Home
Shiv Sena
Shiv Sena News
-
Maharashtra: ఉద్ధవ్ ఠాక్రేకు భారీ షాక్.. షిండే గూటికి చేరిన ఆరుగురు ఎంపీలు
మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)కి చెందిన ఆరుగురు లోక్సభ సభ్యులు సోమవారం ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో అధికారికంగా చేరారు. దీంతో ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది. -
Uddhav Thackeray: పాపం ఉద్ధవ్ ఠాక్రే.. పొలిటికల్ షాక్ నుంచి కోలుకోవడం సాధ్యమేనా?
Uddhav Thackeray: మహారాష్ట్ర రాజకీయాల్లో ‘తిరుగుబాట్లు’ కొత్త కాదు, కానీ మహావికాస్ అఘాడీ (MVA) కూటమి ఏర్పడినప్పటి నుంచి జరుగుతున్న పరిణామాలు విపక్షాల సమీకరణాలను పూర్తిగా మార్చేశాయి. గతంలో ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ తిరుగుబాట్లతో శివసేన, ఎన్సీపీలు చీలిపోగా.. తాజాగా ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (UBT)లో జరిగిన రెండో తిరుగుబాటు ఆయన రాజకీయ అస్తిత్వాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. 2024 లోక్సభ ఎన్నికల్లో ఎంతో శ్రమించి ఉద్ధవ్ 9 స్థానాలు గెలుచుకోగా, ఇప్పుడు అందులో… -
Uddhav Shiv Sena: ఉద్ధవ్పై కోపం లేదు, నిధుల కోసమే తిరుగుబాటు: రెబల్ ఎంపీ..
Uddhav Shiv Sena: ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)కి చెందిన ఆరుగురు ఎంపీలు కూడా షిండే శివసేనలో చేరడంపై స్పష్టత వచ్చింది. తిరుగుబాటు చేసిన ఉద్ధవ్ వర్గం ఎంపీలు త్వరలో ఏక్నాథ్ షిండే శివసేనలో చేరబోతున్నారు. ఈ విషయాన్ని రెబల్ ఎంపీ నాగేష్ పాటిల్ అష్టికర్ వెల్లడించారు. తన లోక్సభ నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రతిపక్ష పార్టీలో ఉండటం వల్ల నియోజకవర్గంలో డెవలప్మెంట్ పనులకు నిధుల కొరత ఏర్పడిందని,… -
Uddhav Shiv sena: ముగింపుకు ఉద్ధవ్ సేన సంక్షోభం.. మీడియా ముందుకు తిరుగుబాటు ఎంపీలు..
Uddhav Shiv sena: మహారాష్ట్ర రాజకీయాల్లో ఈ రోజు కీలకంగా మారబోతోంది. ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన శివసేన(యూబీటీ) సంక్షోభం చివరకు చేరింది. ఉద్ధవ్ పార్టీపై తిరుగుబాటు చేసిన ఆరుగురు ఎంపీలు ఆదివారం మీడియా ముందు రాబోతున్నారు. తామెందుకు తిరుగుబాటు చేశామనే వివరాలను మీడియా ముందు వెళ్లడించనున్నారు. ఠాక్రేలు తమ సిద్ధాంతాలకు విరుద్ధంగా ప్రవర్తించడంతో తాము తమ దారి చూసుకోవాల్సి వచ్చిందని ఇప్పటికే ఎంపీలు చెబుతున్నారు. తిరుగుబాటు ఎంపీలు ఆదివారం సంయుక్త విలేకరుల సమావేశం నిర్వహించి, లోక్సభ స్పీకర్… -
Uddhav Thackeray: అధికారం కోసం కాదు, సిద్ధాంతాల కోసమే పదవిని వదులుకున్నా: ఉద్ధవ్ ఠాక్రే
Uddhav Thackeray: శివసేన పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ముంబైలో నిర్వహించిన భారీ ర్యాలీలో శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) పక్ష నాయకుడు ఉద్ధవ్ ఠాక్రే ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. శివసేన (షిండే వర్గం), బీజేపీతో పాటు పార్టీని వీడిన తిరుగుబాటు ఎంపీలను లక్ష్యంగా చేసుకుని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. “నాపై వచ్చిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే, ఇప్పుడే పదవి నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నా. మీలో ఏ ఒక్క… -
60 Years of Shiv Sena: 60 ఏళ్లలో 6 ముక్కలైన శివసేన.. ఆవిరైన బాలాసాహెబ్ ఆశయాలు?
Shiv Sena 60 Years: హిందూహృదయ్ సామ్రాట్ బాల్ ఠాక్రే స్థాపించిన ‘శివసేన’ నేటితో సరిగ్గా 60 వసంతాలు పూర్తి చేసుకుని వజ్రోత్సవ వేడుకలకు చేరుకుంది. 1966 జూన్ 19న ముంబైలోని చారిత్రాత్మక శివాజీ పార్క్లో బాల్ ఠాక్రే కొబ్బరికాయ కొట్టి ఈ పార్టీని ప్రారంభించారు. నాడు కొద్దిమంది మద్దతుదారులు, వేలాది మంది ‘మరాఠీ మానుస్’ సాక్షిగా పురుడుపోసుకున్న ఈ ప్రాంతీయ మహావృక్షం.. సరిగ్గా ఆరు దశాబ్దాల తర్వాత నేడు రెండు ముక్కలుగా చీలిపోయింది. విచిత్రమేమిటంటే.. బాల్… -
Maharashtra Politics: ఉద్ధవ్ ఠాక్రే కోటలో మరోసారి చీలిక.. షిండే, లోక్సభ స్పీకర్తో భేటీకి ఎంపీలు రెడీ..
Maharashtra Politics: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో భారీ కుదుపునకు తెర లేచింది. శివసేనలో గతంలో జరిగిన చీలిక గుర్తు తెచ్చేలా, ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యుబిటి)ని లక్ష్యంగా చేసుకుని ‘ఆపరేషన్ టైగర్’ తుది అంకానికి చేరుకుంది. ఉద్ధవ్ సేనకు చెందిన 9 మంది లోక్సభ ఎంపీల్లో ఆరుగురు పార్టీ వీడి, ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే వైపు వెళ్లేందుకు సర్వం సిద్ధమైంది. దీంతో మహారాష్ట్ర రాజకీయ రణరంగం కాస్తా దేశ రాజధాని ఢిల్లీకి మారింది. గతంలో… -
Uddhav Thackeray: మరోసారి ముక్కలు కాబోతున్న శివసేన పార్టీ? కుప్పకూలుతున్న ఉద్ధవ్ సామ్రాజ్యం!
Uddhav Thackeray: మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి హీట్ ఎక్కాయి. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) మరోసారి చీలిక వైపు అడుగులు వేస్తోందా? అంటే అవుననే అంటున్నాయి అక్కడి రాజకీయ పరిణామాలు. 2022లో ఏక్నాథ్ షిండే తిరుగుబాటుతో అధికారాన్ని, పార్టీ గుర్తును కోల్పోయిన ఉద్ధవ్ ఠాక్రేకు.. ఇప్పుడు లోక్సభ ఎంపీల రూపంలో సరికొత్త గండం పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) లోపల చెలరేగిన అంతర్గత సంక్షోభం తర్వాత, మహారాష్ట్రలో ఉద్ధవ్ సేనపై… -
Eknath Shinde: మహారాష్ట్రలో షిండే మరో ఎత్తుగడ.. మళ్లీ హాట్ టాపిక్ కాబోతున్నారా?
మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే మరో ఎత్తుగడ వేస్తున్నారా? మళ్లీ ఉద్ధవ్కు ఎసరు పెట్టబోతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. -
Tejas Thackeray: మాజీ సీఎం కుమారుడికి సీరియస్..
Tejas Thackeray: మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే చిన్న కుమారుడు తేజస్ ఠాక్రే ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. దీంతో ఆయనను వారి కుటుంబ సభ్యులు రిలయన్స్ ఆసుపత్రిలో చేరారు. ప్రాథమిక పరీక్షల తర్వాత ఆయన పరిస్థితి స్థిరంగా ఉందని, మెరుగుపడుతుందని వైద్య వర్గాలు వెల్లడించాయి. అన్ని పరీక్షలు పూర్తయిన తర్వాత తేజస్ కోలుకుంటున్నట్లు సమాచారం. మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే – రష్మి ఠాక్రేలు ఆసుపత్రిలో తేజస్ తో పాటు ఉన్నారు. గత మూడు రోజులుగా…
తాజావార్తలు
ట్రెండింగ్
-
Toilet Cleaning : టాయిలెట్ క్లీనింగ్ చేస్తున్నారా..? అయితే ఈ 5 ఘోరమైన పొరపాట్లు అస్సలు చేయకండి.!
-
Cockroach Control : ఫ్రిజ్లో బొద్దింకల బెడదా.? ఈ సింపుల్ ట్రిక్తో చెక్ పెట్టండి..!
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!