Shivam Dube: నేను ఇప్పుడు స్మార్ట్ ప్లేయర్.. శివమ్ దూబే ఆసక్తికర వ్యాఖ్యలు!
- విశాఖ టీ20లో శివాలెత్తిన శివమ్ దూబే
- 23 బంతుల్లోనే 65 పరుగులు చేసిన దూబే
- 15 బంతుల్లోనే అర్ధ సెంచరీ బాదిన దూబే
- శివమ్ దూబే ఆసక్తికర వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బుధవారం విశాఖపట్నంలో న్యూజిలాండ్తో జరిగిన జరిగిన నాలుగో టీ20లో టీమిండియా ఆల్రౌండర్ శివమ్ దూబే శివాలెత్తాడు. 23 బంతుల్లోనే 65 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లో ఏడు సిక్సర్లు, మూడు ఫోర్లు ఉన్నాయి. న్యూజిలాండ్ స్పిన్నర్ ఇష్ సోధీ వేసిన ఓవర్లో ఏకంగా 28 రన్స్ పిండుకున్నాడు. కేవలం 15 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తిచేసి.. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో వేగవంతమైన అర్ధ సెంచరీ చేసిన మూడో భారత బ్యాట్స్మన్గా రికార్డుల్లో నిలిచాడు. ప్రస్తుతం దూబే పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇక మ్యాచ్ అనంతరం దూబే తన ఇన్నింగ్స్పై మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఇప్పుడు స్మార్ట్ ప్లేయర్ అని పేర్కొన్నాడు. తాను కేవలం పవర్ హిట్టింగ్తోనే కాకుండా.. మెరుగైన ఆలోచనా విధానంతో కూడా ఆడుతున్నానని స్పష్టం చేశాడు.
మ్యాచ్ అనంతరం శివమ్ దూబే మాట్లాడుతూ… ‘ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇదంతా నా కఠిన శ్రమకు దక్కిన ఫలితం. వరుసగా మ్యాచ్లు ఆడుతుండటంతో నా మైండ్సెట్ పూర్తిగా మారింది. బౌలర్ ఎలాంటి బంతులు వేస్తాడో ముందే అర్థం చేసుకోగలుగుతున్నాను. కఠిన పరిస్థితుల్లో బ్యాటింగ్ చేయడంతో నా ఆట మరింత మెరుగైంది. బౌలింగ్ కూడా నా ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ మ్యాచ్లో బౌలింగ్ చేయకపోయినా.. ఇంతకుముందు కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాకు బౌలింగ్ చేసే అవకాశాలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. బౌలింగ్ చేస్తే ఆటపై అవగాహన పెరుగుతుంది. మరింత స్మార్ట్ ప్లేయర్ అవుతారు’ అని చెప్పాడు.
Also Read
- Ollie Robinson: 100 ఏళ్ల చరిత్రలో ఏకైక బౌలర్గా ఘనత.. రాబిన్సన్ హిస్టారిక్ రికార్డ్..
- Duleep Trophy: అద్భుత ప్రదర్శన చేసిన వైభవ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ.. పలు రికార్డులు బద్దలు..
- Hardik Pandya: సుదీర్ఘ విరామానికి తెర.. హార్దిక్ పాండ్యాకు శుభవార్త..
- Duleep Trophy Final: దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ భారీ ఆధిక్యం.. 336 పరుగులకే సౌత్ జోన్ ఆలౌట్!
Also Read: Shreyas-Gambhir Controversy: శ్రేయస్ అయ్యర్-గౌతమ్ గంభీర్ మధ్య విభేదాలా?.. అంతా గౌతీ చేతుల్లోనే?
అనుభవమే తన ఆటను పూర్తిగా మార్చిందని శివమ్ దూబే అంగీకరించాడు. ‘అనుభవం కూడా నాకు ఉపయోగపడుతోంది. ఇప్పుడు నేను సరైన దిశలో నడుస్తున్నా. ప్రతి ప్లేయర్ తనను తాను అప్గ్రేడ్ చేసుకోవాలి. నేను గతంలో ఉన్నట్లు ఇప్పుడు లేను. ప్రతి మ్యాచ్లో కాస్త బెటర్గా, కొంచెం స్మార్ట్గా మారడానికి ప్రయత్నిస్తున్నా. రికార్డులపై నేను దృష్టి పెట్టలేదు. ప్రతి బంతిపై మాత్రమే ఫోకస్ పెట్టాను. 15 బంతుల్లో ఫిఫ్టీ చేయాలనే ఆలోచన నాకు లేదు. ఇష్ సోధీ ఒత్తిడిలో ఉన్నాడని అర్ధమైంది. తప్పకుండా ఓ చెత్త బంతి వేస్తాడని అనుకున్నా. అందుకు నేను సిద్ధంగా ఉన్నాను. ఆధిపత్యం చెలాయించాలని డిసైడ్ అయి అలా ఆడాను’ అని దూబే తన ఆట గురించి వివరించాడు. ఈ ఇన్నింగ్స్తో టీ20 వరల్డ్కప్ 2026 ముందు జాగ్రత్త అంటూ ప్రత్యర్థి జట్లకు దూబే సందేశం పంపించాడు.
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!