Rishabh Pant: అవన్నీ తప్పుడు వార్తలు.. అదే నిజమైతే పంత్ బతికేవాడు కాదు
Police Thrashes Fake News On Rishabh Pant Accident: ఓవైపు టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే.. మరోవైపు అతని గురించి కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. తాగి నడపడం వల్లే అతని కారు ప్రమాదానికి గురైందంటూ సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. తాగిక మైకంలోనే పంత్ డివైడర్ని ఢీ కొట్టాడని, లేకపోతే ఈ ప్రమాదం సంభవించేదే కాదని చెప్తున్నారు. అయితే.. అందులో ఏమాత్రం వాస్తవం లేదంటూ, ఆ ప్రచారాన్ని పోలీసులు ఖండించారు. ప్రమాదం జరిగిన సమయంలో పంత్ మద్య సేవించలేదని, అతడు తాగి కారు నడపలేదని, ఇవన్నీ తప్పుడు వార్తలు స్పష్టం చేశారు. ఒకవేళ పంత్ తాగి కారు నడిపి ఉంటే.. అంత దూరం ఎలాంటి వస్తాడని తిరిగి ప్రశ్నించారు. యాక్సిడెంట్ జరిగినప్పుడు పంత్ సాధారణ స్థితిలోనే ఉన్నట్లు వైద్యులు నిర్థారించారన్నారు.
Road Accident: హైదరాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
Also Read
- MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
- Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
- KKR Vs SRH: సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరో విజయానికి బ్రేక్..? కేకేఆర్లోకి స్టార్ ప్లేయర్ ఎంట్రీ..
- T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్కు భారత మహిళల జట్టు ప్రకటన.. కొత్త వాళ్లకు చోటు..
హరిద్వార్ సీనియర్ ఎస్పీ అజయ్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘మేము సుమారు 8, 10 స్పీడ్ కెమెరాలను పరిశీలించాం. ఒకవేళ పంత్ మద్యం సేవించి ఉంటే, ఢిల్లీ నుంచి 200 కి.మీ. దూరం ప్రయాణం చేసేవాడు కాదు. ప్రమాదం జరిగినప్పుడు పంత్ సాధారణ స్థితిలోనే ఉన్నాడని, అతనికి ప్రాథమిక చికిత్స అందించిన వైద్యుడు వెల్లడించాడు. పంత్ మద్యం సేవించలేదు కాబట్టే.. కారులో నుంచి బయటకు రాగలిగాడు. నిజానికి.. తాగినవాళ్లు ఆ సమయంలో కారు నుంచి బయటకు రాలేరు. మద్యం మత్తులో ప్రాణాలు కోల్పోయేవారు. పంత్ తాగలేదు కాబట్టే, బయటకు వచ్చాడు. పైగా.. పంత్ను రక్షించిన బస్ డ్రైవర్తో కూడా పంత్ మాములుగానే మాట్లాడాడు. అది సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డ్ అయ్యింది. పంత్ తన కారుని 80 కిలోమీటర్ల వేగ పరిమితికి మించి నడపలేదు. బహుశా నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుంది. అయితే.. 80 కిమీ వేగంతో నడపడం వల్లే కారు గాల్లో పల్టీలు కొట్టింది’’ అని చెప్పారు.
Bhakthi Tv New Year Stothra Parayanam Live: న్యూ ఇయర్ మొదటి రోజున ఈ స్తోత్రాలు వింటే….
తమ టెక్నికల్ టీమ్ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారని, అక్కడ ఓవర్ స్పీడ్కు సంబంధించిన ఆధారాలు ఏవీ లభించలేదని అజయ్ సింగ్ తెలిపారు. నిజానిజాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారాలు చేయడం ఏమాత్రం సమంజసం కాదని అన్నారు. కాగా.. పంత్ ప్రస్తుతం డెహ్రాడూన్లోని మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనికి ప్లాస్టిక్ సర్జరీ చేశారు. తీవ్ర గాయాలు అవ్వడంతో.. పంత్ కోలుకోవడానికి కనీసం ఆరు నెలల సమయం పడుతుందని వైద్యులు పేర్కొన్నారు. దీంతో.. అతడు ఈ ఏడాది క్రికెట్ ఆడటం అనుమానాస్పదంగా మారింది.
తాజావార్తలు
-
Texas Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!
-
NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?
-
MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
-
High Voltage Drama: ప్రియుడిపై ప్రేమ.. టవర్పై డ్రామా! సినిమాను మించిన సీన్ చూపించిన మైనర్ బాలిక..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!