చంద్రబాబుపై మరోమారు ఫైర్ అయ్యారు ప్రభుత్వ సలహాదారు సజ్జల. చంద్రబాబు కుప్పంను కబ్జా చేసి కోటలాగా మార్చుకున్నాడని… కుప్పంలో చంద్రబాబును దారుణం ఓడించారని ఆగ్రహించారు. అమరావతి యాత్ర ప్రజల యాత్ర కాదు.. టీడీపీ నేతలే యాత్ర చేస్తున్నారని ఆగ్రహించారు. చంద్రబాబుకు ఎక్కడో చోట గొడవ కావాలి.. అదే ఆయన రాజకీయం అంటూ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు రావాలని చంద్రబాబు కోరుకుంటున్నారని ఆగ్రహించారు. అన్ని వర్గాలకు అభివృద్ధి, సంక్షేమంతో పాటు రాజకీయ పదవుల్లో కూడా…
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ని కలిశారు పోలవరం ప్రాజెక్టు సబ్ కాంట్రాక్టర్లు. గతంలో ట్రాన్స్ రాయ్ సంస్థకు సబ్ కాంట్రాక్టర్లుగా పనిచేసి మోసపోయామని ఫిర్యాదు చేసారు 120 మంది సబ్ కాంట్రాక్టర్లు. గత ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం 20 కోట్లు పైనే ఖర్చు చేసినా బిల్లులు మంజూరు చేయలేదని ఫిర్యాదు చేసారు. అప్పటి నీటిపారుదల శాఖమంత్రి దేవినేని ఉమ చేతిలో తాము మోసపోయామని తెలిపారు కాంట్రాక్టర్లు. ఆర్దికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన…
చంద్రబాబుకు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఓటీఎస్ పై విమర్శించే నైతిక హక్కు చంద్రబాబు కు లేదని ఫైర్ అయ్యారు సజ్జల. పేదలందరూ దశాబ్దాలుగా ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఇళ్లు కట్టుకుని ఉంటున్నారని.. సీఎం జగన్ చొరవతో ఇళ్ల రుణాలన్నీ మాఫీ చేసి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారన్నారు. ఓటీఎస్ పై ప్రజలు సహాయ నిరాకరణ చేయాలని చంద్రబాబు కోరారంటే దాన్ని ఏమనాలో వారే ఆలోచించుకోవాలని చురకలు అంటించారు. ఓటీఎస్ పథకంలో పేదలకు నష్టం కల్గించేది అంటూ ఏదీ…
టీడీపీ అధినేత చంద్రబాబు డా.బీఆర్ అంబేద్కర్ వర్థంతి సందర్బంగా నివాళులు అర్పించారు. అంతేకాకుండా రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికీ హక్కులు ఉన్నాయంటూ వైసీపీ ప్రభుత్వ ఆ హక్కులను కాలరాస్తుందని తీవ్రంగా విమర్శించారు. అంతేకాకుండా ఓటీఎస్ పేరుతో ప్రజలకు వైసీపీ ప్రభుత్వం ఉరి వేస్తోందని చంద్రబాబు ఆరోపించారు. అయితే ఈ నేపథ్యంలో చంద్రబాబు మాటలకు కౌంటర్ గా వైసీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏలో అంబేద్కర్ భావజాలం ఉంది.. ఈ ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే అన్నారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎక్కడా లేని స్థాయిలో దేశంలో భిన్నత్వం ఉంటుంది.. అందరినీ ఒకే తాటిపై నడిపించే విధంగా రాజ్యాంగ రూపకల్పన చేశారు.. వర్ణ, కుల…
ఒన్ టైం సెటిల్మెంట్ పథకం పై ప్రతిపక్ష విమర్శల నేపథ్యంలో అవగాహన కార్యక్రమాల పై ఫోకస్ చేసింది వైసీపీ. ఒన్ టైం సెటిల్మెంట్ పథకం పై పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. దీనికి గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ రంగనాధరాజు, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సజ్జల మాట్లాడుతూ… పేదలకు లబ్ది జరక్కుండా అపోహలు కల్గించి అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు పచ్చమీడియా,…
ఏపీలో భారీవర్షాలు, వరదల కారణంగా అపారమయిన నష్టం సంభవించింది. కడప జిల్లాలో వరద గ్రామాల్లో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి పర్యటించారు. వరద బాధితులను పరామర్శించిన సజ్జల రామకృష్ణా రెడ్డి సహాయక చర్యలను పర్యవేక్షించారు. కడప జిల్లాలో వరద విలయం సృష్టించిందని, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం చేయడంతో ప్రాణనష్టం తగ్గిందన్నారు. వరదల తరువాత ప్రభుత్వం అన్ని రకాలుగా ఉదారంగా సహాయ కార్యక్రమాలు చేపట్టిందని, నిబంధనలు సడలించి సహాయ కార్యక్రమాలు చేశారన్నారు. వరదల కారణంగా పంట నష్టపోయిన…
వ్యవసాయ చట్టాల రద్దుపై మొదటిసారిగా స్పందించిన వైసీపీ పార్టీ.. కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల విజయానికి మద్దతుగా… ఇవాళ ఏపీ వ్యాప్తంగా కొవ్వొత్తులతో ర్యాలీలు చేయాలని నిర్నయం తీసుకుంది. మహాత్మాగాంధీ స్పూర్తిని, శక్తిని ప్రతిబింబింపజేసేలా… భారత ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే ఓ గొప్ప విజయాన్ని సాధించిన రైతాంగానికి మద్ధతుగా… ఈ రోజు సాయంత్రం రాష్ట్రంలోని 175 నియోజకవర్గంలో కొవ్వొత్తులతో రైతు సంఘీభావ ర్యాలీలు నిర్వహించవలసిందిగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు…
వైసీపీలో అంతా తానై సజ్జలే నడిపిస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. ఈ సందర్భంగా వర్ల రామయ్య మాట్లాడుతూ .. సజ్జలపై సంచలన ఆరోపణలు చేశారు. సజ్జల మరో సారి ప్రెస్మీట్ పెడితే హైకోర్టుకు వెళ్తామన్నారు. ప్రభుత్వంలో పిల్లి ఈనినా.. కుక్క అరిచినా సజ్జలే సమాధానం చెబుతున్నా రన్నారు. వైఎస్ సీఎంగా ఉన్న రోజుల్లో జగన్ బెంగళూరులో ఉన్నప్పుడు ఆయ నతోనే కలిసి సజ్జలే ఉండేవారని ఆయన అన్నారు. ఒకే కంచం.. ఒకే…
కుప్పం మొత్తం ఓటర్లు సుమారుగా 37 వేలు. మొదటి సారి మున్సిపాలిటీ అయిన కుప్పం ఎన్నికల గురించి చంద్రబాబు మాట్లాడిన వ్యాఖ్యలు చూస్తే బాధేసింది అని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. ఇటువంటి వ్యక్తిని రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఎలా భరించింది అనిపించింది. జనసేన, టీడీపీ, బీజేపీ ఒకే తాను ముక్కలు. ఈ మూడు పార్టీలు లోపాయకారి ఒప్పందం చేసుకుని వ్యవహరిస్తున్నాయి. చంద్రబాబు కుప్పాన్ని చెరబట్టారు. ఆయన చెరలో కుప్పం దశాబ్దాలుగా నలిగిపోయింది.…