Eknath Shinde: మహారాష్ట్రలో షిండే మరో ఎత్తుగడ.. మళ్లీ హాట్ టాపిక్ కాబోతున్నారా?
- మహారాష్ట్రలో షిండే మరో ఎత్తుగడ
- మళ్లీ హాట్ టాఫిక్ కాబోతున్నారా?
- జాతీయ మీడియాలో కథనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే మరో ఎత్తుగడ వేస్తున్నారా? మళ్లీ ఉద్ధవ్కు ఎసరు పెట్టబోతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. శివసేనకు చెందిన ఒక నేత మాట్లాడిన వ్యాఖ్యలను బట్టి జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
మహారాష్ట్రలో షిండే మరో భారీ దెబ్బ కొట్టడం ఖాయమని వార్తలు వస్తున్నాయి. దాదాపు ఏడుగురు ఉద్ధవ్ థాక్రే ఎంపీలు.. షిండే శిబిరంలో చేరవచ్చని తెలుస్తోంది. శివసేన (యూబీటీ)కి చెందిన ఏడుగురు ఎంపీలు తమతో టచ్లో ఉన్నారని.. తమతో కలిసి పని చేయాలని కోరుకుంటున్నారని.. అలాగే ఎమ్మెల్యేల్లో 16 మంది కూడా తమతో సంప్రదింపులు జరుపుతున్నారని శివసేన ఎమ్మెల్సీ కృపాల్ తుమనే తెలిపారు. ‘ఆపరేషన్ టైగర్’ కింద ఏడుగురు శివసేన (యూబీటీ) లోక్సభ ఎంపీల చర్చలు తుది దశకు చేరుకున్నాయని పేర్కొన్నారు. త్వరలోనే వారంతా షిండేతో కలవనున్నట్లు చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇండియా కూటమికి మరో ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందని స్పష్టమవుతోంది.
Also Read
శివసేన అంచనాల ప్రకారం.. రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు ఉద్ధవ్ థాక్రేకు చెందిన ఎంపీలు ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వైపు ఫిరాయించే అవకాశం ఉందని… ఒకవేళ ఈ పరిణామం కార్యరూపం దాల్చితే.. అది లోక్సభలో ఎన్డీఏ బలాన్ని మరింత పెంచుతుంది. వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యేలోపే ఈ పరిణామం చోటుచేసుకుంటుందని శివసేన ఎమ్మెల్సీ సూచించారు.
గతంలో ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వాన్ని ఏక్నాథ్ షిండే చీల్చి బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు మరోసారి ఉద్ధశ్ థాక్రే భారీ దెబ్బ కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Bajaj Chetak Sales Surge 307 Percent: రూ.35 ఛార్జింగ్తో 153 కిలో మీటర్లు..! ఏకంగా 307 శాతం పెరిగిన అమ్మకాలు
-
CM Revanth Reddy: 22-ఏ భూములపై సీఎం కీలక సమీక్ష.. 2 రోజుల్లోనే పరిష్కారం..! దళారులను ఆశ్రయించవద్దు..
-
Story Board: ఎల్నినో సూపర్ ఎల్నినోగా విరుచుకుపడుతోందా..?
-
ChatGPT for Teens: టీనేజర్లకు చాట్జీపీటీపై కఠిన ఆంక్షలు.. ఓపెన్ఏఐ కీలక నిర్ణయం.. ఇవే కొత్త ఫీచర్లు
-
CM Vijay: మహిళా ఉద్యోగులకు రక్షా బంధన్ శుభవార్త.. మూడో బిడ్డకు ఏడాది ప్రసూతి సెలవు
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!