాటు లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీతో నితీష్ కుమార్ జేడీయూ పార్టీ అధికారాన్ని పంచుకుంటోంది.
ఇదిలా ఉంటే ఈ ఆదివారం సీఎం నితీష్ కుమార్, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ ఇద్దరూ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలవనున్నట్లు సమాచారం. ఆరేళ్ల సుదీర్ఘ విరామం తరువాత నితీష్ కుమార్, సోనియా గాంధీని కలవనున్నారు. 2015లో బీహార్ ఎన్నికల ముందు జరిగిన ఇఫ్లార్ విందులో సోనియాగాంధీని కలిశారు నితీష్.
Also Read
- Kangana Ranaut: సియా గోయల్ తల్లిదండ్రులకు కంగనా రనౌత్ మద్దతు!.. కేతన్ హ*త్య కేసు గురించి మాట్లాడుతూ..
- Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
Read Also: jeevitha rajasekhar: బీజేపీ ఎంపీ అభ్యర్థిగా జీవిత రాజశేఖర్.. ఆ నియోజకవర్గం నుంచే పోటీ
జాతీయ స్థాయిలో బీజేపీ కూటమికి చెక్ పెట్టేందుకు అన్ని రాజకీయ పక్షాలను ఏకం చేసే పనిలో ఉన్నారు నితీష్ కుమార్. బీహర్ లో బీజేపీని వదిలి ఆర్జేడీతో జట్టుకట్టి అధికారాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఈ నెల ప్రారంభంలో ఢిల్లీలో పర్యటించారు నితీష్ కుమార్. ఈ పర్యటనలో రాహుల్ గాంధీతో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, వామపక్ష నేతలను కలిశారు. వీరందరితో 2024 సాధారణ ఎన్నికలపై చర్చించారు.
మరోవైపు ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ కూడా బీజేపీ టార్గెట్ గా ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. పలు కేసుల్లో నిందితుడి ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అయితే ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్న లాలూకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వచ్చే వారంలో కిడ్నీ మార్పిడి కోసం ఆయన సింగపూర్ వెళ్లనున్నారు. ప్రస్తుతం లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్ బీహార్ ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు.
తాజావార్తలు
-
Donald Trump: భారత్ పర్యటనకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. ఎప్పుడంటే..?
-
Family Vacation: యూరప్ను తలపించేలా నేపాల్ గ్రామాలు.. తక్కువ బడ్జెట్లో ఫ్యామిలీ ట్రిప్కు బెస్ట్!
-
MP Uday Srinivas: ‘జనసేన అధికారంలోకి వస్తే కాపు సీఎం’.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు
-
TVS NTORQ 125: కొత్త కలర్స్, స్పోర్టీ గ్రాఫిక్స్తో టీవీఎస్ NTORQ 125.. యువత కోసం స్టైలిష్ అప్డేట్, ధరలు ఇవే!
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
ట్రెండింగ్
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!