టీ20 క్రికెట్లో హిట్మ్యాన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టీ20ల్లో 12 వేల పరుగులు పూర్తి చేసిన రెండో భారతీయుడిగా రోహిత్ రికార్డుల్లోకెక్కాడు. ఐపీఎల్ 2025లో భాగంగా బుధవారం ఉప్పల్ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్పై (70; 46 బంతుల్లో 8×4, 3×6) హాఫ్ సెంచరీ బాదడంతో ఈ మైలురాయిని సాధించాడు. జాబితాలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (13,208) హిట్మ్యాన్ కంటే ముందున్నాడు. మొత్తంగా టీ20 క్రికెట్లో 12 వేల పరుగులు చేసిన ఎనిమిదవ…
SRH vs MI: ఐపీఎల్ 2025 (18వ సీజన్)లో ముంబై ఇండియన్స్ చెలరేగిపోతోంది. ప్రారంభ మ్యాచ్లో ఓటమిని చవిచూసిన హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని జట్టు, ఆ తర్వాత వరుసగా నాలుగు విజయాలతో ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. బుధవారం జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ను ముంబై 7 వికెట్ల తేడాతో ఓడించింది. హైదరాబాద్ నిర్దేశించిన 143 పరుగుల లక్ష్యాన్ని ముంబై సులువుగా ఛేదించింది. ఓపెనర్ రోహిత్ శర్మ 36 బంతుల్లో 70 పరుగులు చేసి ముంబై విజయానికి…
CSK vs MI: ఐపీఎల్ 2025 సీజన్లో ముంబై ఇండియన్స్ తమ హ్యాట్రిక్ విజయాన్ని నమోదుచేసింది. చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై జట్టు ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో ముంబై 15.4 ఓవర్లలోనే కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి గెలుపొందింది. ముంబై విజయానికి రోహిత్ శర్మ…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2025) రసతవత్తరంగా సాగుతోంది. రోజు రోజుకూ అభిమానుల్లో ఉత్సాహం పెరుగుతూ వస్తోంది. ఈ సీజన్లో చాలా మంది ఆటగాళ్లు తమ ప్రదర్శనతో అభిమానుల హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు. కానీ.. మంచి ప్రదర్శన ఇస్తారని భావించిన కొంత మంది ఆటగాళ్ళు మాత్రం నిరాశ పరుస్తున్నారు. వీళ్లను భారీ మొత్తంలో డబ్బులు వెచ్చించి కొన్నా.. వీరి ప్రదర్శన ఇప్పటివరకు పేలవంగా ఉంది. ఫ్రాంచైజీలు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన ఇలాంటి 5 మంది ఆటగాళ్ల…
దేశ రాజధాని ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం దుమ్ము తుపానుతో పాటు మోస్తరు వర్షం కురిసింది. ఢిల్లీ నగరంలో నిన్న సాయంత్రం బలమైన ఈదురు గాలులు వీచాయి. దాంతో కొన్నిచోట్ల చెట్టు కొమ్మలు విరిగిపడ్డాయి. ఢిల్లీ విమానాశ్రయంలో పలు విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ దుమ్ము ఎఫెక్ట్ ముంబై ఇండియన్స్ జట్టు ప్రాక్టీస్ పైనా పడింది. దుమ్ము దుమారం కారణంగా ఎంఐ ప్లేయర్స్ హుటాహుటిన మైదానంను వీడాల్సి వచ్చింది. ఐపీఎల్ 2025లో భాగంగా ఆదివారం…
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు అరుదైన గౌరవం దక్కనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలోని ఒక స్టాండ్కు హిట్మ్యాన్ పేరు పెట్టాలనే ప్రతిపాదనను ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) పరిశీలిస్తోంది. తాజాగా జరిగిన సమావేశంలో ఎంసీఎ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత జట్టుకు చేసిన సేవలకు గాను రోహిత్ను ప్రత్యేక గౌరవంతో గుర్తించాలని ఎంసీఎ భావిస్తోంది. ఈ మేరకు ఇండియన్ ఎక్స్ప్రెస్ తమ కథనంలో పేర్కొంది. వాంఖడే స్టేడియంలోని స్టాండ్స్, వాక్వేలకు మాజీ అధ్యక్షులు…
Rohith Sharma: రోహిత్ శర్మ.. ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. భారత జట్టుకు ఎన్నో విజయాలను అందించిన హిట్మ్యాన్ తన అద్భుత బ్యాటింగ్తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. 2007లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన రోహిత్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో అనేక రికార్డులను సృష్టించాడు. వన్డే క్రికెట్లో మూడు డబుల్ సెంచరీల వ్యక్తిగా ఇంకా అనేక రకాల రికార్డులను కైవసం చేసుకొని తనదైన ముద్ర వేసుకున్నాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్…
Team India Captain: ప్రపంచవ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన క్రికెట్ పరిపాలనా సంస్థల్లో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఒకటి. భారత క్రికెట్ను పర్యవేక్షిస్తూ, జట్టును నిర్వహించే బాధ్యత బీసీసీఐకి ఉంది. దేశవాళీ క్రికెట్ నుంచి అంతర్జాతీయ స్థాయిలో భారత క్రికెట్ను మరింత అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇకపోతే గాయాలతో సతమతమైన శ్రేయస్ అయ్యర్, బీసీసీఐ ఆగ్రహానికి గురై భారత జట్టులో తన స్థానాన్ని కోల్పోయాడు. అంతేకాకుండా, సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించబడ్డాడు. ఐపీఎల్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. వరుసగా రెండు మ్యాచ్లలో ఓడిన ముంబై.. డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్కతా నైట్ రైడర్స్ను ఓడించి విజయంను ఖాతాలో వేసుకుంది. టీమ్ విజయం సాధించినా.. అభిమానులను మాత్రం ఓ విషయం ఆందోళన కలిగిస్తోంది. అది మరేదో కాదు.. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పేలవ ఫామ్. ఐపీఎల్ 2025లో ఆడిన మూడు మ్యాచ్లలో హిట్మ్యాన్ 21 పరుగులు మాత్రమే చేశాడు. ఫాన్స్ మాత్రమే…
ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పేలవ ఫామ్ కొనసాగుతోంది. ముంబై ఆడిన మూడు మ్యాచ్లలో హిట్మ్యాన్ 21 పరుగులు మాత్రమే చేశాడు. గత రాత్రి కోల్కతా నైట్ రైడర్స్పై 13 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. పేలవ ఫామ్తో ఇబ్బందిపడుతున్న రోహిత్పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా రోహిత్ ఫామ్పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ స్పందించాడు. రోహిత్ కాబట్టే ఇంకా టీంలో కొనసాగుతున్నాడని, ఈ స్థానంలో మరో ఆటగాడు…