Uddhav Thackeray: అధికారం కోసం కాదు, సిద్ధాంతాల కోసమే పదవిని వదులుకున్నా: ఉద్ధవ్ ఠాక్రే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uddhav Thackeray: శివసేన పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ముంబైలో నిర్వహించిన భారీ ర్యాలీలో శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) పక్ష నాయకుడు ఉద్ధవ్ ఠాక్రే ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. శివసేన (షిండే వర్గం), బీజేపీతో పాటు పార్టీని వీడిన తిరుగుబాటు ఎంపీలను లక్ష్యంగా చేసుకుని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. “నాపై వచ్చిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే, ఇప్పుడే పదవి నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నా. మీలో ఏ ఒక్క సామాన్య శివసైనికుడైనా వచ్చి ఈ పార్టీ బాధ్యతలు చేపట్టవచ్చు” అని శివసేన (యూబీటీ) అధినేత స్పష్టం చేశారు. శివసేన 60 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో తుఫానులను ఎదుర్కొందని, తాను ఎన్నటికీ పారిపోయే వ్యక్తిని కాదని, కార్యకర్తలకు కొండంత అండగా నిలబడతానని భరోసా ఇచ్చారు.
దొంగలు, లూటీగాళ్ల చేతుల్లోకి వెళ్లకుండా కాపాడుకుందాం..
శివసేనను దొంగలు, లూటీగాళ్ల చేతుల్లోకి వెళ్లకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఉద్ధవ్ పిలుపునిచ్చారు. “నన్ను పదవి నుంచి దించడానికి కొందరు కుట్రలు చేశారు. ఒకవేళ నాకు కేవలం ముఖ్యమంత్రి పదవే కావాలనుకుంటే, నేను అసెంబ్లీలోనే కూర్చునేవాడిని. కానీ, నా సొంత మనుషులే నాపై వేలెత్తి చూపినప్పుడు ఒక్క క్షణం కూడా ఆ పదవిలో కొనసాగకూడదని తప్పుకున్నా” అని గత రాజకీయ పరిణామాలను గుర్తు చేసుకున్నారు. ద్రోహులు, అవినీతిపరులు చేసే ఆరోపణలకు శివసైనికులే తమ ఓట్లతో సమాధానం చెప్పాలన్నారు. మహారాష్ట్రలో మోడీ హవా ఉన్నప్పటికీ, ప్రజలు తమ వైపే నిలబడ్డారని ఉద్ధవ్ ఠాక్రే కొనియాడారు. పెద్దగా ముఖ పరిచయం లేకపోయినా 9 మంది ఎంపీలను గెలిపించి శివసేన బలాన్ని నిరూపించారని ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంక్షోభ సమయంలోనూ పార్టీ నమ్ముకున్న నలుగురు ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ ఇక్కడే ఉన్నారని, శివసైనికులు ఎవరూ అధైర్యపడలేదని చెప్పారు.
Also Read
- Kargil Vijay Diwas 2026: కార్గిల్ విజయ్ దివస్.. వీర జవాన్లకు నివాళులర్పించిన ప్రధాని మోడీ..
- Abhijeet Dipke: "ఇది అంతం కాదు.. ఆరంభం".. సీజేపీ విజయంపై అభిజీత్ దిప్కే సంచలన వీడియో..
- SBI Manager Slapped: ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ ను చెంపదెబ్బ కొట్టిన మాజీ కేంద్ర మంత్రి కుమార్తె.. వీడియో
- Amit Shah: పదవి కంటే దేశం, విద్యార్థులే ముఖ్యమని మరోసారి నిరూపించాం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై అమిత్ షా స్పందన
దేశభక్తి గురించి బీజేపీ మాకు చెప్పక్కర్లేదు..
బెంగాల్లో ఒక మహిళను (మమతా బెనర్జీని) ఓడించడానికి కేంద్ర బలగాలను వాడిన బీజేపీ.. మణిపూర్ ఘర్షణలను అణచడానికి ఎందుకు సైన్యాన్ని పంపడం లేదని ఉద్ధవ్ ప్రశ్నించారు. “గడిచిన 12 ఏళ్లలో పీఓకే (పాక్ ఆక్రమిత కాశ్మీర్) లోకి సైన్యాన్ని ఎందుకు పంపలేదు? ఒకవేళ దేశహితం కోసం సైన్యాన్ని పంపితే మేము కచ్చితంగా మద్దతు ఇస్తాం. మేమేమీ పాకిస్థానీలము కాదు. మాకు ఈ దేశంలో గొప్ప చరిత్ర ఉంది. మేం ఎక్కడి నుంచో వలస వచ్చిన వాళ్లం కాదు.. ఇక్కడే పుట్టినవాళ్లం. బీజేపీ నేతల కంటే మాకే దేశభక్తి ఎక్కువ” అని మండిపడ్డారు. బీజేపీలోని నేతలంతా ఇతర పార్టీల నుంచి వచ్చినవారేనని ఎద్దేవా చేసిన ఉద్ధవ్.. శివసేన కాంగ్రెస్లో విలీనమవుతుందన్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. ఇన్నేళ్లు బీజేపీతో కలిసి ఉన్నప్పుడే శివసేన అందులో విలీనం కాలేదని, ఇప్పుడు వేరే పార్టీలో ఎలా కలుస్తుందని ప్రశ్నించారు. ‘మాతోశ్రీ’ (ఠాక్రే నివాసం) పై, తమ కుటుంబంపై దాడులు జరిగినప్పుడు శివసైనికులు పడిన కష్టాలు, త్యాగాలు ఏంటో తమను చూసి ఈర్ష్యపడే ప్రత్యర్థులకు తెలియదని ఉద్ధవ్ ఠాక్రే ఆవేదన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Vivo V40e 5G: స్టైలిష్ డిజైన్, 50MP సోనీ కెమెరా, 80W ఫాస్ట్ ఛార్జింగ్తో.. వివో V40e 5G ప్రీమియం స్మార్ట్ఫోన్
-
OTT Trending Movie: టాప్ ట్రెండింగ్ లో100 కోట్ల సినిమా.. ఓటీటీలో ఇరగదీస్తున్న యాక్షన్ కామెడీ..
-
Peddi Sudarshan Reddy: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు..
-
Ishan Kishan: నేను అస్సలు టెన్షన్ పడలేదు.. ఎక్కడ తగ్గాలో నాకు తెలుసు!
-
Kargil Vijay Diwas 2026: కార్గిల్ విజయ్ దివస్.. వీర జవాన్లకు నివాళులర్పించిన ప్రధాని మోడీ..
ట్రెండింగ్
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!