ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు కోర్టుల్లో వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సతమతం అవుతున్న ఆ నేతలకు తాజాగా ప్రధాని మోడీ డిగ్రీ సర్టిఫికెట్ వ్యవహారంలో కూడా న్యాయస్థానంలో చుక్కెదురైంది. ప్రధాని మోడీ విద్యార్హతపై చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం దావా కేసులో ఆప్ నేత సంజయ్ సింగ్కు జారీ చేసిన సమన్లను రద్దు చేసేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీకి మరోసారి భారీ షాక్ తగలినట్టైంది.…
Sanjay Singh : సుప్రీంకోర్టు నుండి బెయిల్ పొందిన సంజయ్ సింగ్ ఇప్పుడు ట్రయల్ కోర్టు నుండి కూడా బెయిల్ పొందారు. రూ.2 లక్షల బెయిల్ బాండ్.. అదే మొత్తానికి వ్యక్తిగత పూచీకత్తుపై సంజయ్ సింగ్ను విడుదల చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్కు బెయిల్ లభించింది. సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఆయనకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఆదివారం నాగు జరిగిన ఇండియా కూటమి ర్యాలీలో అరెస్టయిన అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్, సంజయ్ సింగ్, సత్యేందర్ జైన్ భార్యలు పాల్గొన్నారు.
WFI: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) కొత్త పాలక వర్గాన్ని క్రీడా మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేసింది. డబ్ల్యూఎఫ్ఐ బాడీ ఇప్పటి వరకు ఉన్న నిబంధనలను, నియమాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసినట్లు మంత్రిత్వ శాఖ గుర్తించిందని ఆదివారం ప్రకటించింది. జాతీయ పోటీలకు సంబంధించి చేసిన ప్రకటన తొందరపాటుతో కూడుకున్నదని, సరైన ప్రక్రియను పాటించలేదని క్రీడా మంత్రిత్వ శాఖ అధికార ప్రకటనలో తెలిపింది.
Sports Ministry Suspends New Wrestling Body: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) కొత్త ప్యానెల్పై వేటు పడింది. క్రీడా మంత్రిత్వ శాఖ విధివిధానాలను అతిక్రమించిన కారణంగా డబ్ల్యూఎఫ్ఐను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేసింది. సంజయ్ సింగ్ నేతృత్వంలోని కొత్తగా ఎన్నికైన డబ్ల్యూఎఫ్ఐ బాడీపై తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ సస్పెన్షన్ అమల్లో ఉంటుందని క్రీడా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇటీవలే భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. భారత…
WFI: మహిళా రెజ్లర్లపై, మైనర్లపై లైంగిక దాడి చేశాడని మాజీ రెజ్లింగ్ ఫెడరేషర్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కి వ్యతిరేకంగా పలువురు రెజ్లర్లు పెద్ద ఉద్యమమే చేశారు. అతడిని ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో రెజ్లింగ్ ఫెడరేషన్ తాజా ఎన్నికల్లో డబ్ల్యూఎఫ్ఐ చీఫ్గా బ్రిజ్ శరణ్ సింగ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ విజయం సాధించారు.
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టైన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎంపీ సంజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ని ఈ కేసులో ఇరికించేందుకు పెద్ద కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడమే కాకుండా..ఆయనకు వ్యతిరేకంగా పెద్ద కుట్రకు ప్లాన్ చేస్తున్నట్లు పరోక్షంగా కేంద్రంలోని బీజేపీపై ఆరోపణలు గుప్పించారు. ప్రతిపక్ష నాయకులను ఇరికించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.