Team India: రోహిత్ శర్మ కీలక నిర్ణయం.. ఇంగ్లండ్ టూర్కు దూరం..!
- ఇంగ్లాండ్ పర్యటనకు రోహిత్ శర్మ దూరం..!
- టెస్ట్ సిరీస్లో భారత కెప్టెన్ ఆడటం కష్టమే
- బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో విఫలం కారణంగా ఈ నిర్ణయం
- విరాట్ కోహ్లీ ఆడనున్నట్లు సమాచారం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ఏడాది చివరలో ఇంగ్లాండ్తో జరగబోయే టెస్ట్ సిరీస్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఆడటం కష్టమే. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో విఫలమైన రోహిత్.. ఈ సిరీస్లో పాల్గొనకూడదని అతను నిర్ణయించుకున్నట్లు క్రీడా వర్గాలు వెల్లడించాయి. మరోవైపు.. బీజీటీలో ఫెయిల్ అయిన కోహ్లీ మాత్రం ఆడనున్నట్లు తెలుస్తోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కోహ్లీ, రోహిత్ అనుకున్నంత ప్రదర్శన కనబరచలేకపోయారు. ఈ క్రమంలో.. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన టెస్ట్ మ్యాచ్లో రోహిత్ శర్మ ఆడలేదు.
Read Also: JR NTR : త్రిబుల్ ఆర్ చూసి తెలుగు నేర్చుకున్న ఎన్టీఆర్ జపాన్ అభిమాని..
Also Read
- Ration Card Holders: రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త.. ఇక 15 రోజుల్లోనే..
- Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
- YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రా నాయకత్వంలో పెర్త్ స్టేడియంలో జరిగిన తొలి టెస్ట్లో కూడా రోహిత్ పాల్గొనలేదు. అడిలైడ్ ఓవల్లో జరిగిన డే-నైట్ టెస్టులో ఆడినప్పటికీ.. రోహిత్ శర్మ తన ఫామ్ను తిరిగి పొందలేకపోయారు. మూడు మ్యాచ్లలో అతను 6.20 సగటుతో కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో.. ఈ సిరీస్లో రోహిత్ శర్మ పూర్తిగా విఫలమయ్యారు. కాగా.. సిడ్నీ టెస్ట్ నుంచి పక్కకు తప్పుకోవడంతో రిటైర్మెంట్ తీసుకుంటున్నాడనే వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో.. టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ఇచ్చే ఉద్దేశ్యం తనకు లేదని రోహిత్ చెప్పాడు . “ఇది రిటైర్మెంట్ నిర్ణయం కాదు. నేను టెస్టుల నుండి వైదొలగడం లేదు. నేను బ్యాట్తో పరుగులు సాధించలేకపోయాను. కాబట్టి ఈ ఆట నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను,” అని రోహిత్ చెప్పారు. “2 నెలలు లేదా 5 నెలల తర్వాత నేను పరుగులు సాధిస్తాననే గ్యారంటీ లేదు” అని ఆయన తన అనుభవాన్ని వెల్లడించారు.
Read Also: Ambati Rayudu: ఐపీఎల్లో అతనే నన్ను బాగా ఇబ్బంది పెట్టాడు.. అంబటి రాయుడు హాట్ కామెంట్స్
మరోవైపు.. పెర్త్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో విరాట్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత రంజీ ట్రోఫీలో ఆడినప్పటికీ.. పెద్ద స్కోరు సాధించలేకపోయాడు. కాగా.. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజయం సాధించడానికి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ కీలకపాత్ర పోషించారు. ఫైనల్లో రోహిత్ మ్యాచ్ విన్నింగ్ (76) ప్రదర్శన కనబరచగా.. విరాట్ కోహ్లీ పాకిస్తాన్, ఆస్ట్రేలియాపై వరుసగా 100 నాటౌట్, 84 పరుగులు చేశాడు. కాగా.. టీమిండియా ఈ ఏడాది జూన్ 20న ఇంగ్లాండ్ పర్యటనను ప్రారంభిస్తుంది. మొదటి టెస్ట్ మ్యాచ్ హెడింగ్లీలోని లీడ్స్ వేదికగా జరుగనుంది. తదుపరి నాలుగు టెస్ట్లు ఎడ్జ్బాస్టన్, లార్డ్స్, ఓల్డ్ ట్రాఫోర్డ్, కెన్నింగ్టన్ ఓవల్ వేదికలపై జరగనున్నాయి.
తాజావార్తలు
-
Ration Card Holders: రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త.. ఇక 15 రోజుల్లోనే..
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్ఫర్డ్కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!