Arvind Kejriwal: కేజ్రీవాల్ విషయంలో ఏదో పెద్ద కుట్ర జరుగుతోంది.. ఆప్ ఎంపీ ఆరోపణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టైన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎంపీ సంజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ని ఈ కేసులో ఇరికించేందుకు పెద్ద కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడమే కాకుండా..ఆయనకు వ్యతిరేకంగా పెద్ద కుట్రకు ప్లాన్ చేస్తున్నట్లు పరోక్షంగా కేంద్రంలోని బీజేపీపై ఆరోపణలు గుప్పించారు. ప్రతిపక్ష నాయకులను ఇరికించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.
ఆప్ ఎంపీగా ఉన్న సంజయ్ సింగ్ని ఢిల్లీ లిక్కర్ కేసులో అక్టోబర్ 4న మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో జైలుకు వెళ్లిన మూడో వ్యక్తి సంజయ్ సింగ్. అంతకుముందు ఢిల్లీ మంత్రిగా ఉన్న సత్యేంద్ర జైన్, ఆ తరువాత ఉపముఖ్యమంత్రిగా ఉన్న మనీష్ సిసోడియాలను ఈడీ అరెస్ట్ చేసింది. ఇప్పుడు వారు మాజీలుగా ఉన్నారు. మరోవైపు సంజయ్ సింగ్ జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు నవంబర్ 24 వరకు పొడగించింది. పార్లమెంట్ సభ్యుడిగా అభివృద్ధి పనులకు సంబంధించిన కొన్ని పత్రాలపై సంతకాలు చేసేందుకు న్యాయమూర్తి అనుమతించారు.
Also Read
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
Read Also: BY Vijayendra Yediyurappa: కర్ణాటక బీజేపీ కొత్త చీఫ్గా యడియూరప్ప కుమారుడు..
ఇటీవల ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కి ఈడీ సమన్లు పంపింది. అయితే ఇది రాజకీయ ప్రేరేపిత కుట్రగా కేజ్రీవాల్ విమర్శించారు. అయితే ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ఈ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నిలక ముందు బీజేపీ విపక్షాల నేతల్ని ఏదో కేసులో ఇరికించి అరెస్ట్ చేయాలని భావిస్తోందని ఆరోపించారు. మరోవైపు ఈడీ ఈ కేసులో కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తే ఆయన రాజీనామా చేయాలా..? లేక ప్రభుత్వాన్ని కొనసాగించాలా..? అనే దానిపై ఢిల్లీ, దేశంలోని ఇతర ప్రాంతాల్లో రిఫరెండం నిర్వహిస్తామని ఆప్ నాయకులు చెబుతున్నారు. అయితే రెఫరెండానికి ఎలాంటి తేదీని ఖరారు చేయలేదు. ఈ కేసులో ఈడీతో పాటు సీబీఐ కూడా విచారిస్తోంది.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!