Rishabh Pant Accident: ప్రార్థనలు చేస్తున్న ఊర్వశి.. పంత్ కోసమేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rishabh Pant Accident: భారత క్రికెటర్ రిషబ్ పంత్ శుక్రవారం ఉదయం ఉత్తరాఖండ్లోని రూర్కీ సమీపంలో ప్రమాదానికి గురై గాయాలపాలైన కొన్ని గంటల తర్వాత, నటి ఊర్వశి రౌతేలా తాను ‘ప్రార్థిస్తున్నాను’ అని పోస్ట్ చేసింది. క్రికెటర్ త్వరగా కోలుకోవాలని ఊర్వశి అన్ని వర్గాల ప్రజలతో కలిసి ప్రార్థనలు చేసింది. అయితే, ఆమె రిషబ్ గురించి లేదా అతని ప్రమాదం గురించి ప్రస్తావించలేదు. రిషబ్ కారు రోడ్డు డివైడర్ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి, క్రికెటర్ను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి, తర్వాత డెహ్రాడూన్కు తరలించారు. ప్రాథమిక నివేదికల ప్రకారం పంత్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. అతని తలపై గాయాలు, అతని కుడి చీలమండపై లిగమెంట్ గాయం ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
Also Read
- Explained: పార్టీ vs ప్రజాబలం.. సొంతవారే వెన్నుపోటు పొడిచిన వేళ.. ఇందిర గాంధీలా మమత హిస్టారికల్ కమ్బ్యాక్ ఇస్తారా?
- FIFA World Cup 2026: 16 ఏళ్ల తర్వాత తొలి విజయం.. చెక్ రిపబ్లిక్ పై 'దక్షిణ కొరియా' సంచలన విజయం.!
- Petrol Diesel Purchase: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక వారికి బంకుల్లో నో పెట్రోల్, డీజిల్!
- Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
View this post on Instagram
ఊర్వశి పోస్ట్పై చాలా మంది ‘రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలి’ అని కామెంట్లు చేశారు. 2018లో ఒక హోటల్ లాబీలో తనను కలవడానికి రిషబ్ పంత్ గంటల తరబడి వేచి ఉన్నాడని ఊర్వశి ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నప్పటి నుంచి రిషబ్ పంత్, ఊర్వశి డేటింగ్లో ఉన్నారని పుకార్లు పుట్టుకొచ్చాయి. 2018లోనే ఊర్వశి, రిషబ్ ముంబైలోని అనేక ప్రసిద్ధ రెస్టారెంట్లు, పార్టీలు,ఈవెంట్లలో కనిపించడంతో వారు డేటింగ్లో ఉన్నారని పుకార్లు మొదలయ్యాయి. చాలా కాలం తరువాత అదే సంవత్సరం ఇద్దరూ వాట్సాప్లో ఒకరినొకరు బ్లాక్ చేసుకున్నారని నివేదికలు పేర్కొన్నాయి.2019లో రిషబ్ పుకార్లను తోసిపుచ్చాడు. స్నేహితురాలు ఇషా నేగితో తన సంబంధాన్ని ప్రకటించాడు. అతను ఇన్స్టాగ్రామ్లో ఇషాతో ఉన్న చిత్రాన్ని పంచుకున్నాడు. ఆమె కోసం ఒక సందేశాన్ని రాశాడు, “నేను చాలా సంతోషంగా ఉండటానికి కారణం నువ్వే కాబట్టి నిన్ను సంతోషపెట్టాలనుకుంటున్నాను.” అంటూ ఇషాను ఉద్దేశించి రాసుకొచ్చాడు. దీంతో అవన్నీ పుకార్లని తేలిపోయింది.
Rishab Pant Injury: నిద్రమత్తులో కారు నడిపిన పంత్.. అందుకే ప్రమాదం
రూర్కీలోని నర్సన్ సరిహద్దులో కారు డివైడర్ను ఢీకొట్టడంతో భారత క్రికెటర్కు తీవ్ర ప్రమాదం జరిగింది. రిషబ్ పంత్ను డెహ్రాడూన్లోని మ్యాక్స్ ఆసుపత్రిలో చేర్చినట్లు హరిద్వార్ ఎస్పీ (రూరల్) స్వపన్ కిషోర్ తెలిపారు. కారులో ఒంటరిగా ఉన్న పంత్కు వీపు, నుదురు, కాలికి గాయాలయ్యాయి. ఢిల్లీ-డెహ్రాడూన్ హైవేపై పంత్ కారు నడుపుతూ ప్రమాదానికి గురయ్యాడు. కారు పూర్తిగా కాలిపోయింది.
తాజావార్తలు
-
Explained: పార్టీ vs ప్రజాబలం.. సొంతవారే వెన్నుపోటు పొడిచిన వేళ.. ఇందిర గాంధీలా మమత హిస్టారికల్ కమ్బ్యాక్ ఇస్తారా?
-
Jailer 2 : జైలర్ 2లో బాలీవుడ్ గ్రీక్ గాడ్ స్పెషల్ క్యామియో
-
Vaibhav Sooryavanshi: అర్ధరాత్రి 2 గంటలకు గదిలో లేని వైభవ్.. టెన్షన్ పడిపోయిన బుడ్డోడి తల్లి!
-
FIFA World Cup 2026: 16 ఏళ్ల తర్వాత తొలి విజయం.. చెక్ రిపబ్లిక్ పై ‘దక్షిణ కొరియా’ సంచలన విజయం.!
-
Sing Geetham Review : సింగ్ గీతం రివ్యూ.. సింగీతం ప్రయోగం ఎలా ఉందంటే?
ట్రెండింగ్
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!