బుధవారం విశాఖపట్నంలో న్యూజిలాండ్తో జరిగిన జరిగిన నాలుగో టీ20లో టీమిండియా ఆల్రౌండర్ శివమ్ దూబే శివాలెత్తాడు. 23 బంతుల్లోనే 65 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లో ఏడు సిక్సర్లు, మూడు ఫోర్లు ఉన్నాయి. న్యూజిలాండ్ స్పిన్నర్ ఇష్ సోధీ వేసిన ఓవర్లో ఏకంగా 28 రన్స్ పిండుకున్నాడు. కేవలం 15 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తిచేసి.. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో వేగవంతమైన అర్ధ సెంచరీ చేసిన మూడో భారత బ్యాట్స్మన్గా రికార్డుల్లో నిలిచాడు. ప్రస్తుతం దూబే పేరు…
అంతర్జాతీయ టీ20 క్రికెట్ అంటేనే.. పవర్ హిట్టింగ్ బ్యాటింగ్కు ప్రతీక. పొట్టి ఫార్మాట్లో బౌలర్పై బ్యాటర్ పూర్తి ఆధిపత్యం చెలాయిస్తుంటాడు. ఈ క్రమంలోనే తక్కువ బంతుల్లో అర్ధ శతకం చేస్తుంటారు. టీ20 క్రికెట్లో ఇప్పటికే చాలామంది ఫాస్టెస్ట్ ఫిఫ్టీస్ చేశారు. పలువురు భారత ప్లేయర్స్ అద్భుతమైన స్ట్రోక్ప్లేతో వేగవంతమైన అర్ధ శతకాలు సాధించి.. భారత క్రికెట్ చరిత్రలో తమ పేర్లు లిఖించుకున్నారు. 2007లో డర్బన్ వేదికగా ఇంగ్లండ్పై మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ సాధించిన అర్ధశతకం ఇప్పటికీ…
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ఒకే ఓవర్లో భారీగా పరుగులు రాబట్టడం అంటే మాములు విషయం కాదు. అద్భుత ప్రతిభకు తోడు ధైర్యం, టైమింగ్ కూడా చాలా అవసరం. టీ20 క్రికెట్లో చాలా మంది బ్యాటర్లకు ఈ ప్రతిభ ఉంది. ఆ లిస్టులో టీమిండియా బ్యాటర్లు కూడా ఉన్నారు. అందరికంటే ముందు పొట్టి ఫార్మాట్లో విధ్వంసకర బ్యాటింగ్తో ప్రపంచ క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచాడు మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్. ఈ జాబితాలో తాజాగా మరో ఆల్రౌండర్ శివమ్ దూబే…
విశాఖపట్నం ఎప్పుడూ బ్యాటింగ్కు అనుకూలించే పిచ్ కావడంతో ఇరు జట్లు భారీ స్కోర్లు సాధించాయి. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 216 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 18.4 ఓవర్లలో 165 పరుగులకే ఆలౌట్ అయ్యింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్కు ఓపెనర్లు టిమ్ సీఫెర్ట్ , డెవాన్ కాన్వే అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. సీఫెర్ట్ కేవలం…
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. రంజీ ట్రోఫీ 2025-26 తదుపరి రౌండ్ మ్యాచ్లలో తాను ఆడనని ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ)కి చెప్పాడు. డిసెంబర్ 9 నుంచి దక్షిణాఫ్రికాతో జరిగే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు సన్నద్ధం కావడంపై దృష్టి పెట్టడానికి తాను రంజీ ట్రోఫీలో ఆడానని ఎంసీఏకి తెలియజేశాడు. ఎంసీఏ కూడా సూర్యకుమార్ నిర్ణయంపై సానుకూలంగా స్పందించి.. అతడిని రంజీ ట్రోఫీ నుంచి రిలీజ్ చేసిందని ఓ జాతీయ మీడియా…
ఐదు టీ20 సిరీస్లో భాగంగా క్వీన్స్లాండ్లో ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. 48 పరుగుల తేడాతో కంగారులను చిత్తు చేసింది. భారత్ నిర్ధేశించిన 168 రన్స్ ఛేదనలో ఆసీస్ 18.2 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ మిచెల్ మార్ష్ (30) టాప్ స్కోరర్. మాథ్యూ షార్ట్ (25) మినహా మిగతా కంగారో బ్యాటర్లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 3 వికెట్స్ పడగొట్టగా.. అక్షర్ పటేల్,…
టీమిండియా ఆల్రౌండర్ శివమ్ దూబె సేవల్ని గత కెప్టెన్ల కంటే టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బాగా ఉపయోగించుకుంటున్నాడని భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. దూబెలోని బౌలర్ను సూర్య చక్కగా ఉపయోగించుకోవడం వల్లే దాయాది పాకిస్థాన్పై విజయం సాధ్యమైందని అభిప్రాయపడ్డాడు. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలు బాగా బౌలింగ్ చేస్తున్నారని వీరూ ప్రశంసించాడు. ఆసియా కప్ 2025 సూపర్ 4లో భాగంగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ అద్భుత విజయాన్ని సాధించింది.…
యూఏఈ వేదికగా ఆసియా కప్ 2025 జరుగుతోంది. బుధవారం యూఏఈతో జరిగిన మ్యాచ్లో భారత్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో భారత్ విజయంలో మూగ్గురు కీలక పాత్ర పోషించారు. అందులో ఒకడు ఆల్రౌండర్ శివమ్ దూబే. రెండు ఓవర్లు వేసిన దూబే.. 4 పరుగులు ఇచ్చి మూడు వికెట్స్ పడగొట్టాడు. 12 బంతుల్లో 10 డాట్ బాల్స్ ఉండటం విశేషం. 2024 టీ20 ప్రపంచకప్లో కీలక ఇన్నింగ్స్లు ఆడిన ఈ ఆల్రౌండర్.. ఆసియా…
టీ20 ఆసియా కప్ 2025లో భారత్ శుభారంభం చేసింది. తొలి మ్యాచ్లో యూఏఈపై భారత్ రికార్డు విజయం సాధించింది.. యూఏఈపై భారత్ 9 వికెట్ల తేడాతో గెలిచింది. ప్రత్యర్థి జట్టు యూఏఈ కేవలం 58 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. భారత్ బ్యాటర్లు కేవలం 4.3 ఓవర్లలోనే మ్యాచ్ను ముగించారు. ఇన్నింగ్స్ మొదటి బంతికి సిక్సర్ బాదిన అభిషేక్ శర్మ, ఆ తర్వాతి బంతికి ఫోర్ బాదాడు. మొదటి ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. రెండో ఓవర్లో శుభ్మన్…