Uddhav Thackeray: అధికారం కోసం కాదు, సిద్ధాంతాల కోసమే పదవిని వదులుకున్నా: ఉద్ధవ్ ఠాక్రే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uddhav Thackeray: శివసేన పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ముంబైలో నిర్వహించిన భారీ ర్యాలీలో శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) పక్ష నాయకుడు ఉద్ధవ్ ఠాక్రే ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. శివసేన (షిండే వర్గం), బీజేపీతో పాటు పార్టీని వీడిన తిరుగుబాటు ఎంపీలను లక్ష్యంగా చేసుకుని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. “నాపై వచ్చిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే, ఇప్పుడే పదవి నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నా. మీలో ఏ ఒక్క సామాన్య శివసైనికుడైనా వచ్చి ఈ పార్టీ బాధ్యతలు చేపట్టవచ్చు” అని శివసేన (యూబీటీ) అధినేత స్పష్టం చేశారు. శివసేన 60 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో తుఫానులను ఎదుర్కొందని, తాను ఎన్నటికీ పారిపోయే వ్యక్తిని కాదని, కార్యకర్తలకు కొండంత అండగా నిలబడతానని భరోసా ఇచ్చారు.
దొంగలు, లూటీగాళ్ల చేతుల్లోకి వెళ్లకుండా కాపాడుకుందాం..
శివసేనను దొంగలు, లూటీగాళ్ల చేతుల్లోకి వెళ్లకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఉద్ధవ్ పిలుపునిచ్చారు. “నన్ను పదవి నుంచి దించడానికి కొందరు కుట్రలు చేశారు. ఒకవేళ నాకు కేవలం ముఖ్యమంత్రి పదవే కావాలనుకుంటే, నేను అసెంబ్లీలోనే కూర్చునేవాడిని. కానీ, నా సొంత మనుషులే నాపై వేలెత్తి చూపినప్పుడు ఒక్క క్షణం కూడా ఆ పదవిలో కొనసాగకూడదని తప్పుకున్నా” అని గత రాజకీయ పరిణామాలను గుర్తు చేసుకున్నారు. ద్రోహులు, అవినీతిపరులు చేసే ఆరోపణలకు శివసైనికులే తమ ఓట్లతో సమాధానం చెప్పాలన్నారు. మహారాష్ట్రలో మోడీ హవా ఉన్నప్పటికీ, ప్రజలు తమ వైపే నిలబడ్డారని ఉద్ధవ్ ఠాక్రే కొనియాడారు. పెద్దగా ముఖ పరిచయం లేకపోయినా 9 మంది ఎంపీలను గెలిపించి శివసేన బలాన్ని నిరూపించారని ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంక్షోభ సమయంలోనూ పార్టీ నమ్ముకున్న నలుగురు ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ ఇక్కడే ఉన్నారని, శివసైనికులు ఎవరూ అధైర్యపడలేదని చెప్పారు.
Also Read
- Wedding Fight: మటన్ పెడతామని ఒప్పుకొని.. చికెన్ పెడతారా?.. పెళ్లి విందులో పొట్టు పొట్టు తన్నుకున్న వైనం
- LPG Connection Transfer Rules: ఎల్పీజీ వినియోగదారులకు అలర్ట్.. ఈ 5 రూల్స్ పాటించకపోతే కనెక్షన్ కట్..!
- PM Modi: 2030 నాటికి వాణిజ్యం రెట్టింపు లక్ష్యం.. మోడీ పర్యటనలో భారత్-న్యూజిలాండ్ కీలక నిర్ణయాలు
- Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
దేశభక్తి గురించి బీజేపీ మాకు చెప్పక్కర్లేదు..
బెంగాల్లో ఒక మహిళను (మమతా బెనర్జీని) ఓడించడానికి కేంద్ర బలగాలను వాడిన బీజేపీ.. మణిపూర్ ఘర్షణలను అణచడానికి ఎందుకు సైన్యాన్ని పంపడం లేదని ఉద్ధవ్ ప్రశ్నించారు. “గడిచిన 12 ఏళ్లలో పీఓకే (పాక్ ఆక్రమిత కాశ్మీర్) లోకి సైన్యాన్ని ఎందుకు పంపలేదు? ఒకవేళ దేశహితం కోసం సైన్యాన్ని పంపితే మేము కచ్చితంగా మద్దతు ఇస్తాం. మేమేమీ పాకిస్థానీలము కాదు. మాకు ఈ దేశంలో గొప్ప చరిత్ర ఉంది. మేం ఎక్కడి నుంచో వలస వచ్చిన వాళ్లం కాదు.. ఇక్కడే పుట్టినవాళ్లం. బీజేపీ నేతల కంటే మాకే దేశభక్తి ఎక్కువ” అని మండిపడ్డారు. బీజేపీలోని నేతలంతా ఇతర పార్టీల నుంచి వచ్చినవారేనని ఎద్దేవా చేసిన ఉద్ధవ్.. శివసేన కాంగ్రెస్లో విలీనమవుతుందన్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. ఇన్నేళ్లు బీజేపీతో కలిసి ఉన్నప్పుడే శివసేన అందులో విలీనం కాలేదని, ఇప్పుడు వేరే పార్టీలో ఎలా కలుస్తుందని ప్రశ్నించారు. ‘మాతోశ్రీ’ (ఠాక్రే నివాసం) పై, తమ కుటుంబంపై దాడులు జరిగినప్పుడు శివసైనికులు పడిన కష్టాలు, త్యాగాలు ఏంటో తమను చూసి ఈర్ష్యపడే ప్రత్యర్థులకు తెలియదని ఉద్ధవ్ ఠాక్రే ఆవేదన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
VIDA VX2 Plus: 187KM రేంజ్తో హీరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫాస్ట్ ఛార్జింగ్, రిమూవబుల్ బ్యాటరీ
-
Vinayakan: చిన్నారి ఫోటో పోస్ట్ వివాదం.. ‘జైలర్’ విలన్ వినాయకన్పై మరో కేసు
-
BCCI: టీమ్ ఇండియా కోచింగ్ టీమ్లో మార్పులు..! గంభీర్ సహాయకుల్లో ఇద్దరిని తొలగిస్తారా..?
-
Virat Kohli: లండన్లో ఆ ప్లేయర్తో విరాట్ సీక్రెట్ మీటింగ్.. రెండు గంటల్లోనే వైరల్ ఫొటోలు చూసి కోహ్లీ షాక్!
-
Wedding Fight: మటన్ పెడతామని ఒప్పుకొని.. చికెన్ పెడతారా?.. పెళ్లి విందులో పొట్టు పొట్టు తన్నుకున్న వైనం
ట్రెండింగ్
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!