Rishabh Pant Accident: భారత క్రికెటర్ రిషబ్ పంత్ శుక్రవారం ఉదయం ఉత్తరాఖండ్లోని రూర్కీ సమీపంలో ప్రమాదానికి గురై గాయాలపాలైన కొన్ని గంటల తర్వాత, నటి ఊర్వశి రౌతేలా తాను ‘ప్రార్థిస్తున్నాను’ అని పోస్ట్ చేసింది. క్రికెటర్ త్వరగా కోలుకోవాలని ఊర్వశి అన్ని వర్గాల ప్రజలతో కలిసి ప్రార్థనలు చేసింది. అయితే, ఆమె రిషబ్ గురించి లేదా అతని ప్రమాదం గురించి ప్రస్తావించలేదు. రిషబ్ కారు రోడ్డు డివైడర్ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి, క్రికెటర్ను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి, తర్వాత డెహ్రాడూన్కు తరలించారు. ప్రాథమిక నివేదికల ప్రకారం పంత్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. అతని తలపై గాయాలు, అతని కుడి చీలమండపై లిగమెంట్ గాయం ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
ఊర్వశి పోస్ట్పై చాలా మంది ‘రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలి’ అని కామెంట్లు చేశారు. 2018లో ఒక హోటల్ లాబీలో తనను కలవడానికి రిషబ్ పంత్ గంటల తరబడి వేచి ఉన్నాడని ఊర్వశి ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నప్పటి నుంచి రిషబ్ పంత్, ఊర్వశి డేటింగ్లో ఉన్నారని పుకార్లు పుట్టుకొచ్చాయి. 2018లోనే ఊర్వశి, రిషబ్ ముంబైలోని అనేక ప్రసిద్ధ రెస్టారెంట్లు, పార్టీలు,ఈవెంట్లలో కనిపించడంతో వారు డేటింగ్లో ఉన్నారని పుకార్లు మొదలయ్యాయి. చాలా కాలం తరువాత అదే సంవత్సరం ఇద్దరూ వాట్సాప్లో ఒకరినొకరు బ్లాక్ చేసుకున్నారని నివేదికలు పేర్కొన్నాయి.2019లో రిషబ్ పుకార్లను తోసిపుచ్చాడు. స్నేహితురాలు ఇషా నేగితో తన సంబంధాన్ని ప్రకటించాడు. అతను ఇన్స్టాగ్రామ్లో ఇషాతో ఉన్న చిత్రాన్ని పంచుకున్నాడు. ఆమె కోసం ఒక సందేశాన్ని రాశాడు, “నేను చాలా సంతోషంగా ఉండటానికి కారణం నువ్వే కాబట్టి నిన్ను సంతోషపెట్టాలనుకుంటున్నాను.” అంటూ ఇషాను ఉద్దేశించి రాసుకొచ్చాడు. దీంతో అవన్నీ పుకార్లని తేలిపోయింది.
Rishab Pant Injury: నిద్రమత్తులో కారు నడిపిన పంత్.. అందుకే ప్రమాదం
రూర్కీలోని నర్సన్ సరిహద్దులో కారు డివైడర్ను ఢీకొట్టడంతో భారత క్రికెటర్కు తీవ్ర ప్రమాదం జరిగింది. రిషబ్ పంత్ను డెహ్రాడూన్లోని మ్యాక్స్ ఆసుపత్రిలో చేర్చినట్లు హరిద్వార్ ఎస్పీ (రూరల్) స్వపన్ కిషోర్ తెలిపారు. కారులో ఒంటరిగా ఉన్న పంత్కు వీపు, నుదురు, కాలికి గాయాలయ్యాయి. ఢిల్లీ-డెహ్రాడూన్ హైవేపై పంత్ కారు నడుపుతూ ప్రమాదానికి గురయ్యాడు. కారు పూర్తిగా కాలిపోయింది.