Uddhav Shiv Sena: ఉద్ధవ్పై కోపం లేదు, నిధుల కోసమే తిరుగుబాటు: రెబల్ ఎంపీ..
- నిధుల కోసమే తిరుగుబాటు చేశాము..
- ఏక్నాథ్ షిండే శివసేనలో చేరుతున్నాము..
- ఒక శివసేన నుంచి మరో శివసేనలోకి వెళ్తున్నాము..
- క్లారిటీ ఇచ్చిన ఉద్ధవ్ వర్గం ఎంపీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uddhav Shiv Sena: ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)కి చెందిన ఆరుగురు ఎంపీలు కూడా షిండే శివసేనలో చేరడంపై స్పష్టత వచ్చింది. తిరుగుబాటు చేసిన ఉద్ధవ్ వర్గం ఎంపీలు త్వరలో ఏక్నాథ్ షిండే శివసేనలో చేరబోతున్నారు. ఈ విషయాన్ని రెబల్ ఎంపీ నాగేష్ పాటిల్ అష్టికర్ వెల్లడించారు. తన లోక్సభ నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రతిపక్ష పార్టీలో ఉండటం వల్ల నియోజకవర్గంలో డెవలప్మెంట్ పనులకు నిధుల కొరత ఏర్పడిందని, అందుకే అధికార కూటమి శివసేనలో చేరుతున్నట్లు నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
హింగోలి ఎంపీ అయిన అష్టికర్ మాట్లాడుతూ.. తమకు ఉద్ధవ్ ఠాక్రే అంటే కోపం లేదని, నిధుల కోసమే షిండే శివసేనలో చేరుతున్నామని చెప్పారు. తాము సిద్ధాంతం విషయంలో రాజీ పడలేదని ఒక శివసేన నుంచి మరో శివసేనలో చేరుతున్నామని వెల్లడించారు. తనతో పాటు మరొకొందరు ఎంపీలు జూన్ 18వ తేదీ వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, కానీ తమకు వ్యతిరేకంగా చేసిన కొన్ని వ్యాఖ్యల వల్లే మనసు మార్చుకున్నట్లు తెలిపారు.
Also Read
- Maharashtra: షిండే-పవార్ భేటీ.. సుప్రియా సూలే కీలక వ్యాఖ్యలు..
- Sheikh Hasina: వారు నన్ను చంపేయవచ్చు, అయినా బంగ్లాదేశ్ వెళ్తా: షేక్ హసీనా
- Karur Stampede: కరూర్ తొక్కిసలాట కేసు.. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు.. విజయ్ ప్రభుత్వానికి హైకోర్టు అనుమతి
- Meghalaya Honeymoon Murder Case: 'నేను అమాయకురాలిని, నన్ను ఇరికించారు'.. సోనమ్ సంచలన వ్యాఖ్యలు..
తమపై ఉద్ధవ్ సన్నిహితుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ అవమానకరమైన భాష ఉపయోగించారని, ఆయన మాట్లాడే భాష విషయంలో జాగ్రత్తగా ఉండాలని అన్నారు. తనను ఎన్నుకున్న ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, అభివృద్ధి విషయంలో ఎంపీల్యాడ్ రూ. 5 కోట్ల నిధులు సరిపోవడం లేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోతున్నారని, అందుకే మాకు నిధులు కావాలని అన్నారు. ఉద్ధవ్ శివసేనకు మొత్తం 9 మంది ఉంటే ఆరుగురు ఎంపీలు తిరుగుబాటు చేశారు. వీరిలో ఎంపీలు సంజయ్ దీనా పాటిల్, సంజయ్ దేశ్ముఖ్, సంజయ్ జాదవ్, భావుసాహెబ్ వాక్చౌరే, నాగేష్ పాటిల్-అష్టికర్, ఓంప్రకాష్ రాజే నింబాల్కర్ ఉన్నారు.
తాజావార్తలు
-
China: ప్రపంచంలోనే తొలిసారి.. సముద్రంలోని వలలో రాకెట్ను దించిన చైనా!
-
Ind Vs Eng: ప్రతీ మ్యాచ్లో కొత్త హీరోలు పుట్టుకొస్తున్నారు.. టీమిండియా సభ్యుల నుంచి ఇలా..
-
Termite Prevention: వర్షాకాలం ఇంట్లో చెదలు పెరుగుతుందా.? అయితే ఇలా చెక్ పెట్టండి..
-
Lenin: లెనిన్ హిట్ టాక్.. నాగ్’ను పట్టుకుని ఏడ్చేసిన అఖిల్
-
IND vs ENG 5th T20: ‘వైట్వాష్’ ముప్పు.. దిక్కుతోచని స్థితిలో భారత్.. తొలి విజయం కోసం ఎదురుచూపులు!
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!