WFI: రెజ్లింగ్ ఫెడరేషన్ కొత్త పాలక వర్గం సస్పెండ్.. సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WFI: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) కొత్త పాలక వర్గాన్ని క్రీడా మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేసింది. డబ్ల్యూఎఫ్ఐ బాడీ ఇప్పటి వరకు ఉన్న నిబంధనలను, నియమాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసినట్లు మంత్రిత్వ శాఖ గుర్తించిందని ఆదివారం ప్రకటించింది. జాతీయ పోటీలకు సంబంధించి చేసిన ప్రకటన తొందరపాటుతో కూడుకున్నదని, సరైన ప్రక్రియను పాటించలేదని క్రీడా మంత్రిత్వ శాఖ అధికార ప్రకటనలో తెలిపింది.
డబ్ల్యూఎఫ్ఐ కొత్త చీఫ్ గా ఇటీవల సంజయ్ సింగ్ ఎన్నికయ్యారు. గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన, లైంగిక ఆరోపణ ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కి సంజయ్ సింగ్ అత్యంత సన్నిహితుడు. కొత్తగా ఎన్నికైన డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ సంజయ్ సింగ్ డిసెంబర్ 21న జూనియర్ జాతీయ పోటీలు ఈ ఏడాది చివరిలోపు ప్రారంభమవుతాయని ప్రకటించారు. ఇది నిబంధనలకు విరుద్ధమని, రెజ్లర్ల సిద్ధం కావాలంటే కనీసం 15 రోజుల నోటీస్ అవసరమని మంత్రిత్వశాఖ పేర్కొంది.
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
Read Also: Ugramm: ఉగ్రమ్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్న కన్నడ సినీ అభిమానులు… ప్రభాస్ కటౌట్ కథకి సరిపోలేదట
‘‘అటువంటి నిర్ణయాలను కార్యనిర్వాహఖ కమిటీ తీసుకోవాల్సి ఉంటుంది, దీనికి ముందు అజెండాను పరిశీలనలో ఉంచాలి. డబ్ల్యూఎఫ్ఐ రాజ్యాంలోని ఆర్టికల్ 11 ప్రకారం.. ‘నోటీసులు, సమావేశాల కోరం’ కోసం 15 రోజుల ముందు తెలియజేయాలని, 1/3 మంది ప్రతినిధులు హాజరు కావాలి. అత్యవసర సమావేశానికి కూడా 7రోజుల వ్యవధితో నోటీసులు, 1/3 వంతు ప్రతినిధుల కోసం అవసరం’’ అని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
అయితే ఈ వ్యవహారంపై సంజయ్ సింగ్ చట్టపరమైన పోరాటానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ సస్పెన్షన్ వ్యవహారాన్ని కోర్టులో సవాల్ చేయనున్నారు. ఇదే కాకుండా కేంద్ర మంత్రిత్వ శాఖ సంచలన ఆరోపణలు చేసింది. లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న పాత పాలక వర్గం చేతిలో కొత్తగా ఎన్నికైన బాడీ ఉన్నట్లు తెలుస్తోందని చెప్పింది.
డబ్ల్యూఎఫ్ఐ వ్యవహారం వివాదాలకు కారణమవుతోంది. గతంలో మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఆయన సన్నిహితుడే మరోసారి అధ్యక్షుడు కావడాన్ని రెజ్లర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే రెజ్లర్ సాక్షి మాలిక్ రెజ్లింగ్కి గుడ్ బై చెప్పారు. బజరంగ్ పూనియాతో పాటు వీరేందర్ సింగ్ వంటి రెజ్లర్లు పద్మశ్రీని వాపస్ ఇస్తున్నట్లు ప్రకటించారు.
తాజావార్తలు
-
IND Vs IRE: టీమిండియాకు షాక్.. కొంపముంచనున్న వర్షం.. ఐర్లాండ్దే సిరీస్..
-
NTR – Trivikram Movie: రేపే ఎన్టీఆర్-త్రివిక్రమ్ ‘God Of War’ అనౌన్స్మెంట్!
-
Garuda Puran: చనిపోయిన వారి బట్టలు ఇంట్లో ఉంచుతున్నారా? గరుడ పురాణంలో చెప్పిన భయంకరమైన నిజాలు ఇవే!
-
Komatireddy Venkat Reddy : రేవంత్పై కోమటిరెడ్డి ప్రశంసలు.. నల్లగొండలో 12 సీట్లు మావే.!
-
Womens T20 World Cup: ముగిసిన టీమిండియా బ్యాటింగ్.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!