Supreme Court: ప్రధాని మోడీ డిగ్రీ కేసులో ఆప్ నేత సంజయ్సింగ్కు భారీ షాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు కోర్టుల్లో వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సతమతం అవుతున్న ఆ నేతలకు తాజాగా ప్రధాని మోడీ డిగ్రీ సర్టిఫికెట్ వ్యవహారంలో కూడా న్యాయస్థానంలో చుక్కెదురైంది. ప్రధాని మోడీ విద్యార్హతపై చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం దావా కేసులో ఆప్ నేత సంజయ్ సింగ్కు జారీ చేసిన సమన్లను రద్దు చేసేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీకి మరోసారి భారీ షాక్ తగలినట్టైంది.
ఇది కూడా చదవండి: Chandrababu: ప్రజలంతా ఏకమై రాజకీయాల నుంచి ఈ రౌడీలను తరిమి కొట్టాలి..
Also Read
- Broken Cups Reuse Idea: విరిగిన కప్పులే మీ ఇంటి అందాన్ని పెంచుతాయి.. ఈ ట్రిక్స్ తెలుసా?
- SS Rajamouli: "ఆ అభిమాని ఆఖరి కోరిక తీరింది".. కెమెరా ముందే కన్నీళ్లు పెట్టుకున్న రాజమౌళి..
- 55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
- Donald Trump: భారత్ పర్యటనకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. ఎప్పుడంటే..?
మోడీ విద్యార్హతలపై ఆప్ నేత సంజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై గుజరాత్ యూనివర్సిటీ పరువు నష్టం కేసు దాఖలు చేసింది. దీంతో సంజయ్సింగ్కు అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సమన్లు జారీ చేసింది. దీంతో తనపై చర్యలు తీసుకోకుండా మెట్రోపాలిటన్ ఇచ్చిన సమన్లపై స్టే ఇవ్వాల్సిందిగా గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. కానీ ఇక్కడ కూడా నిరాశ ఎదురైంది. ఈ కేసులో చర్యలు తీసుకోకుండా స్టే ఇచ్చేందుకు గుజరాత్ హైకోర్టు నిరాకరించింది. తాజాగా హైకోర్టు తీర్పుపై జోక్యం చేసుకోవాలంటూ సంజయ్సింగ్.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సోమవారం విచారించిన ధర్మాసనం.. హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. సమన్లను రద్దు చేయాలని సంజయ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ను న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. హైకోర్టు నిర్ణయాన్నే సుప్రీంకోర్టు సమర్థించింది. దీంతో సంజయ్సింగ్కు గట్టి షాక్ తగలినట్టైంది.
ఇది కూడా చదవండి: Kakarla Suresh: వ్యవసాయాన్ని పండగ చేస్తా- రైతన్నకు వెన్నుగా నిలుస్తా..!
ఈ పరువు నష్టం కేసులో సంజయ్సింగ్తో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పేరు కూడా ఉంది. గుజరాత్ యూనివర్సిటీ ఆప్ నేతలపై పరువు నష్టం కేసు దాఖలు చేయడానికి ముందు… సమాచార హక్కు చట్టం కింద ప్రధాని కార్యాలయం మోడీ డిగ్రీ సర్టిఫికేట్లను అందించాల్సిన అవసరం లేదని గుజరాత్ హైకోర్టు తీర్పు చెప్పింది. అనంతరం కేజ్రీవాల్, సంజయ్ సింగ్లపై గుజరాత్ యూనివర్సిటీ పరువునష్టం దావా వేసింది. ఇక ఈ కేసులో అరవింద్ కేజ్రీవాల్, సంజయ్ సింగ్లకు గతేడాది ఏప్రిల్లో సమన్లు అందాయి. ఫిబ్రవరి 26న, వీరిద్దరికి జారీ చేసిన సమన్లను రద్దు చేసేందుకు గుజరాత్ హైకోర్టు నిరాకరించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును సంజయ్సింగ్ ఆశ్రయించారు. తాజాగా అత్యున్నత న్యాయస్థానం పిటిషన్ కొట్టేయడంతో ఆప్కు భారీ షాక్ తగిలింది.
ఇది కూడా చదవండి: AP Weather: ఏపీలో రాబోయే మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం..
తాజావార్తలు
-
Ram Charan : RC 17.. ఓ చిన్న కన్ఫ్యూజన్
-
Broken Cups Reuse Idea: విరిగిన కప్పులే మీ ఇంటి అందాన్ని పెంచుతాయి.. ఈ ట్రిక్స్ తెలుసా?
-
SS Rajamouli: “ఆ అభిమాని ఆఖరి కోరిక తీరింది”.. కెమెరా ముందే కన్నీళ్లు పెట్టుకున్న రాజమౌళి..
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Donald Trump: భారత్ పర్యటనకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. ఎప్పుడంటే..?
ట్రెండింగ్
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!