టీమిండియా వికెట్ కీపర్-బ్యాట్స్మన్ రిషబ్ పంత్ 2022 డిసెంబర్ 30న కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.. పంత్ ఢిల్లీ నుంచి రూర్కీ తన ఇంటికి వెళ్తుండగా.. డెహ్రాడూన్ హైవేపై అతని కారు ప్రమాదానికి గురైంది. అయితే.. హైవేపై ప్రయాణిస్తున్న కొంతమంది వ్యక్తులు పంత్ ప్రాణాలను కాపాడారు. అయితే.. పంత్ ప్రాణాలను కాపాడిన వ్యక్తులలో రజత్ అనే యువకుడు కూడా ఉన్నాడు. ప్రస్తుతం అతను చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతున్నాడు.
Rishabh Pant on Car Accident: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ తాను జనం చూస్తే ఎలా అన్న భయంతో చక్రాల కుర్చీలో విమానాశ్రయానికి వెళ్లడానికి ఇష్టపడలేదని టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ తెలిపాడు. తాను అస్సలు బతుకుతానని కూడా అనుకోలేదని, కానీ దేవుడు దయతలిచాడు అని పేర్కొన్నాడు. 2022 డిసెంబరు 30న పంత్ కారు ప్రమాదంకు గురయ్యాడు. నూతన సంవత్సర వేడుకల కోసం ఇంటికి వెళుతుండగా.. వేగంగా వెళుతున్న పంత్ కారు డివైడర్ను ఢీకొట్టి…
Ricky Ponting: కారు యాక్సిడెంట్ కారణంగా తీవ్రంగా గాయపడ్డ టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ రిషభ్ పంత్ ఇప్పట్లో కోలుకునే ఛాన్స్ లేదని తెలుస్తోంది. దీంతో అతడు ఐపీఎల్-2023కి అందుబాటులో ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలో పంత్ గైర్హాజరీపై స్పందించిన ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్.. అతడి సేవలు కోల్పోవడం బాధాకరమని వెల్లడించాడు. అయితే ఒకవేళ పంత్ శరీరం ప్రయాణం చేయడానికి సహకరిస్తే అతడిని తమతో పాటు మ్యాచ్లకు తీసుకువెళ్తామని చెప్పాడు. పంత్ లాంటి సరదా…
ఇటీవల ప్రమాదానికి గురైన స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ ప్రాణాలను కాపాడిన హర్యానా రోడ్వేస్ డ్రైవర్, ఆపరేటర్ను తమ ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవించనున్నట్లు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆదివారం ప్రకటించారు.
Rishabh Pant Health Condition: నిన్న రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, అతని ప్రాణానికి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం రిషభ్కు డెహ్రాడూన్ మ్యాక్స్ ఆసుపత్రిలో వైద్యం కొనసాగుతోంది. మెదడు లేదా వెన్నుకు ఎటువంటి గాయాలు కాలేదని వైద్యులు తెలిపారు. ఈరోజు అతనికి మరోసారి ఎమ్ఆర్ఐ సహా పలు పరీక్షలు జరపనున్నారు. అటు ప్రధాని మోడీ నిన్న రాత్రి రిషబ్ కుటుంబ సభ్యులతో ఫోన్లో…
భారత క్రికెటర్ రిషబ్ పంత్ శుక్రవారం ఉదయం ఉత్తరాఖండ్లోని రూర్కీ సమీపంలో ప్రమాదానికి గురై గాయాలపాలైన కొన్ని గంటల తర్వాత, నటి ఊర్వశి రౌతేలా తాను 'ప్రార్థిస్తున్నాను' అని పోస్ట్ చేసింది.