సోమవారం రష్యాలో “విజయ దినం కవాతు” జరగనుంది. “విక్టరీ డే పరేడ్”గా ప్రసిద్ధి గాంచిన ఈ మెగా ఈవెంట్ కు పుతిన్ సర్కార్ ఘనంగా ఏర్పాట్లు చేసింది. వేలాదిగా సైనికులు, వందల సంఖ్యలో యుద్ధ ట్యాంకులు, భారీ సైనిక వాహనాలు రాజధాని మాస్కో నడిబొడ్డున రెడ్ స్క్వేర్ గుండా ప్రదర్శనగా సాగిపోనున్నాయి. ఆకాశంలో ఫైటర్ జెట్లు గర్జిస్తుండగా రష్యా తన సైనిక పాటవాన్ని ప్రపంచానికి ప్రదర్శించనుంది. రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై సోవియట్ యూనియన్ విజయానికి…
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా వంటనూనెల ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. మరోవైపు ఇండోనేషియా వంటి దేశాలు పామాయిల్ దిగుమతులపై నిషేధం విధించడం కూడా వంటనూనెల ధరలకు రెక్కలు రావడానికి కారణమైంది. దీంతో మూడు నెలలుగా దాదాపు కిలో వంట నూనె ధర రూ.70 నుంచి రూ.100 పెరిగింది. అయితే త్వరలోనే వంట నూనెల ధరలు తగ్గించేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వంట నూనెల విషయంలో ఇండియా సుమారు 60 శాతం…
అసలే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతో అల్లాడుతున్న సామాన్యులకు మరో షాక్ తగిలింది. సబ్బుల ధరలను పెంచుతూ హిందూస్థాన్ యూనీలివర్ కంపెనీ నిర్ణయం తీసుకుంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా సన్ఫ్లవర్, పామాయిల్, సోయాబీన్ దిగుమతులపై ప్రభావం పడటంతో సబ్బుల తయారీ కంపెనీలకు నష్టం వాటిల్లుతోంది. ఈ మేరకు పలు సబ్బుల ధరలను 3 నుంచి 7 శాతం మేరకు హెచ్యూఎల్ పెంచింది. దీంతో సర్ఫ్ ఎక్సల్, వీల్, రిన్ వంటి డిటర్జెంట్ పౌడర్లతో పాటు డోవ్, లక్స్,…
ఉక్రెయిన్లో రష్యా దాడి మొదలై 25 రోజులు దాటింది. సైనిక చర్య అనేది ఇప్పుడు అది పూర్తి స్థాయి యుద్ధాన్ని తలపిస్తోంది. చర్చలు ఓ కొలిక్కి వచ్చే సూచనలు కనిపించటం లేదు. మరోవైపు రష్యా బలగాలు ఉక్రెయిన్ నగరాలలో విధ్వంసం సృష్టిస్తోంది. దేశంలో రెండో ప్రధాన నగరం మారియుపోల్ సర్వనాశనం అయింది. ఎక్కడ చూసినా యుద్ధం తాలూకు ధ్వంసమే. ప్రస్తుతం ఈ నగరం రష్యా దళాల స్వాధీనంలో ఉన్నట్టు తెలుస్తోంది. అటు పుతిన్ బలగాలు రాజధాని కీవ్కు…
ఉక్రెయిన్ యుద్ధం రోజులకు రోజులుగా సాగుతుండటం రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ ఆలోచనలపై తీవ్ర ప్రభావం చూపుతోందా? ఆయన అనుకున్నది ఒకటైతే జరుగుతోంది మరొకటా? రష్యా సైన్యం ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భావవనలో ప్రస్తుతం పుతిన్ ఉన్నారు. సంవత్సరాలుగా ఆయన మనసెరిగిన పశ్చిమ దేశాల గూఢచార వర్గాలు ఈ అంచనాకు వచ్చారు. పుతిన్ ఇకముందు ఎలాంటి చర్యలకు దిగుతాడో ఆర్థంకాక ఆందోళన చెందుతున్నారు. ఉక్రెయిన్పై యుద్దం సాగుతున్న తీరు పుతిన్ను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తోంది. ఆయన ఆరోగ్యంపైనా అనుమనాలు…
ఉక్రెయిన్పై రష్యా భీకర స్థాయిలో దాడులకు తెగబడుతోంది. ఈ నేపథ్యంలో రష్యా చర్యలను ప్రపంచ దేశాలు తప్పుబడుతున్నాయి. అటు రష్యా కూడా ఎప్పుడు ఏం జరుగుతోంది తెలియక సతమతం అవుతోంది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో రష్యా ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్న వస్తువు ఏమైనా ఉందంటే.. అది కండోమ్ అని ఆ దేశపు ప్రముఖ ఆన్లైన్ రీటెయిలర్ వైల్డ్బెర్రీస్ వెల్లడించింది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ప్రస్తుతం రష్యాలో కండోమ్ అమ్మకాలు 170 శాతం పెరిగాయని…
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం కారణంగా పలు దేశాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటున్నాయి. ఈ జాబితాలో భారత్ కూడా ఉంది. ముఖ్యంగా చమురు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగిపోవడంతో భారత్లో టోకు విక్రయదారులకు అమ్మే డీజిల్ ధరను లీటరుకు రూ.25 పెంచారు. ఈ మేరకు దేశంలోని ప్రధాన చమురు సంస్థలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం ప్రభావంతో అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధర 40 శాతం పెరిగింది. బ్యారెల్ క్రూడాయిల్ ధర…
రష్యా దాడులతో ఉక్రెయిన్ విలవిల్లాడుతోంది. ఉక్రెయిన్లోని ప్రధాన నగరాలపై క్షిపణి దాడులతో రష్యా బలగాలు మారణహోమం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా మేరియుపోల్ నగరంలో పరిస్థితులు దారుణంగా మారాయి. అక్కడ శవాల గుట్టలు అంతకంతకూ పేరుకుపోతున్నాయి. ఇప్పటివరకు దాదాపు 2,500 మరణించారని ఉక్రెయిన్ అధ్యక్షుడి సలహాదారు ఒలెక్సీ అరిస్టోవిచ్ వెల్లడించారు. మేరియుపోల్కు చేరుకునే మానవతా సాయాన్ని కూడా రష్యా అడ్డుకుంటోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గడిచిన రెండు రోజుల్లోనే మరణాల సంఖ్య భారీగా పెరిగిందని చెప్పారు. రష్యా దాడులు…
ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది.. ఓ వైపు ఉక్రెయిన్ చర్చలకు ప్రతిపాదనలు పంపుతున్నా.. రష్యా మాత్రం దాడులు చేస్తూనే ఉంది.. ఇక, రష్యాతో నాటో ప్రత్యక్ష పోరుకు దిగితే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని వార్నింగ్ ఇచ్చారు అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్. ఆ పరిణామాలను నివారించేందుకే ఉక్రెయిన్ విషయంలో రష్యాతో అమెరికా నేరుగా పోరాటం చేయట్లేదని వెల్లడించారు. అయితే ఉక్రెయిన్పై రష్యా రసాయన ఆయుధాలు వినియోగిస్తే.. భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు.…
ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం ప్రభావం చమురు ధరలపై విపరీతంగా చూపిస్తోంది. ఫలితంగా పలు దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా శ్రీలంకలో చమురు ధరలను పెంచుతున్నట్లు ఎల్ఐవోసీ ప్రకటించింది. ఈ మేరకు లీటర్ పెట్రోల్ ధర రూ.50, లీటర్ డీజిల్ ధర రూ.75 పెంచుతున్నట్లు తెలిపింది. ధరలను పెంచిన అనంతరం లీటర్ పెట్రోల్ ధర రూ.254కి చేరింది. లీటర్ డీజిల్ ధర రూ.214కి చేరింది. మరోవైపు శ్రీలంక రూపాయి భారీగా పతనమైంది. ఈ…