Uddhav Shiv Sena: ఉద్ధవ్పై కోపం లేదు, నిధుల కోసమే తిరుగుబాటు: రెబల్ ఎంపీ..
- నిధుల కోసమే తిరుగుబాటు చేశాము..
- ఏక్నాథ్ షిండే శివసేనలో చేరుతున్నాము..
- ఒక శివసేన నుంచి మరో శివసేనలోకి వెళ్తున్నాము..
- క్లారిటీ ఇచ్చిన ఉద్ధవ్ వర్గం ఎంపీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uddhav Shiv Sena: ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)కి చెందిన ఆరుగురు ఎంపీలు కూడా షిండే శివసేనలో చేరడంపై స్పష్టత వచ్చింది. తిరుగుబాటు చేసిన ఉద్ధవ్ వర్గం ఎంపీలు త్వరలో ఏక్నాథ్ షిండే శివసేనలో చేరబోతున్నారు. ఈ విషయాన్ని రెబల్ ఎంపీ నాగేష్ పాటిల్ అష్టికర్ వెల్లడించారు. తన లోక్సభ నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రతిపక్ష పార్టీలో ఉండటం వల్ల నియోజకవర్గంలో డెవలప్మెంట్ పనులకు నిధుల కొరత ఏర్పడిందని, అందుకే అధికార కూటమి శివసేనలో చేరుతున్నట్లు నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
హింగోలి ఎంపీ అయిన అష్టికర్ మాట్లాడుతూ.. తమకు ఉద్ధవ్ ఠాక్రే అంటే కోపం లేదని, నిధుల కోసమే షిండే శివసేనలో చేరుతున్నామని చెప్పారు. తాము సిద్ధాంతం విషయంలో రాజీ పడలేదని ఒక శివసేన నుంచి మరో శివసేనలో చేరుతున్నామని వెల్లడించారు. తనతో పాటు మరొకొందరు ఎంపీలు జూన్ 18వ తేదీ వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, కానీ తమకు వ్యతిరేకంగా చేసిన కొన్ని వ్యాఖ్యల వల్లే మనసు మార్చుకున్నట్లు తెలిపారు.
Also Read
- Ashwini Vaishnaw: 320 కిమీ వేగం.. 12 స్టేషన్లు.. 508 కి.మీ కారిడార్.. బుల్లెట్ రైలుపై కేంద్ర మంత్రి కీలక అప్డేట్..
- Operation Sindoor: పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ సిగ్గుమాలిన చర్య.. భారత పార్లమెంట్ను ధ్వంసం చేశామని ఏఐ వీడియో
- Rahul Gandhi New Team: రాహుల్ గాంధీ కొత్త టీమ్ రెడీ.. 120 మంది నేతలను స్వయంగా ఇంటర్వ్యూ
- Heart Attack: షాకింగ్.. 13 ఏళ్లకే గుండెపోటు.. స్కూల్ వాష్రూమ్లో ఏడో తరగతి బాలుడి మృతి..
తమపై ఉద్ధవ్ సన్నిహితుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ అవమానకరమైన భాష ఉపయోగించారని, ఆయన మాట్లాడే భాష విషయంలో జాగ్రత్తగా ఉండాలని అన్నారు. తనను ఎన్నుకున్న ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, అభివృద్ధి విషయంలో ఎంపీల్యాడ్ రూ. 5 కోట్ల నిధులు సరిపోవడం లేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోతున్నారని, అందుకే మాకు నిధులు కావాలని అన్నారు. ఉద్ధవ్ శివసేనకు మొత్తం 9 మంది ఉంటే ఆరుగురు ఎంపీలు తిరుగుబాటు చేశారు. వీరిలో ఎంపీలు సంజయ్ దీనా పాటిల్, సంజయ్ దేశ్ముఖ్, సంజయ్ జాదవ్, భావుసాహెబ్ వాక్చౌరే, నాగేష్ పాటిల్-అష్టికర్, ఓంప్రకాష్ రాజే నింబాల్కర్ ఉన్నారు.
తాజావార్తలు
-
Reliance Bonds: డబ్బు దాచేవారికి రిలయన్స్ బంపర్ ఆఫర్.. 7.47% వడ్డీపై ఈ విషయాలు తెలుసుకోండి!
-
YouTuber Rama Nandana: ఇబ్రహీంపట్నం పీఎస్లో యూట్యూబర్ రమా నందన విచారణ..
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Ashwini Vaishnaw: 320 కిమీ వేగం.. 12 స్టేషన్లు.. 508 కి.మీ కారిడార్.. బుల్లెట్ రైలుపై కేంద్ర మంత్రి కీలక అప్డేట్..
ట్రెండింగ్
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!
-
Elon Musk: ఇక 5 – 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!