ఇటీవల సల్మాన్ ఖాన్కు తనతో పాటు తండ్రి సమీర్ ఖాన్ను చంపేస్తామంటూ ఓ బెదిరింపు లేఖ వచ్చిన విషయం తెలిసిందే! ప్రస్తుతం జైలుశిక్ష అనుభవిస్తున్న లారెన్స్ బిష్ణోయ్ వర్గానికి చెందిన వారే ఆ లేఖ పంపినట్టు పోలీసు విచారణలో తేలడంతో.. అతడ్ని కూడా ప్రశ్నిస్తున్నారు. తొలుత ఆ బెదిరింపు లేఖతో తనకెలాంటి సంబంధం లేదని చెప్పిన బిష్ణోయ్.. తాజా విచారణలో మాత్రం తమ వర్గం ఎప్పటికీ సల్మాన్ని క్షమించదని బాంబ్ పేల్చాడు. ‘‘కృష్ణ జింత హత్య విషయంలో…
మెగాస్టార్ చిరంజీవి వరుసగా లైన్లో పెట్టిన క్రేజీ ప్రాజెక్టుల్లో ‘గాడ్ఫాడర్’ ఒకటి. మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘లూసిఫర్’కు ఇది రీమేక్. మోహన్ రాజా దర్శకత్వంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాను విజయదశమి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం ఫస్ట్ లుక్ టీజర్ని విడుదల చేసింది. ఇందులో చిరు ఇచ్చే మాస్ ఎంట్రీకి రొమాలు నిక్కబొడుచుకోవాల్సిందే! కార్యకర్తలు పార్టీ జెండాలు ఊపుతుండగా.. వారి మధ్య నుంచి బ్లాక్ కలర్ కారు…
సెలెబ్రిటీలు ఏం మాట్లాడినా ఆచితూచి వ్యవహరించాలి. ముఖ్యంగా.. వివాదాస్పద అంశాలకు ఎంత దూరంగా ఉంటే, అంతే మంచిది. ఒకవేళ ఏదైనా అభిప్రాయాన్ని వ్యక్తపరచాలనుకుంటే, అది అవతలివారి మనోభావాల్ని దెబ్బతినకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే.. లేనిపోని సమస్యల్లో చిక్కుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు బాలీవుడ్ నటి స్వర భాస్కర్కు అలాంటి పరిస్థితే వచ్చిపడింది. ఈమెకు ఏకంగా చంపేస్తామంటూ బెదిరింపు లేఖ వచ్చింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో అంశంపై స్పందిస్తూ వార్తల్లోకెక్కే స్వర భాస్కర్..…
‘జీరో’ బోల్తా పడిన తర్వాత కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్ తీసుకున్న బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్.. ఇప్పుడు తిరిగి జోరు పెంచాడు. ఒకదాని తర్వాత మరొక సినిమాల్ని చేస్తున్నాడు. ప్రస్తుతం ఇతను చేస్తున్న మూడు సినిమాలు వచ్చే ఏడాదిలో విడుదలకు సన్నద్ధమవుతున్నాయి. ఇవే కాదు.. సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న ‘టైగర్ 3’లోనూ షారుఖ్ ఓ అతిథి పాత్రలో మెరువనున్నాడు. అయితే, దీనిపై అధికార ప్రకటన ఎప్పుడూ రాలేదు. కేవలం ప్రచారం మాత్రమే జరుగుతోంది.…
కిచ్చా సుదీప్ నటించిన పాన్ ఇండియా త్రీడీ మూవీ ‘విక్రాంత్ రోణ’ వచ్చే నెల 28న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కీలక పాత్ర పోషించింది. ఇటీవల ట్రైలర్ విడుదలైనప్పుడు ముంబై, బెంగళూరులో జరిగిన మీడియా సమావేశాలకు జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హాజరైంది. కానీ ఆ తర్వాత జరిగిన కొచ్చి, చెన్నయ్, హైదరాబాద్ లోని ట్రైలర్ లాంచ్ కార్యక్రమాలకు ఆమె రాలేదు. ఇదే విషయాన్ని హైదరాబాద్ ప్రెస్ మీట్…
బాలీవుడ్ సూపర్స్టార్ సల్మాన్ ఖాన్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. తన తాజా సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్కు వచ్చిన సల్మాన్ ఖాన్, టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్తో కలిసి రామోజీ ఫిల్మ్ సిటీలో మొక్కలు నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 5.0 లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్కో మొక్క ఒక్కో మనిషికి సరిపడా ఆక్సిజన్ను అందిస్తుందని తెలిపారు. మొక్కలు నాటడాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని కోరారు.…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ రోల్లో కనిపించబోతున్నారా.. అంటే ఔననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అది కూడా మెగాస్టార్ సినిమాలో గెస్ట్ రోల్ చేసిన స్టార్ హీరో సినిమాలో అని తెలుస్తోంది. అయితే ఇప్పటికే అందులో ఓ తెలుగు సీనియర్ స్టార్ హీరో ఉండగా.. ఇప్పుడు చెర్రీ కూడా కనిపించబోతుండడం విశేషం. ఇంతకీ చరణ్ ఏ హీరో కోసం గెస్ట్గా మారనున్నాడు.. బాలీవుడ్ ప్లాన్ నిజమేనా..! గతంలో ఓ సారి బాలీవుడ్లో సినిమా చేసి..…
ఉలగనాయగన్ కమల్ హాసన్, మెగాస్టార్ చిరంజీవి కలుసుకోవడం నిజంగా విశేషమే. వారిద్దరూ ఎప్పుడు కలుసుకున్నా అభిమానులకు సంబరమే. ఇటీవల విడుదలైన కమల్ హాసన్ `విక్రమ్` చిత్రం థియేటర్లలో బాగానే సందడి చేస్తోంది. ఈ సందర్భంగా కమల్ హాసన్ ను, చిత్ర దర్శకుడు లోకేశ్ కనగరాజ్ను తన నివాసానికి ఆహ్వానించి మరీ సత్కరించారు చిరంజీవి. సిటీలోనే ఉన్న సల్మాన్ ఖాన్ను కూడా చిరంజీవి ఆహ్వానించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పిక్చర్స్ తోపాటు 1986లో `స్వాతిముత్యం` శతదినోత్సవం సందర్భంగా…
మెగాస్టార్ చిరంజీవి స్వగృహం నందు ఉలగ నాయగన్ కమల్ హాసన్ కు సన్మానం జరిగింది. ఇటీవల కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శనివారం నాడు హైదరాబాదులో ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. విక్రమ్ సినిమా విజయవంతమైన సందర్భంగా తన చిరకాల మిత్రుడిని మెగాస్టార్ చిరంజీవి తన స్వగృహానికి ఆహ్వానించారు. ఆహ్వానించడమే కాక సినిమా అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకున్న సందర్భంగా ఆయనను…
మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’లో బాలీవుడ్ సూపర్స్టార్ సల్మాన్ ఖాన్ ఓ కీలక పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే! చిరంజీవితో ఉన్న సాన్నిహిత్యంతోనే అతడు తన స్టార్డమ్ని పక్కనపెట్టి, చిన్న రోల్ అయినా అది పోషించేందుకు ముందుకొచ్చాడు. ఇప్పుడు అదే సాన్నిహిత్యంతో పవన్ కళ్యాణ్ సినిమాలోనూ ఓ అతిథి పాత్రలో నటించేందుకు సల్మాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఇటీవల ఓ వెబ్సైట్ ఒక న్యూస్ రాసుకొచ్చింది. ఇదో క్రేజీ న్యూస్ కావడంతో, సోషల్ మీడియాలో వెంటనే వైరల్…