కామారెడ్డి జిల్లా మళ్లీ వేడక్కనుంది. ఇవాళ మాస్టర్ ప్లాన్ బాధిత రైతుల అత్యవసర సమావేశం నిర్వహించనుంది. పాత రాజం పేట పోచమ్మ ఆలయం వద్ద విలీన గ్రామల రైతులు సమావేశం కానున్నారు.
రాజ్ భవన్ లో సంక్రాంతి సంబరాలు మిన్నంటాయి. ఈకార్యక్రమంలో.. తెలంగాణ గవర్నర్ తమిళ సై పాల్గొ్న్నారు. పొయ్యి మీద పొంగల్ వెలిగించి వేడుకలు జరుపుకున్నారు. గవర్నర్ తో పాటు రాజ్ భవన్ సిబ్బంది పాల్గొన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు ప్రజలు ఆనందంగా జరుపుకుంటున్నారు. ఇవాళ ఇంటింటా బోగి మంటలు వేసి కొత్తపనులకు శ్రీకారం చుడుతున్నారు. అయితే భోగి రోజు కామారెడ్డిలో రైతన్నలు భగ్గు మన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. తెలుగు లోగిళ్లలో కొత్త సందడి నెలకొంది. గ్రామాలన్నీ పండుగ సందడితో కళకళలాడుతున్నాయి. పల్లె, పట్నం అనే తేడా లేకుండా తెలుగు రాష్ట్రాల్లో బోగి మంటలు మండుతున్నాయి.
నిత్యం రాజకీయాలతో బిజీగా ఉండే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యువతతో క్రికెట్ ఆడారు. కరీంనగర్ లో జరిగిన పోటీల్లో బ్యాట్ పట్టుకుని పార్టీ శ్రేణుల్లో ఆనందాన్ని నింపారు. మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని, బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు.
Goshala at CM YS Jagan House: తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసం దగ్గర ప్రత్యేక గోశాలను ఏర్పాటు చేశారు. హైందవ సంస్కృతితో గో పూజకు ప్రత్యేక స్థానం ఉండగా.. సీఎం నివాసంలో ప్రత్యేకంగా గోశాల ఏర్పాటు అయ్యింది.. తెలుగుతనం ఉట్టిపడే డిజైన్లతో ఈ గోశాలను రూపకల్పన చేశారు.. గోవులు, గో పూజ అంటే ప్రత్యేక ఆసక్తి చూపించే ముఖ్యమంత్రి దంపతులు వైఎస్ జగన్, వైఎస్ భారతి.. రేపు గోపూజలు పాల్గొనబోతున్నారు.. ముఖ్యమంత్రి జగన్…
చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అయి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో సమయం వృథా చేసుకోవద్దని ఆర్టీసీ ఎండీ సజ్జానార్ సలహా ఇచ్చారు.
సంకాంత్రి అంటేనే కోళ్ల పందాలకు ఫేమస్.. ఎంతో హుషారుగా యువతతో పాటు స్థానిక ప్రముఖులు ఈ పందేలలో పాల్గొంటుంటారు. అయితే సంక్రాంతి అంటే ఆంధ్రాలో కోళ్లు ప్రత్యేక స్థానం ఉంది. ఆంధ్రాలో జరిగే పందెంలో పాల్గొనే కోళ్లు నల్లగొండ జిల్లా చండూరు మండలం ఉడుతలపల్లి గ్రామం నుంచే వెళ్తాయనే సంగతి మీకు తెలుసా? ఈవిషయం కొంత మందికి మాత్రమే తెలుసు.
తనకు సెక్యూరిటీ అవసరం లేదని తను ఉగ్రవాదిని కాదు కబ్జాలు చేయలేదని మాజీ ఎం.పీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భద్రాద్రి పినపాక నియోజకవర్గ ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గంగిరెద్దుల అడించే వారిలా సంక్రాంతి కి రాలేదని అన్నారు.
Chinese Manja : గాలిపటాలు ఎగురవేసేటప్పుడు చైనా మాంజా అస్సలు ఉపయోగించొద్దంటూ పదపదే ప్రభుత్వ అధికారులు సూచిస్తుంటారు. అంతేకాకుండా చైనా మాంజా విక్రయాలపై ప్రభుత్వం నిషేధం కూడా విధించింది.