INDIA Block: జైల్లో భర్తలు.. ర్యాలీలో భార్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lok Sabha elections 2024: ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఆదివారం నాగు జరిగిన ఇండియా కూటమి ర్యాలీలో అరెస్టయిన అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్, సంజయ్ సింగ్, సత్యేందర్ జైన్ భార్యలు పాల్గొన్నారు. అయితే మనీష్ సిసోడియా భార్య ఆరోగ్యం కారణంగా ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఇక, ఈ సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కోసం ఇండియా కూటమి రెండు కుర్చీలను ఖాళీగా ఉంచింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, టీఎంసీ నేత మమతా బెనర్జీ, ఉద్దవ్ ఠాక్రేతో పాటు పలు పార్టీల అధ్యక్షులు పాల్గొన్నారు. అయితే, సోనియా గాంధీ పక్కనే కల్పనా సోరెన్, సునీతా కేజ్రీవాల్ ఉండేలా భారత కూటమి చూసుకుంది.
Read Also: Hyderabad to Ayodhya: హైదరాబాద్ టూ అయోధ్యకు ఫ్లైట్.. ఎప్పటి నుంచి అంటే..
Also Read
- రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
- Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
- Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ "పెసర గారెలు" చేసేయండి ఇలా.!
- Sitanshu Kotak: "వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం".. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్పై కోచ్ సంచలన ప్రకటన..
ఈ సందర్భంగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్ను మార్చి 21న ఈడీ అధికారులు అరెస్టు చేశారు. కేజ్రీవాల్ అరెస్ట్ పై సునీతా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ నా భర్తను జైలులో పెట్టారు.. అతను చేసింది సరైనదేనా? కేజ్రీవాల్ నిజమైన దేశభక్తుడు అని మీరు నమ్ముతున్నారా? అని ఆమె ప్రశ్నించారు. ఈ సందర్భంగా రాబోయే లోక్సభ ఎన్నికల కోసం ఇండియా కూటమి తరపున కేజ్రీవాల్ చేసిన ఆరు వాగ్దానాలను సునీత కేజ్రీవాల్ చదివి వినిపించారు.
Read Also: Telangana: దంచికొడుతున్న ఎండలు.. 43 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
మరోవైపు, జార్ఖండ్లో భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మాజీ సీఎం హేమంత్ సోరెన్ను జనవరి 31న అరెస్టు చేశారు. ఈ అరెస్టుపై కల్పనా సోరెన్ మాట్లాడుతూ.. రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన హామీలను ఎన్డీయే ప్రభుత్వం నాశనం చేసిందని ఆరోపించారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, మత సామరస్య వ్యాప్తి లాంటి సమస్యలను కూడా తన ప్రసంగంలో కల్పన సోరెన్ ప్రస్తావించారు. మరోవైపు, అలాగే, జైలులో ఉన్న ఆప్ నేతలు సత్యేందర్ జైన్ భార్య పూనమ్ జైన్, సంజయ్ సింగ్ భార్య అనితా సింగ్ సైతం బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష పార్టీలను కావాలనే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ టార్గెట్ చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వ విచారణ సంస్థలతో విపక్ష పార్టీల నాయకులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని జైల్లో ఉన్న ఆప్ నేతల భార్యలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
NRI: అంతిమ శ్వాస భారత్లోనే… అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
-
Income Tax Notice: మీ బ్యాంకు ఖాతాలో ఇంత మొత్తం డబ్బు ఉందా? ఇన్ కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే ఛాన్స్!
-
Vaibhav Sooryavanshi Debut: ఇతరులకు అన్యాయం చేయలేమంటున్న టీమిండియా.. వైభవ్ అరంగేట్రం కష్టమే!
ట్రెండింగ్
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!