Uddhav Thackeray: పాపం ఉద్ధవ్ ఠాక్రే.. పొలిటికల్ షాక్ నుంచి కోలుకోవడం సాధ్యమేనా?
- మహారాష్ట్ర రాజకీయాల్లో ఠాక్రేకు కోలుకోలేని దెబ్బ
- మునిగిన శివసేన (UBT) నావ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uddhav Thackeray: మహారాష్ట్ర రాజకీయాల్లో ‘తిరుగుబాట్లు’ కొత్త కాదు, కానీ మహావికాస్ అఘాడీ (MVA) కూటమి ఏర్పడినప్పటి నుంచి జరుగుతున్న పరిణామాలు విపక్షాల సమీకరణాలను పూర్తిగా మార్చేశాయి. గతంలో ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ తిరుగుబాట్లతో శివసేన, ఎన్సీపీలు చీలిపోగా.. తాజాగా ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (UBT)లో జరిగిన రెండో తిరుగుబాటు ఆయన రాజకీయ అస్తిత్వాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. 2024 లోక్సభ ఎన్నికల్లో ఎంతో శ్రమించి ఉద్ధవ్ 9 స్థానాలు గెలుచుకోగా, ఇప్పుడు అందులో 9 మంది ఎంపీలలో 6 మంది ఉద్ధవ్ను వీడి సీఎం ఏక్నాథ్ షిండే గూటికి చేరారు. ఎంపీ నింబాల్కర్, సంజయ్ పాటిల్ వంటి కీలక నేతలను బుజ్జగించేందుకు ఉద్ధవ్ చేసిన ‘డ్యామేజ్ కంట్రోల్’ ప్రయత్నాలు ఫలించలేదు. అధికార పక్షం మద్దతు లేకుండా క్షేత్రస్థాయిలో రాజకీయ శత్రువులతో పోరాడటం కష్టమని, నియోజకవర్గాల అభివృద్ధి కోసమే షిండేతో చేతులు కలుపుతున్నామని తిరుగుబాటు నేతలు స్పష్టం చేశారు. ఈ పరిణామంతో ఉద్ధవ్ శిబిరంలో కేవలం ముగ్గురు ఎంపీలే మిగిలారు.
రాజకీయాలు ఎప్పుడూ ‘సంఖ్యా బలం’ ఆధారంగానే నడుస్తాయి. ఈ భారీ చీలిక వల్ల MVA కూటమిలో ఉద్ధవ్ ఠాక్రే బార్గేనింగ్ పవర్ గణనీయంగా పడిపోయింది. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ఇప్పుడు మహారాష్ట్రలో ‘పెద్ద అన్న’ పాత్ర పోషించేందుకు రెడీ అవుతుంది. ముంబై, కొంకణ్ వంటి శివసేన సాంప్రదాయ గిరిజగడాల్లో ఉద్ధవ్ పట్టు కోల్పోతున్నారు. అంతేకాకుండా, ఉద్ధవ్కు బీజేపీతో మళ్లీ జతకట్టే దారులు ప్రాంతీయంగా, రాజకీయంగా పూర్తిగా మూసుకుపోయాయి. కూటమిని వీడితే ఆయనకు మరో ప్రత్యామ్నాయం లేదనే విషయం కాంగ్రెస్, శరద్ పవార్లకు బాగా తెలుసు. అందువల్ల మిత్రపక్షాలు పెట్టే షరతులకు లొంగిపోవాల్సిన పరిస్థితి ఉద్ధవ్కు ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే పార్టీ పేరు (శివసేన), గుర్తు (విల్లు-అంబు) కోల్పోయి ‘మశాలం’ గుర్తుతో నిలబడిన ఉద్ధవ్కు, ఈ రెండో తిరుగుబాటు కోలుకోలేని దెబ్బ అనే అంటున్నారు. ఫండ్ మేనేజర్లు, బూత్ స్థాయి నాయకులు షిండే వైపు వెళ్లడంతో ఉద్ధవ్ రాజకీయం మళ్లీ జీరో నుంచి ప్రారంభించాల్సి వస్తోందని చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన రాజకీయ భవిష్యత్తు.. ప్రజల్లో ఉన్న ‘సహానుభూతి’ని ఎంతవరకు ‘ఓట్లు’గా మార్చుకోగలరనే ఏకైక అంశంపైనే ఆధారపడి ఉందని అభిప్రాయపడుతున్నారు.
Also Read
- India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
- Bengaluru: ప్రేమికుడిని పెళ్లాడిన 4 నెలలకే ఉపాధ్యాయురాలు ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏం రాసిందంటే..!
- Tamil Nadu: గోవధ నిషేధంపై విజయ్ సర్కార్కు సుప్రీంకోర్టులో ఊరట
- Ram Mandir CEO Vacancy: రామ మందిరం సీఈవో పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం.. అర్హతలు ఏంటి..? ఎలాంటి సౌకర్యాలు లభిస్తాయో తెలుసా?
తాజావార్తలు
-
Clash Between Punganur TDP Activits: కొట్టుకున్న పుంగనూరు తెలుగు తమ్ముళ్లు.. సమావేశం రద్దు
-
India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
-
Shruti Haasan: రమ్యకృష్ణ బ్యూటీ సీక్రెట్ రివీల్ చేసిన శృతిహాసన్.. అసలు కారణం ఇదేనట!
-
Jani Master: శేఖర్ మాస్టర్తో గొడవ? మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ.. అసలు నిజం బయటపెట్టిన జానీ మాస్టర్!
-
Raaka : డ్యూయల్ కాదు ట్రిపుల్ కాదు.. అంతకుమించి రాకా!
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!